గువాహటి-న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రారంభించిన ప్రధాని మోదీ
అసోంలో గువాహటి-న్యూ జల్పైగురి వందే భారత్ ఎక్స్ప్రెస్ను ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించారు. ఈశాన్య భారతానికి ఇదే తొలి వందే భారత్ రైలు సర్వీసు కావడం గమనార్హం. వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలు ద్వారా అసోం పర్యాటక రంగానికి ఊతమిస్తుందని, ఈశాన్య ప్రాంతాల్లో కనెక్టివిటీని మెరుగవుతుందని ప్రధాని మోదీ అభిప్రాయపడ్డారు. వందే భారత్ ఎక్స్ప్రెస్ కామాఖ్య దేవాలయం, కాజిరంగా అభయారణ్యం, అసోంలోని మనస్ టైగర్ రిజర్వ్, మేఘాలయలోని షిల్లాంగ్, చిరపుంజీ, అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్ వంటి కీలకమైన నగరాలను కలుపుతూ ఇది ప్రయాణిస్తుందని మోదీ చెప్పారు. అసోంలో బీజేపీ రాక ముందు అభివృద్ధి శూన్యమన్నారు. గత ప్రభుత్వాల హయాంలో అసోంను పట్టించుకోలేదన్నారు.