NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ
    PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    PM Modi: నలంద యూనివర్శిటీ కొత్త క్యాంపస్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 19, 2024
    12:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బిహార్‌లోని రాజ్‌గిర్‌లో పురాతన విశ్వవిద్యాలయ శిధిలాల సమీపంలో కొత్త నలంద విశ్వవిద్యాలయ క్యాంపస్‌ను బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు.

    ఈ కార్యక్రమానికి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, 17 భాగస్వామ్య దేశాల రాయబారులు హాజరయ్యారు.

    తాత్కాలిక వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ అభయ్ కుమార్ సింగ్ ఈ సందర్భాన్ని "చారిత్రకమైనది" అని అభివర్ణించారు. ప్రధానమంత్రి పర్యటన, తూర్పు ఆసియా శిఖరాగ్ర దౌత్యవేత్తల ఉనికి దీనిని ప్రతిష్టాత్మకమైన, పవిత్రమైన సందర్భంగా మార్చిందని అన్నారు.

    క్యాంపస్ ఫీచర్స్ 

    కొత్త నలంద క్యాంపస్ 455 ఎకరాలలో విస్తరించి ఉంది 

    2020లో ప్రస్తుత స్థానానికి మారిన కొత్త క్యాంపస్ 455 ఎకరాల్లో విస్తరించి ఉంది. 100 ఎకరాల నీటి వనరులతో నికర జీరో ప్రాంతాన్ని కలిగి ఉంది.

    ఇది సాంప్రదాయ, ఆధునిక నిర్మాణాలను మిళితం చేస్తుంది. ఇందులో 40 తరగతి గదులు, రెండు 300-సీట్ల ఆడిటోరియంలు, సుమారు 550 మంది విద్యార్థులకు హాస్టల్, క్రీడా సముదాయం, అంతర్జాతీయ కేంద్రాలతో కూడిన రెండు విద్యా భవనాలు ఉన్నాయి.

    విశ్వవిద్యాలయం స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సులతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ రీసెర్చ్ కోర్సులను అందిస్తుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ప్రారంభోత్సవ వేడుక వీడియో 

    Inauguration of the Nalanda University Campus in Bihar by PM @narendramodi. https://t.co/oJLBFHQzXY

    — Dr. S. Jaishankar (@DrSJaishankar) June 19, 2024

    యూనివర్సిటీ చరిత్ర 

    2017లో ప్రారంభమైన నలంద విశ్వవిద్యాలయం నిర్మాణం 

    యూనివర్సిటీ ఆలోచనను 2007లో అప్పటి రాష్ట్రపతి APJ అబ్దుల్ కలాం ప్రతిపాదించారు. బీహార్ అసెంబ్లీ దీనికోసం బిల్లును కూడా ఆమోదించింది.

    విశ్వవిద్యాలయం అధికారికంగా నవంబర్ 25, 2010న సృష్టించబడింది. పార్లమెంట్ ప్రత్యేక చట్టం ద్వారా, జాతీయ సంస్థగా నియమించబడింది.

    ఇది సెప్టెంబర్ 1, 2014న కేవలం 14 మంది విద్యార్థులతో తాత్కాలిక ప్రదేశం నుండి పనిచేయడం ప్రారంభించింది.

    శాశ్వత క్యాంపస్‌కు మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ 2016లో శంకుస్థాపన చేయగా, 2017లో నిర్మాణాన్ని ప్రారంభించారు.

    చారిత్రక సందర్శన 

    ప్రధానమంత్రి పురాతన నలంద విశ్వవిద్యాలయంను కూడా సందర్శించారు 

    అంతకుముందు, ప్రధాని మోదీ 2016లో ఐక్యరాజ్యసమితి వారసత్వ ప్రదేశంగా ప్రకటించిన పురాతన నలంద స్థలాన్ని కూడా సందర్శించారు.

    ఈ సందర్భంగా ప్రధానితో పాటు బీహార్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్, ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ పాల్గొన్నారు.

    మంగళవారం, ప్రధాని మోదీ వారణాసిలో ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆయన తొలిసారిగా ఆ నియోజకవర్గాన్ని సందర్శించారు.

    అక్కడ పీఎం-కిసాన్ పథకం 17వ విడతను ఆయన విడుదల చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    బిహార్

    తాజా

    Jasprit Bumrah: బుమ్రాకు కెప్టెన్సీ ఇవ్వకూడదంటూ రవిశాస్త్రి కీలక సూచన! జస్పిత్ బుమ్రా
    Narne Nithin : సతీష్ వేగేశ్న - నార్నే నితిన్ కాంబోలో 'శ్రీ శ్రీ శ్రీ రాజావారు', రిలీజ్ డేట్ లాక్ టాలీవుడ్
    USA: కాలిఫోర్నియాలో బాంబు పేలుడు కలకలం.. ఒకరు మృతి.. నలుగురికి గాయాలు అమెరికా
    Earthquake: అరుణాచల్ ప్రదేశ్‌లో ఉదయాన్నే భూకంపం.. రిక్టర్ స్కేలుపై 3.8 తీవ్రత! అరుణాచల్ ప్రదేశ్

    నరేంద్ర మోదీ

    PM Modi: ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని నిషేధించాలంటూ పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు   భారతదేశం
    PM Modi: వారణాసి నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ప్రధాని మోదీ  భారతదేశం
    Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస అంతర్జాతీయం
    Ebrahim Raisi: ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి  ఇబ్రహీం రైసీ

    బిహార్

    Bihar: పూజారి హత్య కేసులో ట్విస్ట్.. బలవంతంగా సెక్స్ చేస్తున్నాడని ప్రియురాలే..  హత్య
    హిందీ మాట్లాడేవారు తమిళనాడులో టాయిలెట్లు కడుగుతున్నారు: ఎంపీ సంచలన కామెంట్స్  తమిళనాడు
    Video: Plane gets stuck under bridge: బీహార్‌లో వంతెన కింద ఇరుక్కుపోయిన విమానం  భారతదేశం
    Pregnancy Scam : గర్భవతిని చేస్తే రూ.13 లక్షలు.. ఎక్కడంటే? ఇండియా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025