NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ డబుల్ దమాకా..ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా  
    తదుపరి వార్తా కథనం
    తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ డబుల్ దమాకా..ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా  
    ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా

    తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ డబుల్ దమాకా..ఈనెల 24న కాచిగూడ, విజయవాడ రైళ్లకు మోదీ పచ్చజెండా  

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 21, 2023
    11:17 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలుగు రాష్ట్రాల మీదుగా మరో రెండు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ప్రారంభం కానున్నాయి.

    హైదరాబాద్ - బెంగళూరు మధ్య సర్వీసును సెప్టెంబర్ 24న ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా పచ్చ జెండా ఊపనున్నారు.

    కాచిగూడ నుంచి యశ్వంత్‌పూర్ (బెంగళూరు) మధ్య నడవనున్న ఈ రైలు, ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీ దిల్లీ నుంచి ప్రారంభించనున్నారు.

    రైలు ప్రారంభోత్సవం జరిగే కాచిగూడలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రైల్వే ఉన్నతాధికారులు హాజరుకానున్నారు.

    రైలు సమయ వేళలు :

    సోమవారం నుంచి కాచిగూడలో ఉదయం 5.30 గంటలకు బయలుదేరి మహబూబ్‌నగర్‌, కర్నూలు, అనంతపురం, ధర్మవరం, హిందూపురం స్టేషన్ల మీదుగా మధ్యాహ్నం 2 గంటలకు యశ్వంత్‌పూర్‌ చేరుకుంటుంది.

    details

    9 రైళ్లను ప్రారంభించనున్న మోదీ

    యశ్వంత్‌పూర్‌లో తిరిగి మధ్యాహ్నం 2.45 గంటలకు బయలుదేరి రాత్రి 11.15 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది.

    విజయవాడ-చెన్నై మధ్య వందేభారత్‌ రైలునూ ఇదే సమయంలో ప్రారంభోత్సవం చేయడం విశేషం. ఈ రైలు విజయవాడ నుంచి తెనాలి, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట మీదుగా చెన్నై సెంట్రల్‌ వరకు ప్రయాణిస్తుంది.

    గురువారం మినహా వారంలో మిగిలిన అన్ని రోజులు ఈ రైలు సర్వీస్ ఉంటుందని రైల్వే అధికారులు తెలిపారు.

    ప్రతి రోజూ ఉదయం 5.30 గంటలకు విజయవాడలో బయలుదేరి మధ్యాహ్నం 12.10 గంటలకి చెన్నై చేరుతుంది. చెన్నైలో తిరిగి మధ్యాహ్నం 3.20 గంటలకు బయలుదేరి రాత్రి 10 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది.

    వీటితో పాటు మొత్తం 9 వందే భారత్ రైళ్లను ఈనెల 24న మోదీ ప్రారంభించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    రైల్వే స్టేషన్

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    19న హైదరాబాద్‌కు ప్రధాని మోదీ.. కేసీఆర్ ఈ సారైనా స్వాగతం పలుకుతారా? ప్రధాన మంత్రి
    తెలంగాణ: మహబూబాబాద్‌లో వందేభారత్ రైలుపై రాళ్ల దాడి తెలంగాణ
    ఏప్రిల్ 8న సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ ఎక్స్‌ప్రెస్ ప్రారంభం; టికెట్ ధరలు, ట్రైన్ రూట్ వివరాలు ఇలా ఉన్నాయి! సికింద్రాబాద్
    ప్రధాని మోదీ పర్యటన ముంగిట బండి సంజయ్ అరెస్టు; తెలంగాణలో పొలిటికల్ హీట్ బండి సంజయ్

    రైల్వే స్టేషన్

    ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో షార్ట్‌ సర్క్యూట్‌ కలకలం.. 4 బోగీలు పూర్తిగా దగ్ధం రైలు ప్రమాదం
    కాషాయ రంగులోకి మారిన వందే భారత్ రైలు.. కారణం ఇదేనా? వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    తిరుపతి యార్డులో పట్టాలు తప్పిన పద్మావతి ఎక్స్‌ప్రెస్‌, రెండు రైళ్లు రీ షెడ్యూల్‌ తిరుమల తిరుపతి
    హైదరాబాద్: తప్పిన రైలు ప్రమాదం.. ఒకే ట్రాక్‌పైకి రెండు ఎంఎంటీఎస్‌లు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025