NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం 
    టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం

    PM Modi: టెక్ కంపెనీల సీఈఓలతో ప్రధాని మోదీ సమావేశం 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Sep 23, 2024
    09:39 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధాని నరేంద్ర మోదీ తన మూడు రోజుల అమెరికా పర్యటనలో భాగంగా న్యూయార్క్‌లోని లోట్టే ప్యాలెస్ హోటల్‌లో అమెరికా టెక్నాలజీ రంగంలోని ప్రముఖ సీఈఓలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

    ఈ భేటీలో ప్రధానంగా భారత వృద్ధి అవకాశాలు, కృత్రిమ మేధస్సు (AI), క్వాంటం కంప్యూటింగ్, సెమీకండక్టర్లు వంటి కీలక సాంకేతిక రంగాలపై చర్చ జరిగింది.

    ఈ సమావేశంలో 15 మంది ప్రముఖ అమెరికన్ టెక్ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు.

    సమావేశం విజయవంతంగా పూర్తైందని, భారతదేశం టెక్నాలజీ, ఇన్నోవేషన్ రంగాల్లో సాధించిన పురోగతిని హైలైట్ చేశామన్నారు.

    Details

    భారత్ మూడో ఆర్థిక వ్యవస్థ ఎదిగేందుకు కృషి

    భవిష్యత్తులో భారత్‌కు మరింత ప్రోత్సాహం ఉందని ప్రధాని మోదీ తన ట్విట్టర్ ఖాతాలో తెలిపారు.

    ఈ సమావేశంలో ప్రధానంగా భారతదేశం-అమెరికా మధ్య సాంకేతిక సహకారాన్ని విస్తృతం చేయడంపై చర్చ జరిగింది.

    ICET (ఇనిషియేటివ్ ఆన్ క్రిటికల్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్) వంటి కార్యక్రమాలు, భారత్-అమెరికా వ్యూహాత్మక భాగస్వామ్యానికి కీలక అంశాలని మోదీ తెలిపారు.

    భారతదేశం వృద్ధి పథంలో ముందుకుసాగుతూ ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలని మోదీ ఆకాంక్షించారు.

    Details

    పెట్టుబడులు పెట్టడానికి ప్రోత్సహాకాలు

    ఈ నేపథ్యంలో సాంకేతిక ఆవిష్కరణలు, పెట్టుబడులు, సహకారం కోసం భారతదేశంలో పెట్టుబడులు పెట్టాలని అమెరికా కంపెనీలను ఆయన ప్రోత్సహించారు.

    మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, అడోబీ సీఈఓ శంతను నారాయణ్, Accenture సీఈఓ జూలీ స్వీట్, NVIDIA సీఈఓ జెన్సన్ హువాంగ్ వంటి అగ్రశ్రేణి సీఈఓలు పాల్గొన్నారు.

    అలాగే, AMD సీఈఓ లిసా సు, వెరిజోన్ సీఈఓ ఎన్రిక్ లోర్స్, ఐబీఎం సీఈఓ అరవింద్ కృష్ణ ఈ సమావేశానికి హాజరయ్యారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    న్యూయార్క్

    తాజా

    SRH vs RCB: ఆర్సిబి కి షాక్ .. 42 పరుగుల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలుపు  ఐపీఎల్
    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ

    నరేంద్ర మోదీ

    PM Modi:'తల వంచి క్షమాపణ కోరుతున్నాను'.. శివాజీ విగ్రహం కూలిన ఘటనపై ప్రధాని మోదీ  భారతదేశం
    Mamata Banerjee: కోల్‌కతా కేసులో మమతా బెనర్జీ లేఖపై కేంద్రం కౌంటర్  మమతా బెనర్జీ
    Narendra Modi: మహిళల భద్రతపై ప్రధాని మోదీ ఆందోళన మమతా బెనర్జీ
    Vande Bharat: గుడ్ న్యూస్.. మూడు వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు

    న్యూయార్క్

    'నేను ఆ ఒక్క నేరమే చేశాను'; అరెస్టు తర్వాత ట్రంప్ ఆసక్తికర కామెంట్స్ డొనాల్డ్ ట్రంప్
    ప్రపంచంలోనే అత్యంత సంపన్న నగరాల్లో హైదరాబాద్, దిల్లీ, ముంబైకి చోటు హైదరాబాద్
    'డొనాల్డ్ ట్రంప్ నన్ను రేప్ చేశారు': న్యూయార్క్ కోర్టులో దావా వేసిన రచయిత డొనాల్డ్ ట్రంప్
    'ట్రంప్ నన్ను లైంగికంగా వేధించారు'; కోర్టులో మరో మహిళ వాగ్మూలం  డొనాల్డ్ ట్రంప్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025