Narendra Modi: 'భారతదేశ చరిత్రలో ఇది అపూర్వమైన క్షణం...' అని ఎన్నికల ఫలితాల అనంతరం ప్రధాని మోదీ
లోక్సభ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్లో బీజేపీ మెజారిటీ మార్కును తాకేలా కనిపించడం లేదు. బీజేపీ 239 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే 290 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఫలితాలకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రజలు వరుసగా మూడోసారి ఎన్డీయేపై తమ విశ్వాసాన్ని వ్యక్తం చేశారని ఆయన రాసుకొచ్చారు. భారతదేశ చరిత్రలో ఇది అపూర్వమైన ఘట్టం. ఈ అభిమానానికి నేను ప్రజలందరికీ పాదాభివందనం చేస్తున్నాను, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి గత దశాబ్దంలో చేసిన మంచి పనిని కొనసాగిస్తానని వారికి హామీ ఇస్తున్నాను.