Page Loader
PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఘనా అత్యున్నత పురస్కారం
మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఘనా అత్యున్నత పురస్కారం

PM Modi: మోదీకి మరో అంతర్జాతీయ గౌరవం.. ఘనా అత్యున్నత పురస్కారం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 03, 2025
08:27 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన తాజా విదేశీ పర్యటనలో ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఆయన అంతర్జాతీయ రాజకీయాలలో చూపుతున్న నాయకత్వ నైపుణ్యం, విశిష్ట దూరదృష్టికి గుర్తింపుగా పశ్చిమ ఆఫ్రికాలోని ఘనా దేశం ఆయనకు అత్యున్నత జాతీయ పురస్కారాన్ని ప్రదానం చేసింది. 'ఆఫీసర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది స్టార్ ఆఫ్ ఘనా' అనే పేరుతో ఉన్న ఈ అత్యున్నత గౌరవాన్ని బుధవారం అక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో, ఘనా అధ్యక్షుడు జాన్ ద్రమాని మహామ స్వయంగా ప్రధాని మోదీకి అందజేశారు.

వివరాలు 

పురస్కారాన్ని 140 కోట్ల భారతీయులకు అంకితమిచ్చిన ప్రధాని 

ఈ సత్కారంపై స్పందించిన ప్రధాని మోదీ గౌరవభరితంగా స్పందిస్తూ, ఈ పురస్కారాన్ని తాను 140 కోట్ల మంది భారతీయుల తరఫున స్వీకరిస్తున్నానని తెలిపారు. భారత యువత ఆశయాలకు, భారతదేశ సాంస్కృతిక సంపదకు, అలాగే భారత్-ఘనా దేశాల మధ్య ఉన్న చారిత్రక సంబంధాలకు అంకితంగా ఈ పురస్కారాన్ని అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఘనా ప్రభుత్వం, ప్రజలపై తన కృతజ్ఞతను వ్యక్తం చేస్తూ, ఈ గౌరవాన్ని అందుకోవడం తనకు ఒక గొప్ప గౌరవమని పేర్కొన్నారు. "ఘనాలో అత్యున్నత పురస్కారం అందుకోవడం ఎంతో గౌరవంగా ఉంది. ఇది భారత్-ఘనా మధ్య ఉన్న శక్తివంతమైన, దీర్ఘకాలిక బంధానికి ప్రతీక" అని ప్రధాని మోదీ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

నరేంద్ర మోదీ చేసిన ట్వీట్ 

వివరాలు 

స్నేహానికి, పరస్పర సహకారానికి ఇది ఒక నిదర్శనం 

ఈ సందర్భంగా భారత విదేశాంగ శాఖ కూడా స్పందించింది. విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ మాట్లాడుతూ, గ్లోబల్ సౌత్ దేశాల వాణిని ప్రోత్సహించేందుకు ప్రధాని మోదీ చేస్తున్న కృషికి ఇది ప్రతిఫలంగా లభించిన గుర్తింపని అన్నారు. భారత్-ఘనా మధ్య ఉన్న స్నేహానికి, పరస్పర సహకారానికి ఇది ఒక నిదర్శనమని ఆయన తన 'ఎక్స్' ఖాతాలో పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న బంధాన్ని మరింత బలపరిచేందుకు ఈ గౌరవం దోహదపడుతుందని, ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచడంలో తనపై నూతన బాధ్యతను పెంచిందని ప్రధాని మోదీ పేర్కొన్నట్లు విదేశాంగ శాఖ అధికారికంగా ప్రకటించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఎస్. జైశంకర్ చేసిన ట్వీట్ 

వివరాలు 

ఇరు దేశాల సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంపు 

ఐదు దేశాల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ తన తొలి పర్యటనగా ఘనాకు చేరుకున్నారు. గత మూడు దశాబ్దాల కాలంలో ఒక భారత ప్రధాని ఘనాలో పర్యటించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఈ పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ, ఘనా అధ్యక్షుడు మహామల మధ్య విస్తృతమైన చర్చలు జరగడంతోపాటు, రెండు దేశాల మధ్య సంబంధాలను 'సమగ్ర భాగస్వామ్యం' స్థాయికి తీసుకెళ్లనున్నట్లు ఉభయ దేశాలు ప్రకటించాయి. ఈ చారిత్రక పర్యటన భారత్-ఘనా ద్వైపాక్షిక సంబంధాలకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావనుందని ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు.