NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం' 
    తదుపరి వార్తా కథనం
    Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం' 

    Ayodhya Ram Mandir: రామమందిర ప్రారంభోత్సవానికి ముందు ప్రధాని '11 రోజుల ప్రత్యేక అనుష్ఠానం' 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 12, 2024
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    జనవరి 22న అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవానికి ముందు, ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం ప్రత్యేక సందేశం ఇచ్చారు.

    నేటి నుంచి 11 రోజుల ప్రత్యేక అనుష్ఠానాన్ని అనుసరిస్తానని వెల్లడించారు.ఈ మేరకు ఆడియో సందేశాన్ని తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేశారు.

    పిఎం మోడీ ఈ మహోన్నత ఘట్టాన్ని కనులారా వీక్షించే అవకాశం కలగడం తన అదృష్టమని పేర్కొన్నారు.

    ఇందుకు ప్రజలందరి ఆశీస్సులు కోరుతున్నట్లు తెలిపారు."రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠ'కు ఇంకా 11 రోజులు మాత్రమే మిగిలి ఉంది,సంప్రోక్షణ సమయంలో భారతదేశ ప్రజల తరఫున ప్రతినిధిగా ఉండటం నా అదృష్టం. దీనిని దృష్టిలో ఉంచుకుని, నేను ఈ రోజు నుండి 11 రోజుల పాటు ప్రత్యేక పూజను ప్రారంభిస్తున్నాను" అని ఆయన చెప్పారు.

    Details 

    దేశవ్యాప్తంగా 7,000 మందికి పైగా ఆహ్వానితులు 

    ప్రస్తుతం నేను ఎంతో ఉద్వేగంతో ఉన్నాను.నా మనసులో మొదటిసారిగా ఇలాంటి భావాలు మెదులుతున్నాయి.దేవుడి ఆశీస్సుల వల్లే కొన్నివాస్తవ రూపం దాల్చుతాయి.ఈ ప్రారంభోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులందరికీ ఒక పవిత్రమైన సందర్భం'అని ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు.

    'ప్రాణ ప్రతిష్ఠ' వేడుకకు సంబంధించిన గ్రంథాలలో వివరించిన కఠినమైన మార్గదర్శకాలను ప్రధాని అనుసరిస్తారని అధికారులు తెలిపారు.

    అయోధ్యలోని రామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ,ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్,ఇతర ప్రముఖులు హాజరుకానున్నారు.

    ఈ వేడుక ఆహ్వానితులలో రామ మందిరాన్ని నిర్మించిన కార్మికుల కుటుంబాలు కూడా ఉన్నాయి.

    ఆలయ ట్రస్ట్, శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్రం ఆహ్వానితుల జాబితాలో బాలీవుడ్ ప్రముఖులు, క్రికెటర్లు, పారిశ్రామికవేత్తలతో సహా 7,000 మందికి పైగా ఉన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    DC vs GT: ఢిల్లీపై ఘన విజయం..ఫ్లే ఆఫ్స్‌కు చేరిన గుజరాత్ టైటాన్స్ గుజరాత్ టైటాన్స్
    KL Rahul: ఐపీఎల్‌లో సెంచరీతో పాటు మరో అరుదైన రికార్డు సాధించిన కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్
    PBKS vs RR: ధ్రువ్ జురెల్ పోరాటం వృథా.. పంజాబ్ చేతిలో రాజస్థాన్ ఓటమి రాజస్థాన్ రాయల్స్
    MG Windsor EV: ఎంజీ విండ్సర్ ఈవీ ప్రో లాంచ్.. సింగిల్ ఛార్జ్‌తో 449 కి.మీ రేంజ్! ఆటో మొబైల్

    నరేంద్ర మోదీ

    26/11 Mumbai attacks: ముంబై ఉగ్రదాడికి 15ఏళ్లు.. ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు  ముంబై
    PM Modi: సచివాలయానికి రాని సీఎం తెలంగాణకు అవసరమా?: కేసీఆర్‌పై మోదీ విమర్శలు తెలంగాణ
    PM MODI : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ప్రధాని మోదీ.. స్వామిని ఏం కోరుకున్నాంటే తిరుమల తిరుపతి
    Modi Road Show: హైదరాబాద్‌లో ప్రధాని మోదీ రోడ్‌షో.. భారీగా తరలివచ్చిన శ్రేణులు ప్రధాన మంత్రి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025