NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
    తదుపరి వార్తా కథనం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం
    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

    5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్: నేడు పార్టీ ఎన్నికల కమిటీ సమావేశం

    వ్రాసిన వారు Stalin
    Aug 16, 2023
    12:05 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈ ఏడాది చివర్లో జరగనున్న 5రాష్ట్రాల(మిజోరం, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, తెలంగాణ) అసెంబ్లీ ఎన్నికలపై బీజేపీ దృష్టి సారించింది.

    గెలుపే లక్ష్యంగా వ్యూహరచన చేయడానికి బీజేపీ అత్యున్నత నిర్ణయాధికార విభాగం కేంద్ర ఎన్నికల కమిటీ బుధవారం సాయంత్రం దిల్లీలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం కానుంది.

    ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర ఎన్నికల ప్యానెల్ సభ్యులు హాజరుకానున్నారు.

    ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికతో పాటు, ఎన్నికల వ్యూహాన్ని రూపొందించడానికి కీలకమైన చర్చలు జరగనున్నాయి.

    బీజేపీ

    విపక్షాల పాలిత రాష్ట్రాలపైనే ప్రత్యేక దృష్టి

    వాస్తవానికి బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ చాలా అరుదుగా సమావేశమవుతుంది. ఎన్నికల నోటిఫికేషన్ తర్వాతే కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశమై అభ్యర్థుల ఎంపికపై చర్చస్తుంది.

    అయితే కర్ణాటకలో బీజేపీ ఓడిపోయిన నేపథ్యంలో అప్రమత్తమైన అధినాయకత్వం.. ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోకూడదని నిర్ణయించింది.

    ఈ ఏడాది చివర్లో జరగనున్న 5 అసెంబ్లీ ఎన్నికలు పెను సవాల్‌గా మారిన నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలు రచించేందుకు ముఖ్య నాయకులు నేడు సమావేశం అవుతున్నారు.

    ఎన్నికలు జరగనున్న ఐదు రాష్ట్రాల్లో ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణ విపక్షాల పాలిత రాష్ట్రాలు కావడంతో ఈ సమావేశంలో వీటిపై దృష్టి సారించే అవకాశం ఉంది.

    బీజేపీ

    ఆ రాష్ట్రాల్లో గెలుపు అంత సులువేం కాదు

    మధ్యప్రదేశ్, మిజోరంలో అధికారాన్ని నిలబెట్టుకొని, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, తెలంగాణలో ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. కానీ అది అంత సులువు కాదు.

    తెలంగాణలో బీజేపీకి ఈ ఎన్నికల్లో కొన్ని అసెంబ్లీ స్థానాలు పెరిగే అవకాశం ఉంది కానీ, అధికారంలోకి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని నిపుణులు చెబుతున్నారు.

    మిజోరంలో అధికార పార్టీ అయిన ఎంఎన్‌ఎఫ్ లోక్‌సభలో అవిశ్వాస తీర్మానంలో మిత్రపక్షమైన బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేసింది. మణిపూర్ విషయంలో ఈ రెండు పార్టీల మధ్య దూరం పెరిగింది.

    మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ బలంగా ఉంది. ఇక్కడ రెండు పార్టీల మధ్య పోరు నువ్వా-నేనా అన్న చందంగా ఉంది.

    ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా, బీజేపీ ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.

    బీజేపీ

    బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపైనే చర్చ

    ఈ ఐదు రాష్ట్రాల ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలకు కొన్ని నెలల ముందు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల ఫలితాలు ప్రభావం తర్వాత జరిగిన జనరల్ ఎలక్షన్స్‌పై ఉండే అవకాశం ఉంటుంది.

    అందుకే ఈ ఎన్నికల్లో సత్తాచాటాలని బీజేపీ భావిస్తోంది. బీజేపీ బలహీనంగా ఉన్న స్థానాలపై ఈ భేటీలో ప్రధానంగా చర్చ జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

    పార్టీ బలహీనంగా ఉన్న సీట్లలో అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలని, తద్వారా వారికి సన్నద్ధమయ్యేందుకు తగినంత సమయం లభిస్తుందని బీజేపీ భావిస్తోంది.

    ఈ సమావేశంలో ఎన్నికల ఎజెండా, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ప్రచారం, ఇతర సంబంధిత అంశాల గురించి కూడా చర్చిస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బీజేపీ
    అసెంబ్లీ ఎన్నికలు
    నరేంద్ర మోదీ
    అమిత్ షా

    తాజా

    IPL 2025 Recap: ఐపీఎల్‌ 2025 హైలైట్స్‌.. 14ఏళ్ల క్రికెటర్‌ నుంచి చాహల్‌ హ్యాట్రిక్‌ దాకా! ఐపీఎల్
    #NewsBytesExplainer: సిక్కిం భారతదేశంలో ఒక రాష్ట్రంగా ఎలా మారింది?   సిక్కిం
    Kaleshwaram: కాళేశ్వరం రిపోర్ట్‌ సిద్ధం.. కీలక నేతల విచారణ అవసరం లేదన్న కమిషన్ తెలంగాణ
    IMD: వచ్చే వారం కేరళలో అతి భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ కేరళ

    బీజేపీ

    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ప్రతిపక్షాలు
    Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు లోక్ జనశక్తి పార్టీ/ ఎల్‌జేపీ
    రాజాసింగ్‌కు మరో షాక్.. గోషామహల్ సీటు వదులుకుంటేనే సస్పెన్షన్‌ ఎత్తివేత..? గోషామహల్
    Delhi Ordinance: రాజ్యసభలో సంఖ్యా బలం లేకున్నా ఆర్డినెన్స్‌ను బీజేపీ ఎలా ఆమోదిస్తుందంటే! దిల్లీ ఆర్డినెన్స్

    అసెంబ్లీ ఎన్నికలు

    బీఎల్ సంతోష్ కుట్ర వల్లే నేను బీజేపీ నుంచి బయటకు వచ్చా: జగదీశ్ శెట్టర్ కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్లు వీరే  కర్ణాటక
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    Karnataka Elections 2023: హిమాచల్ ఎన్నికల ఫలితాలే కర్ణాటకలో రిపీట్ అవుతాయా?  కర్ణాటక

    నరేంద్ర మోదీ

    మణిపూర్‌పై పార్లమెంట్‌లో ప్రతిష్టంభన: రాత్రింతా ప్రతిపక్ష ఎంపీలు నిరసన  మణిపూర్
    'ఇండియా' కూటమిపై మోదీ ధ్వజం.. మరోసారి కేంద్రంలో బీజేపీదే అధికారమని ధీమా బీజేపీ
    మిస్టర్ మోదీ, మణిపూర్‌లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ
    INDIA: మోదీ ప్రభుత్వం పై అవిశ్వాస తీర్మానానికి రెడీ అవుతున్న ప్రతిపక్షాలు ప్రతిపక్షాలు

    అమిత్ షా

    అమిత్ షా నేతృత్వంలో బీజేపీ నేతల సమావేశం; తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలపై చర్చ తెలంగాణ
    ముగిసిన సీఎం వైఎస్ జగన్ దిల్లీ పర్యటన; అమిత్ షా, నిర్మలతో కీలక భేటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    West Bengal: శ్రీరామనవమి వేడుకల్లో చెలరేగిన హింసపై ప్రభుత్వాన్ని నివేదిక కోరిన కేంద్ర హోంశాఖ పశ్చిమ బెంగాల్
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025