NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ 
    తదుపరి వార్తా కథనం
    PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ 
    PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ

    PM Modi: సైనికులు ఉన్నచోటే నాకు అయోధ్య: దీపావళి వేడుకల్లో ప్రధాని మోదీ 

    వ్రాసిన వారు Stalin
    Nov 12, 2023
    03:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రతి ఏడాది లాగే ఈ సారి కూడా దీపావళిని ప్రధాని నరేంద్ర మోదీ సైనికులతో ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం హిమాచల్‌ ప్రదేశ్‌లోని లెప్చాకు చేరుకున్న మోదీ.. సైనికులతో వేడుకలను జరుపుకున్నారు.

    సైనికులతో కలిసి దీపావళి జరుపుకోవడం గర్వించదగ్గ అనుభవం అని ప్రధాని అన్నారు.

    తాను ప్రతి ఏటా ఆర్మీ సిబ్బందితో కలిసి దీపావళి జరుపుకుంటానన్నారు. రాముడు ఉన్నది అయోధ్య అని చెబుతారని, కానీ తనకు మాత్రం భారత జవాన్లు ఉన్నచోటే అయోధ్య అని పేర్కొన్నారు.

    సైనికులు తమ అంకితభావంతో దేశ ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారని మోదీ అన్నారు.

    దేశం సైనికులకు రుణపడి ఉంటుందన్నారు. సైనికులను మోహరించిన ప్రదేశం దేవాలయానికి తక్కువేం కాదన్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    సైనికులతో మోదీ దీపావళి వేడుకలు

    "The courage of our security forces is unwavering. Stationed in the toughest terrains, away from their loved ones, their sacrifice and dedication keep us safe and secure. India will always be grateful to these heroes who are the perfect embodiment of bravery and resilience,"… pic.twitter.com/KZf6UYlpHs

    — ANI (@ANI) November 12, 2023

    దీపావళి

    రక్షణ రంగంలో గ్లోబల్ ప్లేయర్‌గా భారత్: మోదీ

    సైనికులతో వేడుకల జరుపుకుంటున్న నేపథ్యంలో లెప్చాను దేశం మొదటి గ్రామంగా మోదీ మరోసారి పునరుద్ఘాటించారు.

    పండగ రోజు కుటుంబాలకు దూరంగా సరిహద్దుల వద్ద ఉన్న సైనికుల దేశభక్తి పరాకాష్ట నిదర్శనం అన్నారు.

    రక్షణ రంగంలో భారతదేశం గ్లోబల్ ప్లేయర్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోందని మోదీ అన్నారు.

    ఇప్పుడు దేశానికి మాత్రమే కాకుండా స్నేహపూర్వక దేశాలకు కూడా రక్షణ సంబంధిత అవసరాలను తీర్చడానికి భారత్ ప్రయత్నిస్తోందన్నారు.

    2016లో భారతదేశ రక్షణ ఎగుమతులు ఎనిమిది రెట్లు పెరిగాయని, ఇప్పుడు దేశీయ రక్షణ ఉత్పత్తి లక్ష కోట్ల రూపాయలకు చేరుకుందని మోదీ వెల్లడించారు.

    మోదీ 2014లో తొలిసారిగా దేశ ప్రధాని అయినప్పటి నుంచి ప్రతి ఏటా దీపావళి పండుగను సైనికులతో జరుపుకుంటున్నారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    మాట్లాడుతున్న మోదీ

    #WATCH | Lepcha, Himachal Pradesh: Prime Minister Narendra Modi says, "I come and celebrate Diwali every year with our security forces. It is said that Ayodhya is where Lord Ram is, but for me, the festival is where our security forces are...I have not celebrated any Diwali for… pic.twitter.com/ebXl08V4Mi

    — ANI (@ANI) November 12, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    దీపావళి
    ఆర్మీ
    హిమాచల్ ప్రదేశ్

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    నరేంద్ర మోదీ

     9 Vande Bharat trains launched:  తొమ్మిది వందేభారత్ రైళ్లను ప్రారంభించిన ప్రధాని మోదీ  వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ రైలు
    మధ్యప్రదేశ్‌: ట్రక్కును ఢీకొట్టిన బస్సు.. 39మంది బీజేపీ నాయకులకు గాయాలు మధ్యప్రదేశ్
    భోపాల్ జన్ ఆశీర్వాద్ సభలో మోదీ కామెంట్స్.. దేశం కంటే, ప్రజల కంటే మించిందేదీ లేదు మధ్యప్రదేశ్
    మోదీ సభ ముందు రాజస్థాన్ బీజేపీలో ముసలం..వసుంధర రాజే, గజేంద్ర ఐక్యత నిలిచేనా రాజస్థాన్

    దీపావళి

    దిల్లీలో బాణాసంచాపై సుప్రీం కీలక ఆదేశాలు .. గ్రీన్ క్రాకర్స్‌కు కూడా నో పర్మిషన్ సుప్రీంకోర్టు
    Bonus: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దీపావళి బోనస్.. ఎంతంటే? కేంద్ర ప్రభుత్వం
    Diwali 2023: దీపావళి అలంకరణ నుంచి పూజ వరకు, పండుగను ఎలా జరుపుకోవాలో తెలుసా  లైఫ్-స్టైల్
    Diwali Sale : స్మార్ట్ ఫోన్లు, టాబ్లెట్ లపై ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన రియల్ మీ రియల్ మీ

    ఆర్మీ

    ఇజ్రాయెల్ ప్రతీకారం; లెబనాన్‌లోని గాజా స్ట్రిప్‌పై వైమానిక దాడులు ఇజ్రాయెల్
    పజిగి గ్రామంపై మయన్మార్ మిలిటరీ వైమానిక దాడి; 100మంది మృతి మయన్మార్
    పంజాబ్ మిలిటరీ స్టేషన్‌లో కాల్పుల కలకలం; నలుగురు మృతి  పంజాబ్
    భటిండా మిలిటరీ క్యాంపు; జవాన్లపై కాల్పులు జరిపింది ఎవరు? రైఫిల్ ఎక్కడ?  పంజాబ్

    హిమాచల్ ప్రదేశ్

    హైవేపై విరిగి పడ్డ కొండచరియలు, చిక్కుకుపోయిన 53మంది ప్రయాణికులు ప్రయాణం
    తమ సంస్థలో ఎటువంటి అక్రమాలు జరగడం లేదంటున్న అదానీ విల్మార్ ప్రతినిధులు అదానీ గ్రూప్
    దలైలామా సెక్యూరిటీ డాగ్ వేలం- ఎంత మొత్తానికి దక్కించుకున్నారో తెలుసా? ఆర్మీ
    హిమాచల్‌ ప్రదేశ్‌ను వణికిస్తున్న వర్షాలు, మంచు; హెచ్చరికలు జారీ చేసిన వాతావరణ శాఖ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025