LOADING...
PM Modi: రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం
రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ..పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

PM Modi: రేపు బెంగళూరులో పర్యటనకు మోదీ.. పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 09, 2025
03:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈ ఆదివారం(ఆగష్టు 10) బెంగళూరుకు పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన అనేక అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, ప్రారంభోత్సవాలు నిర్వహించనున్నారు. మొత్తం నాలుగు గంటలపాటు ఆయన బెంగళూరులో ఉండే అవకాశం ఉంది. ఉదయం 10:30 గంటలకు ఎయిర్‌పోర్టుకు రానున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌ ద్వారా లేదా రోడ్డు మార్గం ద్వారా కేఎస్ఆర్‌ బెంగళూరు రైల్వే స్టేషన్‌కు వెళ్ళనున్నారు. రైల్వే స్టేషన్‌లో ఆయన మూడు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. వీటిలో కేఎస్ఆర్‌ బెంగళూరు-బెళగావి, అమృతసర్-శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా, అజ్ని (నాగ్‌పూర్)-పుణే రైళ్లు ఉన్నాయి.

వివరాలు 

 'నమ్మ మెట్రో' మూడో దశ పనులకు శంకుస్థాపన 

అనంతరం మోదీ రోడ్డు మార్గంలో రాగిగుడ్డ మెట్రో స్టేషన్‌కు ప్రయాణించి, ఉదయం 11:45 గంటల నుంచి మధ్యాహ్నం 12:50 గంటల మధ్య రాగిగుడ్డ నుంచి ఎలక్ట్రానిక్స్ సిటీకి మెట్రోలో వెళ్లనున్నారు. మధ్యాహ్నం 12:50 గంటలకు ఎలక్ట్రానిక్స్ సిటీ మెట్రో స్టేషన్‌కు చేరుకున్న తర్వాత,ఎలక్ట్రానిక్స్ సిటీ ఫేజ్‌-1లోని అంతర్జాతీయ సమాచార సాంకేతిక సంస్థ సమీపంలో ఎల్లో లైన్‌ మెట్రో మార్గాన్ని ప్రారంభిస్తారు. ఈసందర్భంగా 'నమ్మ మెట్రో' మూడో దశ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు.కార్యక్రమం అనంతరం మోదీ హెలికాప్టర్‌లో తిరిగి విమానాశ్రయానికి చేరుకుని,మధ్యాహ్నం 2:45 గంటలకు ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈపర్యటనలో పలువురు ప్రముఖులు హాజరుకానుండటంతో,ఆదివారం నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ పరిమితులు విధించినట్లు పోలీసులు తెలిపారు. ఈమేరకు ప్రజలు ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.