NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌
    భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

    PM Modi: 'భారతదేశం ప్రతి ఉగ్రవాదిని గుర్తించి, కనిపెట్టి, శిక్షిస్తుంది'.. పహల్గాం ఘటనపై మోదీ స్ట్రాంగ్‌ వార్నింగ్‌

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 24, 2025
    01:21 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉగ్రవాదం ఎక్కడి నుంచైనా జన్మిస్తే, అక్కడికే వెళ్లి శిక్షిస్తామంటూ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి స్పష్టంగా పేర్కొన్నారు.

    ఉగ్రవాదులకు,వారికి సహకరిస్తున్నవారికి, వారి కలల్లో కూడా ఊహించలేనంత తీవ్రమైన శిక్షలు విధిస్తామన్నారు.

    జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బిహార్ రాష్ట్రం మధుబనిలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా జమ్ముకశ్మీర్‌లోని పహల్గాం వద్ద ఇటీవల చోటు చేసుకున్న ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. దాడికి పాల్పడిన వారు భారీ మూల్యం చెల్లించక తప్పదన్నారు.

    వివరాలు 

    భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసం

    ప్రధాని మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభించేముందే,పహల్గాం ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులర్పించారు.

    సభలో ఉన్న ప్రతి ఒక్కరు ఒక నిమిషం పాటు మౌనం పాటించి,మృతులకు అంజలి ఘటించారు.

    అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు దేశం మొత్తంగా అండగా నిలుస్తోంది.గాయపడినవారిని ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని మార్గాల్లో సహాయం చేస్తోంది. ఈ దాడి కారణంగా ఓ తల్లి తన కొడుకును కోల్పోయింది. ఓ సోదరి తన భర్తను శాశ్వతంగా కోల్పోయింది. దేశం అంతటా, కార్గిల్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రజలందరిలోనూ తీవ్ర వేదన, కోపం నెలకొంది. ఇది కేవలం పర్యాటకులపై దాడి మాత్రమే కాదు.. భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసం'' అని మోదీ అన్నారు.

    వివరాలు 

    భారత్‌కు మద్దతుగా నిలిచిన ఇతర దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు 

    "ఈ దాడి వెనుక ఉన్నవారెవరో, ఎవరు కుట్రలో పాలుపంచుకున్నారో వారందరినీ గుర్తించి, చట్టబద్ధంగా శిక్షిస్తాం. ప్రతి ఒక్క ఉగ్రవాదిని తేల్చి, ట్రాక్ చేసి, శిక్షించడమే మన లక్ష్యం. బాధితులకు న్యాయం చేయడం కోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది. దేశం మొత్తం ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనడంలో ఏకగుణ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదుల రక్షణ కేంద్రాలను ధ్వంసం చేయాల్సిన సమయం ఆసన్నమైంది. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలు ఉగ్రవాద మూకల వెన్నెముకను విరిచేస్తారు," అని ఆయన తీవ్రంగా హెచ్చరించారు.

    ఈ సందర్భంగా భారత్‌కు మద్దతుగా నిలిచిన ఇతర దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు.

    వివరాలు 

    పహల్గాంలోని బైసరన్ పర్యాటక ప్రాంతంలో ముష్కరులు ఘోర దాడి

    "మానవత్వాన్ని నమ్మే ప్రతి ఒక్కరూ భారత్‌కు అండగా నిలిచారు.వారందరికీ మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నాను.ఉగ్రవాదం దేశ ఐక్యతను దెబ్బతీయలేని అంశం. ఉగ్రవాదానికి తప్పక శిక్ష అనుభవించాల్సిందే," అని మోదీ స్పష్టం చేశారు.

    ఏప్రిల్ 22న జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని బైసరన్ పర్యాటక ప్రాంతంలో ముష్కరులు ఘోర దాడికి పాల్పడ్డారు.

    సైనిక దుస్తుల్లో ఉన్న దుండగులు పర్యాటకులను చుట్టుముట్టి అత్యంత సమీపం నుంచి తుపాకులతో కాల్పులు జరిపారు.

    ఈ దారుణ ఘటనలో 25 మంది పర్యాటకులు, ఒక స్థానిక కశ్మీరీ యువకుడు ప్రాణాలు కోల్పోయారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    OG: పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ఓజీ నుండి ఆసక్తికర అప్డేట్! పవన్ కళ్యాణ్
    Suzuki e-Access: సుజుకీ ఇ-యాక్సెస్‌ స్కూటర్‌ మార్కెట్లోకి రాకకు సిద్ధం ఆటో మొబైల్
    Monsoon: రైతులకు ఊరట.. కేరళని తాకిన రుతుపవనాలు భారత వాతావరణ శాఖ
    Kidambi Srikanth: జపాన్ ఆటగాడిపై గెలిచిన శ్రీకాంత్.. ఫైనల్‌కు చేరుకున్న స్టార్ షట్లర్ బ్యాడ్మింటన్

    నరేంద్ర మోదీ

    PM Modi: ప్రధాని మోదీకి మారిషస్‌ అత్యున్నత పురస్కారం.. ప్రకటించిన మారిషస్‌ ప్రధాని నవీన్‌ రామ్‌గులాం  భారతదేశం
    Amaravati: ఏప్రిల్ 15న ఆంధ్రప్రదేశ్‌లో ప్రధాని మోదీ పర్యటన.. రాజధాని పునః ప్రారంభ పనులకు శ్రీకారం  అమరావతి
    PM Modi: ప్రధాని మోదీ ఎక్స్‌క్లూజివ్‌.. లెక్స్‌ ఫ్రిడ్‌మన్‌ పాడ్‌కాస్ట్‌ నేడే విడుదల!  ఇండియా
    PM Modi: జాతి ప్రయోజనాలే సర్వోన్నతం.. లెక్స్ ఫ్రిడ్‌మాన్ పాడ్‌కాస్ట్‌ ముఖాముఖిలో ప్రధాని మోదీ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025