NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ
    ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ

    PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 03, 2025
    12:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితి విషమంగా మారింది.

    ముఖ్యంగా అస్సాం, సిక్కిం, మణిపూర్ రాష్ట్రాల్లో వరుసగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో సాధారణ జీవనవిధానం పూర్తిగా స్థంభించింది.

    తీవ్ర వర్షాలు అక్కడ వరదలకు దారితీశాయి. ఇప్పటివరకు ఈ విపత్తు కారణంగా దాదాపు 34 మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.

    ఈ విపత్కర పరిస్థితుల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కీలక చొరవ తీసుకున్నారు.

    అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ, సిక్కిం సీఎం ప్రేమ్ సింగ్ తమాంగ్, మణిపూర్ గవర్నర్ అజయ్ భల్లాతో ప్రధాని ఫోన్ ద్వారా మాట్లాడారు.

    వరదల ప్రభావాన్ని అధిగమించేందుకు కేంద్రం పూర్తిస్థాయిలో సహాయం అందిస్తుందని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.

    వివరాలు 

    రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టింది: హిమంత 

    ఈ విషయాన్ని అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ తన అధికారిక ఎక్స్ (పూర్వపు ట్విట్టర్) ఖాతాలో వెల్లడించారు.

    వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా అస్సాం సహా సరిహద్దు రాష్ట్రాల్లోనూ వరదలు వస్తున్న దృశ్యాన్ని ప్రధానికి వివరించినట్లు చెప్పారు.

    రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సహాయ చర్యలు చేపట్టినదీ వివరించారు.

    ఈ సహాయ కార్యక్రమాల వివరాలను ప్రధానికి తెలియజేశామన్నారు.

    అదేవిధంగా, కొన్ని ప్రాంతాల్లో వరదలతో పాటు కొండచరియలు విరిగిపడుతున్న ఘటనలూ చోటుచేసుకున్నాయని తెలిపారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్ 

    A short while ago, Hon’ble Prime Minister Shri @narendramodi ji called me to enquire about the current flood situation in Assam.

    I briefed him on how continuous rainfall in Assam and adjoining states has led to flooding and impacted many lives. I also apprised him of the relief…

    — Himanta Biswa Sarma (@himantabiswa) June 3, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ

    తాజా

    PM Modi: ఈశాన్యంలో అతి భారీ వర్షాలు,వరదలు.. ముఖ్యమంత్రులతో మాట్లాడిన ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Microsoft : మరో 300మందికి పైగా ఉద్యోగులపై వేటు వేసిన మైక్రోసాఫ్ట్‌  మైక్రోసాఫ్ట్
    AP High Court: ఏపీ మెగా డీఎస్సీ పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..  స్టే పిటిషన్లను కొట్టేసిన న్యాయస్థానం హైకోర్టు
    Australia: భారత సంతతి వ్యక్తిని దారుణంగా కొట్టిన ఆస్ట్రేలియా పోలీసులు.. జార్జి ఫ్లాయిడ్‌ ఉదంతమంటూ ఆరోపణ ఆస్ట్రేలియా

    నరేంద్ర మోదీ

    Swami Sivananda: స్వామి శివానంద మృతి.. ప్రధాని మోదీ సంతాపం ఉత్తర్‌ప్రదేశ్
    Amar preet singh: భారత్-పాక్ ఉద్రిక్తతల మధ్య ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ భేటీ భారతదేశం
    IPL 2025: అతను చిచ్చర పిడుగులా రాణిస్తున్నాడు.. వైభవ్ సూర్యవంశీపై మోదీ ప్రశంసలు క్రికెట్
     PM Modi: ప్రధాని నరేంద్రమోదీతో రక్షణశాఖ కార్యదర్శి భేటీ  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025