NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ
    తదుపరి వార్తా కథనం
    PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ
    PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ

    PM Modi Kashmir Visit:నేటి నుంచి 2 రోజుల పాటు కశ్మీర్ పర్యటనలో ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 20, 2024
    08:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారత ప్రధానిగా మూడోసారి బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా ఈరోజు అంటే గురువారం జమ్ముకశ్మీర్‌లో పర్యటించనున్నారు.

    రెండు రోజుల పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ జమ్ముకశ్మీర్‌కు చేరుకోనున్నారు. యోగా దినోత్సవం సందర్భంగా రేపు అంటే జూన్ 21న జరిగే కార్యక్రమంలో ఆయన అక్కడ పాల్గొంటారు.

    ప్రధాని మోదీ తన పర్యటనలో 84 ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, ప్రారంభోత్సవం చేయనున్నారు.

    1800 కోట్ల బృహత్తరమైన మరికొన్ని కార్యక్రమాలను చేపట్టనున్నారు. జమ్ముకశ్మీర్‌లో ప్రధాని మోదీ పర్యటన దృష్ట్యా లోయలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.

    జమ్ముకశ్మీర్‌లో యోగా దినోత్సవంలో పాల్గొనడంతో పాటు పలు కార్యక్రమాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు. అంతేకాకుండా, లోయలో అనేక ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు.

    వివరాలు 

    1800 కోట్ల బృహత్తరమైన కార్యక్రమాలు 

    ముందుగా జూన్ 20న సాయంత్రం 6 గంటలకు శ్రీనగర్‌లో జరిగే 'ఎంపవరింగ్ యూత్, ట్రాన్స్‌ఫార్మింగ్ J&K' కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. యువతకు ప్రగతి పథం చూపడమే దీని ఉద్దేశం.

    ఈ కార్యక్రమంలో, ప్రజలు అనేక విభిన్న వస్తువుల స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తారు.

    జమ్ముకశ్మీర్‌లో వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి 1800 కోట్ల రూపాయల వ్యయంతో వ్యవసాయం, అనుబంధ రంగాలలో పోటీతత్వాన్ని మెరుగుపరిచే ప్రాజెక్ట్ (JKCIP) ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.

    ప్రభుత్వ ఉద్యోగాల్లో నియమితులైన 2000 మందికి పైగా లబ్దిదారులు అపాయింట్‌మెంట్ లెటర్లను కూడా అందజేయనున్నారు.

    ప్రధాన మంత్రి 84 ప్రధాన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.

    వివరాలు 

    అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు 

    ఈ ప్రారంభోత్సవంలో రోడ్లు, నీటి సరఫరా పథకాలు, ఉన్నత విద్యకు సంబంధించిన ప్రాజెక్టులు ఉన్నాయి.

    అలాగే, చెనాని-పట్నితోప్-నశ్రీ విభాగం అభివృద్ధికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అంతేకాకుండా 6 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు.

    జూన్ 21న ఉదయం 6:30 గంటలకు శ్రీనగర్‌లోని SKICCలో జరిగే 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ కార్యక్రమానికి ప్రధాని మోదీ హాజరవుతారు.

    ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించనున్నారు. 2015 నుంచి ప్రధాని మోదీ దేశంలో యోగాకు ప్రాధాన్యతను పెంచారు.

    2023లో, న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో యోగా దినోత్సవ కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    జమ్ముకశ్మీర్
    శ్రీనగర్

    తాజా

    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ
    Mumbai Indians: ముంబయి జట్టులో కీలక మార్పులు.. ముగ్గురు నూతన ఆటగాళ్లకు అవకాశం ముంబయి ఇండియన్స్

    నరేంద్ర మోదీ

    PM Modi: ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధాని మోదీని నిషేధించాలంటూ పిటిషన్‌.. తిరస్కరించిన సుప్రీంకోర్టు   భారతదేశం
    PM Modi: వారణాసి నుంచి నామినేషన్‌ దాఖలు చేసిన ప్రధాని మోదీ  భారతదేశం
    Pak-America: మోదీకి.. పాక్ -అమెరికన్ బిజినెస్ మెన్ అరుదైన ప్రశంస అంతర్జాతీయం
    Ebrahim Raisi: ఇరాన్ ప్రెసిడెంట్ రైసీ మరణంపై ప్రధాని మోదీ దిగ్బ్రాంతి  సుబ్రమణ్యం జైశంకర్

    జమ్ముకశ్మీర్

    PM Modi-Article 370: 'ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్' స్ఫూర్తిని బలపర్చిన సుప్రీంకోర్టు తీర్పు:  మోదీ  నరేంద్ర మోదీ
    Jammu & Kashmir: జమ్ముకశ్మీర్ లోని పూంచ్‌లో ఆర్మీ వాహనంపై ఉగ్రవాదులు దాడి  భారతదేశం
    Jammu Kashmir : జమ్మూ కాశ్మీర్‌ పూంచ్ వద్ద ఉగ్రదాడి.. అమరులైన ఐదుగురు జవాన్లు  భారతదేశం
    Poonch attack: జమ్ముకశ్మీర్‌‌లో ఉగ్రవాదుల వేట.. మొబైల్ ఇంటర్నెట్ సస్పెండ్  తాజా వార్తలు

    శ్రీనగర్

    మారిన శ్రీనగర్ ముఖచిత్రం; స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో భాగంగా ఫ్రీ వైఫై జోన్లుగా 8ప్రాంతాలు తాజా వార్తలు
    నేటి నుంచి శ్రీనగర్‌లో జీ20 సమావేశం; భద్రత కట్టుదిట్టం  జీ20 సమావేశం
    జమ్మూ-శ్రీనగర్ హైవేపై లోయలోకి దూసుకెళ్లిన బస్సు; 10మంది మృతి  జమ్మూ
    శ్రీనగర్‌- బారాముల్లా హైవేపై భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు స్వాధీనం  జమ్ముకశ్మీర్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025