NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు
    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు
    భారతదేశం

    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    February 10, 2023 | 05:58 pm 0 నిమి చదవండి
    టీడీపీ వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు : అంబటి రాంబాబు
    పోలవరం పనులను పరిశీలిస్తున్న అంబటి రాంబాబు

    ఏలూరు జిల్లా పోలవరంలో వైసీపీ నీటిపారుదల శాఖ మంత్రి అంబటి రాంబాబు పర్యటించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించారు. స్పిల్ వే, కాపర్ డ్యాం, స్పిల్ ఛానల్, పవర్ ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలను తనిఖీ చేశారు. గత ప్రభుత్వ నిర్ణయాల వల్లే పోలవరం ప్రాజెక్టుకు సమస్యలు తలెత్తాయని అంబటి రాంబాబు ఆరోపించారు. అందువల్లే పోలవరం నిర్మాణం ఆలస్యమైందని ఆరోపించారు. యుద్ధ ప్రాతిపదికన కాఫర్‌ డ్యాం ఎత్తును పెంచామని తెలిపారు. గత ప్రభుత్వం కాఫర్‌ డ్యాం పనులను గాలికొదిలేసిందన్నారు. ఈ ప్రాజెక్టు వాస్తవానికి పూర్తి చేయాల్సి బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకపోయిన రాష్ట్ర నిధులు ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తి చేస్తున్నామని మంత్రి అంబటి రాంబాబు తెలిపారు

    రాష్ట్ర ప్రభుత్వ నిధులతో పోలవరాన్ని పూర్తి చేస్తాం : అంబటి

    పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తొందరపాటు పనికిరాదని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నిపుణుల రిపోర్టు అనంతరం డయాఫ్రమ్ వాల్ కొత్తది నిర్మాణం చేయాలా లేక పాతదే కొనసాగించాలో నిర్ణయం తీసుకుంటామన్నారు. ఒకవేళ కేంద్రం నుంచి నిధులు రాకపోయినా రెండు వేల కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిందని గుర్తుచేశారు

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    అంబటి రాంబాబు
    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    అంబటి రాంబాబు

    మంత్రి అంబటి రాంబాబుపై కేసు నమోదు చేయాలని ఆదేశించిన కోర్టు సత్తెనపల్లె
    పోలవరంపై ఏపీ మంత్రి కీలక వ్యాఖ్యలు.. దిల్లీలో కేంద్రమంత్రిని కలిసిన అంబటి రాంబాబు పోలవరం

    యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ/వైఎస్సార్సీపీ/వైసీపీ

    ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో గందరగోళం; ఎమ్మెల్యేలపై దాడి చేశారంటూ టీడీపీ, వైసీపీ పరస్పరం ఆరోపణలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ ఓటమి పాపం సర్వేలదేనా? అవే జగన్‌ను తప్పుదారి పట్టించాయా? ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి
    వైసీపీ సంచలన నిర్ణయం; నలుగురు ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు ఆంధ్రప్రదేశ్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023