NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
    భారతదేశం

    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా

    వ్రాసిన వారు Naveen Stalin
    May 27, 2023 | 07:32 pm 1 నిమి చదవండి
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా
    NTR: తెలుగునాట రాజకీయ ప్రభంజనం; ఎన్టీఆర్ పొలిటికల్ ప్రస్థానం సాగిందిలా

    1982, మార్చికి ముందు వరకు నందమూరి తారక రామారావు( ఎన్టీఆర్) అంటే తెలుగు తెరపై దేవుడు. తెలుగు వారికి ఆయనే రాముడు, కృష్ణుడు. కానీ 1982, మార్చి తర్వాత ఎన్టీఆర్ అంటే ఓ రాజకీయ ప్రభంజనం. అప్పటిదాకా గుర్తింపుకు నోచుకోని తెలుగువారి ఆత్మగౌరవ నినాదం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంక్షేమ రాజ్యానికి తొలి అడుగు వేసింది ఎన్టీఆర్. రూ. 2 కిలో బియ్యం పథకంతో లక్షల మంది పేదల కడుపు నింపి తెలుగు ప్రజల హృదయాల్లో నిజమైన హీరోగా చెరగని ముద్ర వేసింది ఎన్టీఆర్. తెలుగు నెలపై కాంగ్రేసేతర తొలి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 100వ పుట్టిన రోజు(మార్చి, మే 28) సందర్భంగా ఆయన గురించి ప్రత్యేక కథనం.

    పార్టీ స్థాపించిన 9నెలల్లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్

    1982 ఫిబ్రవరిలో హైదరాబాద్ విమానాశ్రయంలో అప్పటి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి రాజీవ్ గాంధీ మాజీ ముఖ్యమంత్రి టి.అంజయ్యను అవమానించిన సంఘటన ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడానికి మొదటి ప్రేరణగా నిలిచిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలోనే తెలుగువారి ఆత్మగౌరవ నినాదంతో 1982 మార్చిలో 'తెలుగుదేశం పార్టీ'ని ఎన్టీఆర్ ప్రకటించారు. అంతేకాకుండా, పార్టీని పెట్టిన కేవలం 9నెలల్లోనే దశాబ్దాలుగా తెలుగు నెలపై ఏకఛత్రాధిపత్యంగా పాలన సాగిస్తున్న కాంగ్రెస్‌కు చెమటలు పట్టించారు. 1983లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 294 స్థానాలకు గానూ 201 సీట్లు గెలుచుకుని కాంగ్రెస్ పార్టీని కోలుకోలేని దెబ్బతీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తొలి కాంగ్రేసేతర ముఖ్యమంత్రిగా చరిత్ర సృష్టించారు.

    సినిమా ఇమేజ్‌ను పొలిటికల్ ఇమేజ్‌గా మార్చుకున్న ఎన్టీఆర్

    అంజయ్యను రాజీవ్ గాంధీ అవమానించడంతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రులను కాంగ్రెస్ డోర్ మ్యాట్లు మార్చినట్లు మార్చేది. ఇలాంటి పలు సంఘటనలు ఎన్టీఆర్‌ తెలుగు దేశం పార్టీ పెట్టడానికి పురిగోల్పోయి. ఎన్టీఆర్ పార్టీని ప్రకటించినప్పుడు కాంగ్రెస్ నాయకులు లైట్ తీసుకున్నారు. అతను సీరియస్ పొలిటిషయన్ కాదని కొట్టిపారేశారు. రానురానూ ఎన్టీఆర్ ప్రత్యర్థుల మాటలు తప్పని నిరూపించారు. చైతన్య రథం ద్వారా ప్రజల్లోకి వెళ్లి, అప్పటిదాకా తనకున్న సినిమా ఇమేజ్‌ను పొలిటికల్ ఇమేజ్‌గా మార్చుకోవడంలో విజయవంతం అయ్యారు. రోడ్డుపక్కనే స్నానాలు చేయడం, భోజనం చేయడం, రోడ్డుపైనే నిద్రపోవడం లాంటివి ఎన్టీఆర్‌ను మాస్ లీడర్ చేశాయి. దీంతో ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో ఎన్టీఆర్ స్థాపించిన తెలుగు దేశం పార్టీ ఘన విజయం సాధించింది.

    రెండుసార్లు వెన్నుపోటుకు గురైన ఏకైక నాయకుడు 

    13ఏళ్ల రాజకీయ ప్రయాణంలో ఎన్టీఆర్ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. మొదటిసారి అధికారంలోకి వచ్చిన 18 నెలల్లోనే ఎన్టీఆర్ 1984ఆగస్టులో తన సహచరుడు నాదెండ్ల భాస్కర్‌రావు నుంచి తొలిసారి వెన్నుపోటును ఎదుర్కొన్నారు. ఎన్టీఆర్ ఆరోగ్యం బాగాలేక చికిత్స కోసం అమెరికాకు వెళ్లగా, అప్పటి గవర్నర్ రాంలాల్ మద్దతుతో నాదెండ్ల భాస్కర్ రావు సీఎం కుర్చి ఎక్కారు. చికిత్స పూర్తయ్యాక ఎన్టీఆర్ తిరిగి వచ్చాక, మెజారిటీ ఎమ్మెల్యేలు ఎన్టీఆర్‌కు మద్దతు ఇవ్వడంతో భాస్కర్ రావు ప్రభుత్వం కూలిపోయింది. ఆ తర్వాత ఎన్టీఆర్ రాష్ట్రమంతా తిరిగి మళ్లీ 1985లో అధికారంలోకి వచ్చారు. 1995లో ఎన్టీఆర్ అల్లుడు చంద్రాబాబు నాయుడు రూపంలో మరోసారి వెన్నుపోటుకు గురయ్యారు. ఫలితంగా దేశంలోనే రెండుసార్లు వెన్నుపోటుకు గురైనా ఏకైక సీఎంగా ఎన్టీఆర్ నిలిచారు.

    సీఎంగా ఎన్టీఆర్ సంక్షేమ పథకాలు, సంచలన నిర్ణయాలు

    ఎన్టీఆర్ తొలిసారి సీఎం అయ్యాక రూ.2 కిలో బియ్యాన్ని ప్రవేశ పెట్టారు. మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణం, మధ్యపాన నిషేదం లాంటి నిర్ణయాలు తీసుకున్నారు. 1985-1989 మధ్య ఎన్టీఆర్ సీఎంగా సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అందులో కొన్ని వివాదాస్పదం కూడా అయ్యాయి. పట్వారీ వ్యవస్థను రద్దు చేయడం, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణను 58 సంవత్సరాల నుంచి 55 సంవత్సరాలకు తగ్గించడం చాలా వివాదాస్పదమయ్యాయి. ఎన్టీఆర్ తీసుకున్న వివాదాస్పద నిర్ణయాలు 1989లో ఎన్నికల్లో ఎన్టీఆర్ అధికారాన్ని కోల్పోవడానికి కారణం అయ్యాయి.

    నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర 

    1989 ఎన్నికల్లో ఓడిపోయినా ఎన్టీఆర్ రాజకీయంగా ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తర్వాత దేశ రాజకీయాలపై దృష్టి సారించారు. డీఎంకే, అసోం గణపరిషత్‌తో సహా కాంగ్రెసేతర పార్టీల కూటమి అయిన నేషనల్ ఫ్రంట్ ఏర్పాటులో ఆయన కీలక పాత్ర పోషించారు. తద్వారా ఆయన దేశ రాజకీయాల్లో తనదైన ముద్రను వేయగలిగారు. నేషనల్ ఫ్రంట్‌కు బీజేపీ, లెఫ్ట్ ఫ్రంట్ మద్దతు కూడా లభించడంతో 1989 సార్వత్రిక ఎన్నికల్లో రాజీవ్ గాంధీ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.

    లక్ష్మిపార్వతి వర్సెస్ చంద్రబాబు

    ఎన్టీఆర్ భార్య బసవతారకం క్యాన్సర్‌తో మరణించిన ఎనిమిదేళ్ల తర్వాత అంటే 1993లో లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. ఎన్టీఆర్ జీవితంలోకి ఆమె ప్రవేశించిన తర్వాత ఆయనకి ,ఆయన కుటుంబ సభ్యులకు మధ్య దూరం పెరిగింది. ఈ క్రమంలో డిసెంబర్ 1994లో రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్టీఆర్ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కుటుంబం, పార్టీలో వివాదాలు మరింత ముదిరాయి. లక్ష్మీ పార్వతి అధికారాన్ని చేజిక్కించుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో, చంద్రబాబు అలర్ట్ అయి అమె కంటే ముందే 1995 ఆగస్టులో తిరుగుబాటు చేశారని అప్పట్లో ప్రచారం జరిగింది. ఈ క్రమంలో మెజార్టీ ఎమ్మెల్యేలు చంద్రబాబు వెంట ఉండటంతో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలిగారు. ఆ తర్వాత చంద్రబాబు సీఎం అయ్యారు.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నందమూరి తారక రామారావు
    తెలుగు దేశం పార్టీ/టీడీపీ
    ఆంధ్రప్రదేశ్
    తెలంగాణ
    ముఖ్యమంత్రి
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్

    నందమూరి తారక రామారావు

    తారకరత్న అంత్యక్రియల్లో అజ్ఞాతవ్యక్తి: బాలకృష్ణతో మాట్లాడుతుంటే పక్కకు తీసుకెళ్ళిన పోలీసులు తెలుగు చిత్ర పరిశ్రమ
    నందమూరి తారకరత్న మృతి పట్ల సినీ ప్రముఖుల సంతాపం తెలుగు సినిమా
    సినీనటుడు తారకరత్న కన్నుమూత- విషాదంలో నందమూరి కుటుంబం నందమూరి బాలకృష్ణ
    రూ.100వెండి నాణెంపై ఎన్టీఆర్ బొమ్మ ముద్రించాలని కేంద్రం నిర్ణయం తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    తెలుగు దేశం పార్టీ/టీడీపీ

    రోడ్డు ప్రమాదంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి తీవ్ర గాయాలు  ప్రకాశం జిల్లా
    రాజకీయాల్లోకి వైఎస్ వివేక కూతురు సునీత ఎంట్రీ ఇస్తున్నారా? కడపలో పోస్టర్లు వైరల్  కడప
    ఏపీలో ట్రోలింగ్ రాజకీయం: జగన్ స్టిక్కర్ తొలగించిన కుక్కపై పోలీసులకు టీడీపీ ఫిర్యాదు  ఆంధ్రప్రదేశ్
    సెల్ఫీ ఛాలెంజ్‌పై కౌంటర్; సుపరిపాలనపై చంద్రబాబుకు సవాల్ విసిరిన ఏపీ సీఎం జగన్  ఆంధ్రప్రదేశ్

    ఆంధ్రప్రదేశ్

    అరకులోయ కాఫీ పంటకు ఆర్గానిక్ సర్టిఫికేట్, వివరాలివే  భారతదేశం
    గుడ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్ 1, 2 పోస్టుల భర్తీకి సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి
    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    విద్యా దీవెన నిధులు విడుదల; విద్యార్థిణి స్పీచ్‌కు ముగ్ధుడైన సీఎం జగన్  వైఎస్ జగన్మోహన్ రెడ్డి

    తెలంగాణ

    రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత.. ఈ జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదు  వాతావరణ మార్పులు
    రెండు దేశాలు, 80 సమావేశాలు, 42వేల ఉద్యోగాలు; కేటీఆర్ విదేశీ పర్యటన సాగిందిలా హైదరాబాద్
    హైదరాబాద్‌: అండర్‌వాటర్‌ టన్నెల్‌ ఎక్స్‌పోకు విశేష స్పందన; భారీగా తరలివస్తున్న పబ్లిక్ హైదరాబాద్
    జూన్ 22నుంచి ఆషాఢ బోనాలు; నిర్వహణం కోసం రూ.15కోట్లు కేటాయించిన ప్రభుత్వం తాజా వార్తలు

    ముఖ్యమంత్రి

    కర్ణాటక మంత్రివర్గ విస్తరణ: 24మంది కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం కర్ణాటక
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరించాలని కేజ్రీవాల్ నిర్ణయం: ప్రధానికి లేఖ  అరవింద్ కేజ్రీవాల్
    కర్ణాటకలో కేబినెట్‌ విస్తరణ; రేపు 24మంది మంత్రులు ప్రమాణ స్వీకారం కర్ణాటక

    తాజా వార్తలు

    భారీ వర్షంతో చల్లబడిన దిల్లీ; విమానాల దారి మళ్లింపు దిల్లీ
    పాస్‌పోర్ట్ పొందేందుకు రాహుల్ గాంధీకి మూడేళ్లపాటు ఎన్ఓసీ ఇచ్చిన కోర్టు  రాహుల్ గాంధీ
    కొత్త పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి ప్రారంభించాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    కేరళ: హోటల్ యజమాని హత్య; ట్రాలీ బ్యాగ్‌లో మృతదేహం లభ్యం  కేరళ

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    లండన్‌లో టిప్పు సుల్తాన్ కత్తి వేలం; రూ.143 కోట్లు పలికిన ఖడ్గం  బ్రిటన్
    హైదరాబాద్- ఫ్రాంక్‌ఫర్ట్‌కు నేరుగా విమాన సర్వీసు; వచ్చే ఏడాది నుంచి ప్రారంభం  హైదరాబాద్
    వైకల్యాన్ని జయించిన సూరజ్ తివారీ; రెండు కాళ్లు, కుడి చేయి లేకున్నా సివిల్స్ ర్యాంకు సాధించాడు  ఉత్తర్‌ప్రదేశ్
    దేశంలో కొత్తగా 535మందికి కరోనా; 6,168కి తగ్గిన యాక్టివ్ కేసులు  కరోనా కొత్త కేసులు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023