NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Pre primary: సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Pre primary: సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం
    సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం

    Pre primary: సర్కారు బడుల్లోనూ ప్రీ ప్రైమరీ.. ప్రభుత్వ నిర్ణయం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 11, 2025
    08:15 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక (ప్రీ-ప్రైమరీ) తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది.

    ప్రస్తుతం ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు నేరుగా మొదటి తరగతి నుంచే విద్యనభ్యసించగలుగుతున్నారు.

    అయితే ప్రైవేట్ విద్యాసంస్థల్లో నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ తరగతులు చాలా కాలం నుంచే కొనసాగుతుండటంతో, మూడు సంవత్సరాలు పూర్తైన వెంటనే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్చేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు.

    ఈ పరిస్థితి కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య సంవత్సరానికొకసారి తగ్గుముఖం పడుతోందన్న అనుమానంతో, ఈ సమస్యకు పరిష్కారంగా శిశు విద్య ప్రారంభించాలని ప్రభుత్వం తేల్చుకుంది.

    వివరాలు 

     చిన్నారులకు ఉచిత రవాణా సౌకర్యం 

    ఈ నిర్ణయం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం వెల్లడిస్తూ, త్వరలోనే ప్రీ ప్రైమరీ తరగతులు ప్రారంభిస్తామని తెలిపారు.

    అంతేకాకుండా, ఈ తరగతుల్లో చేరే చిన్నారులకు ఉచిత రవాణా సౌకర్యాన్ని కూడా అందిస్తామని పేర్కొన్నారు.

    ఈ ప్రకటన నేపథ్యంలో విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నరసింహారెడ్డి, టాస్ డైరెక్టర్ శ్రీహరి తదితరులు సమావేశమై కార్యాచరణపై చర్చించారు.

    వివరాలు 

    పాఠశాలల సంఖ్య, అమలు ప్రణాళిక 

    రాష్ట్రంలో ప్రస్తుతం 18,133 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వాటిలో 6,000 పాఠశాలలకే 50కి పైగా విద్యార్థులు ఉన్నారు.

    మిగిలిన చాలా పాఠశాలల్లో 10 నుండి 20మంది వరకు మాత్రమే విద్యార్థులు ఉన్నారు.

    ఈ నేపథ్యంలో,ఎన్ని పాఠశాలల్లో ప్రీ ప్రైమరీ తరగతులు ప్రవేశపెట్టాలనే అంశంపై స్పష్టత అవసరం.

    ఇక మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15,000అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల ఆవరణల్లో ఉన్నాయి.

    ఈ నేపథ్యంలో,పూర్వ ప్రాథమిక విద్యను ఎవరు బోధించాలి?అనేది మరో ప్రశ్న.

    అంగన్‌వాడీ టీచర్లే బోధించాలా?లేదా ప్రభుత్వ ఉపాధ్యాయులే చెయ్యాలా?అనే విషయంపై ఇంకా నిర్ణయం రావాల్సి ఉంది.

    ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం,2025-26 విద్యాసంవత్సరం నుండి ప్రతి మండలంలో ఒకటి లేదా రెండు పాఠశాలల్లో ప్రయోగాత్మకంగా ఈ తరగతులను ప్రారంభించనున్నారు.

    వివరాలు 

    విద్యార్థుల సంఖ్య పెరుగుతుందా? 

    ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఆంగ్ల మాధ్యమ బోధన లేకపోవడమేనని ఉపాధ్యాయ సంఘాలు గతంలో పేర్కొన్నాయి.

    దీనితోనే ప్రభుత్వం 2022-23 నుంచే ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది.

    అయినప్పటికీ ఆశించిన మేరకు విద్యార్థుల నమోదు పెరగలేదు. అసలు ఆంగ్ల మాధ్యమంలో బోధన జరిగేది లేదన్నవార్తలు విద్యార్థుల తల్లిదండ్రుల నమ్మకాన్ని తగ్గించాయని తెలుస్తోంది.

    ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయం ప్రకారం, ప్రీ ప్రైమరీ తరగతుల లేని పరిస్థితి, అలాగే ఒక్కో తరగతికి ఒక ఉపాధ్యాయుని నియమించకపోవడమే విద్యార్థుల సంఖ్య తగ్గడానికి మరో కారణమని చెబుతున్నారు.

    ఇటీవల విద్యా కమిషన్ కూడా పూర్వ ప్రాథమిక తరగతులను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకుంటోంది.

    వివరాలు 

    రాష్ట్రవ్యాప్తంగా ప్రతి తరగతిలో సగటున 6 లక్షల మంది విద్యార్థులు

    అయితే ఈ చర్యలతో విద్యార్థుల సంఖ్య వృద్ధి చెందుతుందా? అన్నది కేవలం కాలమే చెప్పాలి.

    ప్రస్తుతానికి, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి తరగతిలో సగటున 6 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు.

    అందులో మొదటి తరగతిలో చదువుతున్న వారిలో కేవలం 1.66 లక్షల మంది మాత్రమే (27.66 శాతం) ప్రభుత్వ పాఠశాలలకే చెందారు.

    ఈ సంఖ్య 2016-17లో అత్యధికంగా 2.89 లక్షలుగా ఉండగా, 2020-21 (కరోనా సంవత్సరం)ను మినహాయిస్తే, ప్రస్తుత ఏడాదిలోనే విద్యార్థుల సంఖ్య అత్యంత తక్కువగా ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Squid Game 3 : ఫైనల్ గేమ్‌కు కౌంట్‌డౌన్ స్టార్ట్.. 'స్క్విడ్ గేమ్ 3' ట్రైలర్ విడుదల! ఓటిటి
    Miss World 2025: మిస్ వరల్డ్ 2025 విజేతగా థాయ్‌లాండ్ యువతి థాయిలాండ్
    Kubera : 'కుబేర' నుంచి మరో మ్యూజికల్ ట్రీట్.. సెకండ్ సింగిల్‌కు డేట్ ఫిక్స్! కుబేర
    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల

    తెలంగాణ

    TS Assembly 2025: తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్ట్‌.. భట్టి విక్రమార్క కీలక ప్రకటన? భట్టి విక్రమార్క
    Interest Waiver: తెలంగాణలో ఆస్తి పన్ను బకాయిలకు భారీ ఊరట.. 90శాతం వడ్డీ మాఫీ పన్ను
    Weather Report: ఏపీ, తెలంగాణలో ఎండలు విజృంభణ.. 47 మండలాల్లో తీవ్ర వడగాల్పులు ఆంధ్రప్రదేశ్
    New Excise Police Stations: హైదరాబాద్‌లో 13 కొత్త ఎక్సైజ్‌ పోలీస్‌ స్టేషన్లు.. వరంగల్‌ అర్బన్‌లో ఒకటి  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025