President's rule: జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి మార్గం సుగమం
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జమ్మూకశ్మీర్లో రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ నిర్ణయం, జమ్మూకశ్మీర్లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తోంది. ఈ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రిగా ఒమర్ అబ్దుల్లా ఈ నెల 16న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనను కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి నాయకుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 2018లో అప్పటి పీడీపీ-బీజేపీ కూటమి విడిపోయిన తర్వాత జమ్ముకశ్మీర్లో రాష్ట్రపతి పాలన విధించారు . తదనంతరం, 2019లో,కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగంలోని ఆర్టికల్ 370ని రద్దు చేసి,జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది . ఒమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంగా ఉన్నప్పుడు 2009 నుండి 2014 వరకు NC-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు.