NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ
    1/2
    భారతదేశం 0 నిమి చదవండి

    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ

    వ్రాసిన వారు Naveen Stalin
    Apr 24, 2023
    03:35 pm
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ
    గత ప్రభుత్వాలు గ్రామాలను విస్మరించాయి: ప్రధాని మోదీ

    గత పాలకులపై ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం విరుచుకుపడ్డారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధిని గత ప్రభుత్వాలు విస్మరించాయని, నిధుల కేటాయింపులో వివక్ష చూపాయని మండిపడ్డారు. అయితే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అలాంటి వ్యత్యాసాలను తొలగించిందన్నారు. మధ్యప్రదేశ్‌లోని రేవాలో పంచాయితీ రాజ్ దివాస్ వేడుకలను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. చాలా రాజకీయ పార్టీలు గ్రామాల్లోని ప్రజలను విభజించి తమ పబ్బం గడుపుకున్నాయని, బీజేపీ ప్రభుత్వం వచ్చాక, గ్రామాలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టినట్లు చెప్పారు. గ్రామాల అభివృద్ధికి తమ ప్రత్యేక నిధులను కేటాయించినట్లు వివరించారు. స్వాతంత్ర్యం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు భారతదేశంలోని పంచాయతీరాజ్ వ్యవస్థను నాశనం చేశాయని ప్రధాని మోదీ అన్నారు.

    2/2

    8ఏళ్లలో 30వేలకు పైగా కొత్త పంచాయతీ భవనాలను నిర్మించాం: మోదీ

    స్వాతంత్య్రానంతరం అత్యధిక కాలం ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ గ్రామాల నమ్మకాన్ని వమ్ము చేసిందని కాంగ్రెస్‍‌పై పరోక్ష విమర్శలు చేశారు. యూపీఏ హయాంలో 10 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో 6 వేల పంచాయతీ భవనాలను మాత్రమే నిర్మించారని, కాని తమ ప్రభుత్వం 8 ఏళ్లలో 30వేలకు పైగా కొత్త పంచాయతీ భవనాలను నిర్మించినట్లు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 70లోపు గ్రామ పంచాయతీలకు మాత్రమే ఆప్టికల్‌ ఫైబర్‌ను అనుసంధానం చేసిందని, కానీ బీజేపీ ప్రభుత్వం దేశంలోని 2 లక్షలకు పైగా పంచాయతీలకు ఆప్టికల్‌ ఫైబర్‌ను తీసుకెళ్లినట్లు మోదీ పేర్కొన్నారు. దేశంలో పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి తమ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    నరేంద్ర మోదీ
    ప్రధాన మంత్రి
    మధ్యప్రదేశ్
    తాజా వార్తలు

    నరేంద్ర మోదీ

    దేశంలోనే మొదటి 'వాటర్ మెట్రో' కేరళలో ఏర్పాటు; దాని విశేషాలను తెలుసుకోండి  కేరళ
    కర్ణాటక ఎన్నికలు 2023: ప్రచారంలో దూకుడు పెంచిన బీజేపీ; అగ్రనేతల హడావుడి  కర్ణాటక
    సూడాన్‌లో చిక్కుకుపోయిన 4వేలమంది భారతీయులు; ప్రధాని మోదీ ఉన్నతస్థాయి సమావేశం  సూడాన్
    పాఠశాలను బాగు చేయాలని మోదీని కోరిన విద్యార్థిని; స్పందించిన యంత్రాంగం జమ్ముకశ్మీర్

    ప్రధాన మంత్రి

    'అధికార దాహంతో దేశానికి చాలా హాని చేశారు'; కాంగ్రెస్‌పై విరుచుకపడ్డ మోదీ  నరేంద్ర మోదీ
    అదనపు మానవతా సాయం కోరుతూ మోదీకి లేఖ రాసిన జెలెన్‌స్కీ  ఉక్రెయిన్
    రాజస్థాన్: దిల్లీ-జైపూర్-అజ్మీర్ వందే‌భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రారంభించిన మోదీ  రాజస్థాన్
    నల్లమలలో 75 పులులు; ఎన్ఎస్‌టీఆర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఏర్పడి 50ఏళ్లు నాగార్జునసాగర్

    మధ్యప్రదేశ్

    మధ్యప్రదేశ్: రెండు గూడ్స్ రైళ్లు ఢీ; లోకో పైలట్ మృతి  రైలు ప్రమాదం
    ఇండోర్ గుడిలో ప్రమాదం; 35కు చేరిన మృతుల సంఖ్య ఇండోర్
    ఇండోర్ ఆలయంలో కూలిపోయిన మెట్లబావి; 13మంది మృతి ఇండోర్
    హెచ్3ఎన్2 వైరస్: మహారాష్ట్ర, దిల్లీలో హై అలర్ట్; దేశంలో 9కి చేరిన మరణాలు మహారాష్ట్ర

    తాజా వార్తలు

    అతిక్ అహ్మద్ కార్యాలయంలో రక్తంతో తడిసిన క్లాత్, మెట్లపై బ్లెడ్ మరకలు, మారణాయుధాలు  ఉత్తర్‌ప్రదేశ్
    తెలంగాణలో ముస్లింల రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్ షాపై ఒవైసీ ఫైర్  అసదుద్దీన్ ఒవైసీ
    లోటస్ పాండ్ వద్ద హై టెన్షన్; మహిళా కానిస్టేబుల్‌ను చెంపదెబ్బ కొట్టిన షర్మిల హైదరాబాద్
    సూడాన్ పోరాటంలో 413 మంది మృతి: డబ్ల్యూహెచ్‌ఓ సూడాన్
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023