NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Prime Minister Modi: ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస 
    తదుపరి వార్తా కథనం
    Prime Minister Modi: ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస 
    ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస

    Prime Minister Modi: ఆదివాసీల సంప్రదాయ ఆహారం ఇప్పపువ్వు లడ్డూ.. మన్‌కీబాత్‌లో నరేంద్ర మోదీ ప్రశంస 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Mar 31, 2025
    08:45 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ప్రధానమంత్రి మెచ్చిన ఇప్పపువ్వు లడ్డూ ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూరు మండలానికి చెందిన ఆదివాసీ మహిళలు భీంబాయి ఆదివాసీ సహకార సంఘం ఆధ్వర్యంలో తయారు అవుతోంది.

    ఈ లడ్డూలను గిరిజన గర్భిణులు,బాలింతలు,అలాగే రక్తహీనత సమస్యతో బాధపడుతున్నవారికి అధికారులు అందజేస్తున్నారు.

    ఒక్క లడ్డూ 20 గ్రాముల బరువుతో ఉంటుంది. కిలో లడ్డూల ధర రూ.300గా నిర్ణయించబడింది.

    కిలో లడ్డూల తయారీ కోసం 400 గ్రాముల ఇప్పపువ్వులు, 190 గ్రాముల నువ్వులు, 190 గ్రాముల బెల్లం, 190 గ్రాముల పల్లీలు, 30 గ్రాముల కిస్మిస్, మంచి నూనెను ఉపయోగిస్తారు.

    దేశవ్యాప్తంగా తొలిసారిగా 2020లో పైలట్‌ ప్రాజెక్టుగా ఆదిలాబాద్‌ జిల్లాలో 1,845 మంది, కుమురం భీం జిల్లాలో 817 మంది గిరిజన గర్భిణులకు ఇప్పపువ్వు లడ్డూలను పంపిణీ చేశారు.

    వివరాలు 

    కుంరం భాగుబాయి ఆనందం

    అంతేకాకుండా, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలల్లో చదువుతున్న గిరిజన విద్యార్థినులకు నెలకు సుమారు 20 క్వింటాళ్ల ఇప్పపువ్వు లడ్డూలను భీంబాయి సంఘం ద్వారా కొనుగోలు చేసి, గిరిజన విద్యార్థినులకు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా అందజేస్తున్నారు.

    ప్రధానమంత్రి ప్రశంసించడంపై భీంబాయి ఆదివాసీ మహిళా సంఘం అధ్యక్షురాలు కుంరం భాగుబాయి ఆనందం వ్యక్తం చేశారు.

    భవిష్యత్తులో మరింత కృషితో ఈ పరిశ్రమను విస్తరించేందుకు కట్టుబడి ఉంటామని తెలిపారు.

    తెలంగాణలో కొత్త ప్రయోగం:

    ఆదిలాబాద్‌ జిల్లా మహిళలు ఇప్పపువ్వుతో వినూత్న ప్రయోగాలు చేపట్టారు.వారు వివిధ రకాల వంటకాలను తయారు చేస్తున్నారు,ఇవి ప్రజల్లో విపరీతమైన ఆదరణ పొందుతున్నాయి.

    వారి వంటల్లో ఆదివాసీ సంస్కృతి ప్రత్యేకంగా ప్రతిబింబిస్తోంది,అలాగే వాటిలో సహజమైన తీపి రుచిని కూడా పొందవచ్చు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    మన్ కీ బాత్

    తాజా

    Russia:ప్రత్యక్ష చర్చలు జరపాలి.. భారత్‌-పాక్‌లకు రష్యా కీలక సందేశం భారతదేశం
    Gaza-Israel: గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్‌.. ఒక్క రోజులో 146 మంది మృతి ఇజ్రాయెల్
    Asaduddin Owaisi: పాకిస్థాన్ మానవాళికి అతిపెద్ద ముప్పు: అసదుద్దీన్ ఓవైసీ ఫైర్ అసదుద్దీన్ ఒవైసీ
    Andhra Pradesh: మహిళలకు గుడ్ న్యూస్.. ఆ రోజు నుంచే ఉచిత బస్సు ప్రయాణం చంద్రబాబు నాయుడు

    నరేంద్ర మోదీ

    PM Modi:అమెరికాలో మోదీకి ఘన స్వాగతం.. ఎలాన్ మస్క్‌తో కీలక చర్చలు? ఎలాన్ మస్క్
    PM Modi: బ్లేయర్ హౌస్‌లో మోదీ బస.. ఇందులో ఉన్న ప్రత్యేకతలు ఏమిటి? అమెరికా
    PM Modi Trump Meet: ముందుగా టారీఫ్‌లు... తర్వాత వాణిజ్య ఒప్పందాలు! డొనాల్డ్ ట్రంప్
    Narendra Modi: అమెరికాకు 'మాగా', ఇండియాకు 'మిగా'.. ట్రంప్‌తో భేటీలో మోదీ కీలక వ్యాఖ్యలు భారతదేశం

    మన్ కీ బాత్

    'మన్ కీ బాత్' 100వ ఎపిసోడ్; వంద ఇసుక రేడియోలతో అబ్బురపరిచే సైకత శిల్పం పూరీ జగన్నాథ దేవాలయం
    Mann ki Baat 100th Episode: ప్రజలతో కనెక్ట్ అవడానికి 'మన్ కీ బాత్' నాకు మార్గాన్ని చూపింది: ప్రధాని మోదీ  తాజా వార్తలు
    2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే భారత్ లక్ష్యం: ప్రధాని మోదీ  ప్రధాన మంత్రి
    PM Modi : 'మన్ కీ బాత్'కు 3 నెలల విరామం ప్రకటించిన ప్రధాని మోదీ  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025