NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Liquor Policy: నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు.. ప్రారంభం కానున్న 3396 కొత్త షాపులు..
    తదుపరి వార్తా కథనం
    AP Liquor Policy: నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు.. ప్రారంభం కానున్న 3396 కొత్త షాపులు..
    నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు

    AP Liquor Policy: నేటి నుంచి ఏపీలో ప్రైవేటు మద్యం దుకాణాలు.. ప్రారంభం కానున్న 3396 కొత్త షాపులు..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 16, 2024
    08:59 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో బుధవారం నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకోబోతున్నాయి.మొత్తం 3,396 దుకాణాలకు లైసెన్సుల జారీ ప్రక్రియ పూర్తయింది.

    లైసెన్సులు పొందిన వ్యక్తులు తమ కొత్త ప్రాంగణాల్లో బుధవారం నుంచి వ్యాపారం ప్రారంభించనున్నారు.

    మొదటి విడత లైసెన్సు రుసుముల కింద వారు ప్రభుత్వానికి సుమారు రూ.330 కోట్లు చెల్లించారు.

    ఈ దుకాణాలకు సరిపడా మద్యం నిల్వలు కోసం లైసెన్సుదారులు ఏపీఎస్‌బీసీఎల్‌కు ఆర్డర్లు ఇచ్చారు, వీటి విలువ దాదాపు రూ.350 కోట్ల నుండి రూ.400 కోట్ల వరకు ఉంటుంది.

    ఆర్డర్ల కోసం ఎక్సైజ్ శాఖ ప్రత్యేకంగా లాగిన్ ఐడీలు కూడా ఇచ్చింది.

    వివరాలు 

    ప్రభుత్వ దుకాణాల ముగింపు 

    వైసీపీ హయాంలో గత ఐదేళ్లుగా నడుస్తున్న ప్రభుత్వ మద్యం దుకాణాలు మంగళవారంతో ముగిసాయి.

    రాత్రి 10 గంటలకు ఎక్సైజ్ అధికారులు అన్ని ప్రభుత్వ దుకాణాలను మూసివేశారు.

    మిగిలిన స్టాక్‌ను డిపోలకు, ఇతర వస్తువులను స్థానిక ఎక్సైజ్ స్టేషన్లకు బుధవారం తరలించనున్నారు.

    కొరుకున్న బ్రాండ్లు అందుబాటులోకి

    వైసీపీ హయాంలోని ప్రభుత్వ దుకాణాల్లో 'జే బ్రాండ్ల' మాత్రమే లభించేవి. వినియోగదారులు కోరుకున్న జాతీయ, అంతర్జాతీయ బ్రాండ్లు అందుబాటులో ఉండేవి కావు.

    కానీ ఇప్పుడు, మద్యం వ్యాపారం ప్రైవేటు చేతుల్లోకి వెళ్లడంతో వినియోగదారులు కోరుకున్న అన్ని బ్రాండ్లు అందుబాటులోకి రానున్నాయి.

    ఏపీఎస్‌బీసీఎల్‌ లైసెన్సుదారులు ఆర్డర్ పెట్టిన రకాలనే సరఫరా చేయడానికి సిద్ధమవుతోంది.

    వివరాలు 

    మాదకద్రవ్యాల నియంత్రణ 

    రాష్ట్ర ప్రభుత్వం మద్యం మీద కొత్తగా మాదకద్రవ్యాల నియంత్రణ సుంకం (డ్రగ్ కంట్రోల్ సెస్) విధించింది, ఇది ల్యాండెడ్ కాస్ట్‌పై 2% మేర ఉంటుంది.

    ఈ సుంకం ద్వారా సుమారు రూ.90 కోట్ల నుండి రూ.100 కోట్ల వరకు ఆదాయం సమకూరుతుందని అంచనా.

    ఈ సొమ్ము గంజాయి, డ్రగ్స్‌పై నియంత్రణ, వ్యసన విముక్తి కౌన్సెలింగ్ కేంద్రాల ఏర్పాటుకు వాడబడుతుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    ఆంధ్రప్రదేశ్

    Compensation to Flood Victims: వరద బాధితులకు భారీ సాయం.. రూ. 602 కోట్ల జమ చంద్రబాబు నాయుడు
    Andhra Pradesh: ఏపీ సర్కార్ ప్రతిపాదనలకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. ఎంఎస్ఎంఈ పరిశ్రమ విజయవాడలో ఏర్పాటు.. కేంద్ర ప్రభుత్వం
    Kunki elephants: కుంకీ ఏనుగుల అంశంపై ఏపీ-కర్ణాటక ప్రభుత్వాల మధ్య ఒప్పందం కర్ణాటక
    Andhrapradesh: ఆంధ్రప్రదేశ్ లో నూతన ఇంధన పాలసీ సిద్ధం!.. రాబోయే ఐదేళ్లలో రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025