NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్ 
    తదుపరి వార్తా కథనం
    యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్ 
    యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాకం ఫోకస్

    యూపీని వదిలి జాతీయ రాజకీయాలపై ప్రియాంక ఫోకస్ 

    వ్రాసిన వారు Stalin
    Jun 09, 2023
    07:19 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీ రాజకీయాలపై మరింత సీరియస్‌గా దృష్టి పెట్టాలని భావిస్తోంది.

    2024సార్వత్రిక ఎన్నికలతో పాటు త్వరలో పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ పోరు నేపథ్యంలో జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు చేపట్టేందు ప్రియాంక సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

    ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ యూనిట్ ప్రధాన కార్యదర్శి పదవికి ప్రియాంక రాజీనామా చేసే, జాతీయ స్థాయిలో బాధ్యతలు చేపట్టే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయి.

    హిమాచల్‌ప్రదేశ్, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన విజయాలు పార్టీ పునరుజ్జీవనాన్ని అందించాయి.

    ఇదే ఉత్సాహంతో త్వరలో జరగనున్న మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ఎన్నికల్లో రాణించాలని కాంగ్రెస్ ఉవ్విళ్లూరుతోంది.

    అలాగే 2024 లోక్‌సభ ఎన్నికలలో బీజేపీని గద్దె దించాలని భావిస్తోంది.

    కాంగ్రెస్

    వయనాడ్ నుంచి లోక్‌సభ బరిలో ప్రియాంక గాంధీ

    ప్రియాంక యూపీకే పరిమితం కాకూడదని కాంగ్రెస్ సీనియర్ నేతలు భావిస్తున్నారు.

    ప్రియాంక, రాహుల్ గాంధీ హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశారని, ఇదే పార్టీ విజయానికి కారణమైందని వారు చెబుతున్నారు.

    ఏప్రిల్‌లో రాహుల్‌పై అనర్హత వేటు పడిన తర్వాత ప్రియాంకతో కలిసి రాహుల్ తన లోక్‌సభ నియోజకవర్గమైన వాయనాడ్ ను సందర్శించారు.

    ఈ క్రమంలో రాహుల్‌పై అనర్హతవేటు పడిన నేపథ్యంలో 2024 ఎన్నికల్లో ప్రియాంక గాంధీ వయనాడ్ నుంచి బరిలో నిలిచే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది.

    కాంగ్రెస్

    త్వరలోనే ఆ రాష్ట్రాలకు కొత్త పీసీసీ చీఫ్‌ల నియామకం

    తమిళనాడు, దీల్లీ, పశ్చిమ బెంగాల్, గుజరాత్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల పార్టీ యూనిట్లు త్వరలో కొత్త చీఫ్‌లను పొందవచ్చని నివేదికలు చెబుతున్నాయి.

    రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్ మధ్య అంతర్గత పోరు మధ్య రాజస్థాన్ కాంగ్రెస్ కమిటీని పునరుద్ధరించవచ్చని ప్రచారం జరుగుతోంది.

    అదే విధంగా పార్టీ అత్యున్నత నిర్ణయాధికార సంస్థ అయిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యుసీ)ని కూడా పునర్వ్యవస్థీకరించబడే అవకాశం ఉంది. కొన్ని వారాల్లోనే ఇది పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

    సీడబ్ల్యుసీలో ప్రియాంక గాంధీకి స్థానం కల్పించే అవకాశం ఉందని సమాచారం.

    యూపీలో ప్రియాంక స్థానంలో దీపేందర్ సింగ్ హుడా, భన్వర్ జితేంద్ర సింగ్, తారిఖ్ అన్వర్, హరీష్ రావత్‌లను నియమించనున్నట్లు తెలుస్తోంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రియాంక గాంధీ
    కాంగ్రెస్
    రాహుల్ గాంధీ

    తాజా

    Ride Connect: అదిరే లుక్, టెక్ ఫీచర్లతో యాక్సెస్ స్కూటర్ కొత్త వెర్షన్ విడుదల స్కూటర్
    Operation Sindoor: ఉగ్రవాదంపై పాక్‌ పాత్రను ప్రపంచానికి చెప్పేందుకు ఏడుగురు ప్రతినిధులు సిద్ధం భారతదేశం
    Nayanthara: మెగాస్టార్-లేడీ సూపర్ స్టార్ కాంబో ఫిక్స్.. ధ్రువీకరించిన మూవీ టీం నయనతార
    Boycott turkey: 'బాయ్‌కాట్‌ తుర్కియే' ఉద్యమానికి మద్దతుగా మింత్రా, అజియో కీలక నిర్ణయం ఆపరేషన్‌ సిందూర్‌

    ప్రియాంక గాంధీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  తాజా వార్తలు
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  తాజా వార్తలు
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ కల్వకుంట్ల తారక రామరావు (కేటీఆర్)
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక

    కాంగ్రెస్

    'కాంగ్రెస్ 'వారంటీ' గడువు ముగిసింది'; హస్తం పార్టీపై ప్రధాని మోదీ సెటైర్లు నరేంద్ర మోదీ
    ప్రధాని మోదీని విషసర్పంతో పోల్చిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే మల్లికార్జున ఖర్గే
    కాంగ్రెస్ మేనిఫెస్టో: ఉచిత విద్యుత్, రూ.3వేల నిరుద్యోగ భృతి, కుటుంబ పెద్దకు రూ.2వేలు కర్ణాటక
    కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్‌ తప్పిన ప్రమాదం; హెలికాప్టర్ అత్యవసరల ల్యాండింగ్ కర్ణాటక

    రాహుల్ గాంధీ

    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై పార్లమెంట్‌లో గందరగోళం; క్షమాపణ చెప్పాలని బీజేపీ డిమాండ్ స్మృతి ఇరానీ
    లండన్‌లో రాహుల్ వ్యాఖ్యలపై దద్దరిల్లిన పార్లమెంట్; 20వ తేదీకి ఉభయ సభలు వాయిదా లోక్‌సభ
    నెహ్రూ కుటుంబాన్ని అవమానించారని ప్రధాని మోదీపై కాంగ్రెస్ ప్రివిలేజ్ మోషన్ కాంగ్రెస్
    రాహుల్ గాంధీ కాంగ్రెస్ ముఖచిత్రంగా ఉంటే మోదీకే లాభం: మమతా బెనర్జీ మమతా బెనర్జీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025