Page Loader
Priyanka Gandhi: వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక
వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక

Priyanka Gandhi: వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 18, 2024
03:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు 90 నిమిషాల చర్చ తర్వాత, బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. అయితే, కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. వారు జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపాలని డిమాండ్ చేశారు. అందుకే, బిల్లును జేపీసీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

వివరాలు 

ప్యానెల్లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ 

ఒకే దేశం-ఒకే ఎన్నికలపై నియమించిన జాయింట్ పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి చోటు దక్కిందని సమాచారం. ప్యానెల్లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు, మనీష్ తివారీకి కూడా చోటు లభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ కమిటీ జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించనుంది. ప్రస్తుతం పార్లమెంట్‌లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది.

వివరాలు 

పలు పేర్లను ప్రతిపాదించిన తృణమూల్ కాంగ్రెస్

అయితే,జమిలి ఎన్నికల బిల్లును పరిశీలించేందుకు కాంగ్రెస్ నుండి ప్రియాంకాగాంధీ,మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా,సుఖ్‌దేయో భగత్ సింగ్ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం. అలాగే,ఇండియా కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ కూడా పలు పేర్లను ప్రతిపాదించింది. టీఎంసీ నుండి సాకేత్ గోఖలే,కల్యాణ్ బెనర్జీ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.ఫైనల్‌గా, కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.