NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Priyanka Gandhi: వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక
    తదుపరి వార్తా కథనం
    Priyanka Gandhi: వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక
    వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక

    Priyanka Gandhi: వన్ నేషన్, వన్ ఎలక్షన్' పార్లమెంటరీ ప్యానెల్‌లో ప్రియాంక

    వ్రాసిన వారు Sirish Praharaju
    Dec 18, 2024
    03:36 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    భారతదేశ రాజకీయ చరిత్రలో మంగళవారం ఒక చారిత్రక ఘట్టం చోటు చేసుకుంది.

    దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేందుకు అనువుగా 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభలో ప్రవేశపెట్టింది.

    కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్ మేఘ్‌వాల్, 129వ రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు, కేంద్ర పాలిత ప్రాంతాల చట్ట సవరణ బిల్లును కూడా లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

    దాదాపు 90 నిమిషాల చర్చ తర్వాత, బిల్లుకు అనుకూలంగా 269 మంది, వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు.

    అయితే, కేంద్రం నియంతృత్వంగా వ్యవహరిస్తుందంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి.

    వారు జాయింట్ పార్లమెంట్ కమిటీకి బిల్లు పంపాలని డిమాండ్ చేశారు. అందుకే, బిల్లును జేపీసీ కమిటీకి పంపాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.

    వివరాలు 

    ప్యానెల్లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ 

    ఒకే దేశం-ఒకే ఎన్నికలపై నియమించిన జాయింట్ పార్లమెంట్ కమిటీలో కాంగ్రెస్ అగ్ర నేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీకి చోటు దక్కిందని సమాచారం.

    ప్యానెల్లో ప్రియాంకను భాగం చేయాలని కాంగ్రెస్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

    ఆమెతో పాటు, మనీష్ తివారీకి కూడా చోటు లభించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

    ఈ కమిటీ జమిలి ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును పరిశీలించనుంది.

    ప్రస్తుతం పార్లమెంట్‌లో బీజేపీ తర్వాత కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా ఉంది. కాంగ్రెస్ ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది.

    వివరాలు 

    పలు పేర్లను ప్రతిపాదించిన తృణమూల్ కాంగ్రెస్

    అయితే,జమిలి ఎన్నికల బిల్లును పరిశీలించేందుకు కాంగ్రెస్ నుండి ప్రియాంకాగాంధీ,మనీష్ తివారీ, రణదీప్ సుర్జేవాలా,సుఖ్‌దేయో భగత్ సింగ్ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.

    అలాగే,ఇండియా కూటమిలో భాగమైన తృణమూల్ కాంగ్రెస్ కూడా పలు పేర్లను ప్రతిపాదించింది.

    టీఎంసీ నుండి సాకేత్ గోఖలే,కల్యాణ్ బెనర్జీ పేర్లను ప్రతిపాదించినట్లు సమాచారం.ఫైనల్‌గా, కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ప్రియాంక గాంధీ

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    ప్రియాంక గాంధీ

    మోదీ జీ, మీ మాట కోసమే న్యాయం వేచి చేస్తోంది: ప్రియాంక గాంధీ  నరేంద్ర మోదీ
    మే 8న హైదరాబాద్‌కు రానున్న ప్రియాంక గాంధీ  కాంగ్రెస్
    నేడు హైదరాబాద్‌కు ప్రియాంక గాంధీ రాక: అమె 'పొలిటికల్ టూరిస్ట్' అంటూ కేటీఆర్ ఫైర్ హైదరాబాద్
    కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరు? ఇంకా వీడని ఉత్కంఠ  కర్ణాటక
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025