NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు
    తదుపరి వార్తా కథనం
    Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు
    సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లుhttps://www.eenadu.net/telugu-news/ap-top-news/around-29-percent-of-coastline-eroded-in-andhra-pradesh/2501/124155976

    Sea erosion: సముద్రకోతతో సమస్యలు.. శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికి సవాళ్లు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Aug 24, 2024
    05:28 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఏపీ రాష్ట్రానికి విస్తారమైన తీరప్రాంతముంది. ఇక అదే స్థాయిలో సముద్రకోత సమస్య ఉండడం కలవరం పెడుతోంది.

    ఈ కోత వల్ల శ్రీహరికోట అంతరిక్ష కేంద్రానికీ సవాళ్లు ఎదురవుతున్నాయి.

    ముఖ్యంగా విశాఖ వద్దనున్న ఆర్కే బీచ్, కృష్ణ, గోదావరి డెల్టా ప్రాంతాలతో పాటు అనేకచోట్ల తీరం కోసుకుపోవడం కలవరపాటుకు గురి చేస్తోంది.

    కొన్ని చోట్ల నివాసాలు కూడా సముద్రాల్లో కలిసిపోతున్నాయి.

    మరికొన్ని చోట్ల బీచ్‌లు కనుమరుగు అవుతున్నాయి వాతావరణ మార్పుల వల్ల సముద్ర కోత పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

    Details

    తీరప్రాంతంలో 29శాతం కోతకు గురవుతోంది

    ఉమ్మడి జిల్లాల్లో తీరాన్ని ఆనుకుని ఉన్న 226 గ్రామాల్లో 29.85 లక్షల మంది ప్రజలు నివసిస్తున్నారు.

    రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 48 చోట్ల తీరం కోత తీవ్రంగా ఉందని తీరప్రాంత జాతీయ పరిశోధన కేంద్రం వెల్లడించింది.

    శ్రీహరి కోట, గోదావరి, కృష్ణ నదులు సముద్రంలో కలిసే చోట, కోరింగ అభయారణ్యం, ఉప్పాడ వద్ద కోత తీవ్రత ఎక్కువ ఉందని పరిశోధకులు పేర్కొన్నారు.

    రాష్ట్రంలోని మొత్తం తీరప్రాంతంలో 29శాతం కోతకు గురవుతున్నట్లు అధికార లెక్కలు చెబుతున్నాయి.

    మూడు మీటర్లకు మంచి సముద్రకోత ఉంటే తీవ్రవ ఎక్కువగా ఉన్నట్లు అంచనా వేశారు.

    Details

    కోత నివారణకు ప్రత్యేక నిధులు

    జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ కోత నివారణ కోసం ప్రత్యేక ప్రాజెక్టు చేపట్టనుంది.

    ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌కు కనీసం రూ.200 కోట్ల నుంచి రూ.800 కోట్ల వరకు కేంద్రం నుంచి నిధులు లభించనున్నాయి.

    ఈ వ్యవహారంపై తొలి సమావేశాన్ని జులైలో దిల్లీలో నిర్వహించారు. ఈ నెలాఖరుకల్లా ముసాయిదా ప్రాజెక్టు నివేదికలు కూడా సిద్ధం కానున్నాయి.

    ప్రాజెక్టు వ్యయంలో 90శాతం కేంద్రం ఇవ్వనుండగా, మరో 10శాతం రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ఖర్చు చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    శ్రీహరికోట
    ఆంధ్రప్రదేశ్

    తాజా

    IPL 2025: ఐపీఎల్‌లో నేడు ఆర్సీబీ వర్సెస్ ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్..  ఐపీఎల్
    Pakistan: పాకిస్థాన్‌కు గూఢచర్యం ఆరోపణలు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన యుపి ఎటిఎస్  ఉత్తర్‌ప్రదేశ్
    War 2: హృతిక్, ఎన్టీఆర్‌ 'వార్‌ 2'.. దర్శకుడు అయాన్ ముఖర్జీ మొదటి పోస్ట్.. ప్రేక్షకుల్లో పెరుగుతున్న ఆసక్తి  జూనియర్ ఎన్టీఆర్
    Supreme Court: పోక్సో కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. దోషిగా తేలిన వ్యక్తికి అరుదైన తీర్పు.. సుప్రీంకోర్టు

    శ్రీహరికోట

    PSLV-C56: ఇస్రో మరో ఘనత; పీఎస్ఎల్‌వీ-సీ56 ప్రయోగం విజయవంతం  ఇస్రో
    Aditya L-1:ఇస్రో మరో చారిత్రక ప్రయోగం; సూర్యూడిపై అధ్యయనానికి 'ఆదిత్య ఎల్1' మిషన్  ఇస్రో
    40రోజుల చంద్రయాన్-3 ప్రయాణం 60సెకన్ల వీడియోలో.. మీరూ చూసేయండి!    చంద్రయాన్-3
    Chandrayaan-3 Timeline: చంద్రయాన్‌-3 మిషన్‌లో కీలక ఘట్టాలు ఇవే  చంద్రయాన్-3

    ఆంధ్రప్రదేశ్

    Andhrapradesh: చంద్రబాబు నాయుడును ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన ఆంధ్రప్రదేశ్ గవర్నర్  గవర్నర్
    AP Cabinet : ఆంధ్రప్రదేశ్ మంత్రులు ఖరారు.. జాబితా ఇదే  భారతదేశం
    Ap,Odisha oath ceremonies: ఎపి,ఒడిశా తమ కొత్త ముఖ్యమంత్రుల ప్రమాణ స్వీకారం నేడే.. హాజరు కానున్న మోడీ, అమిత్ షా ఒడిశా
    NTR Bharosa: పెన్షన్ స్కీమ్ పేరును ఎన్టీఆర్ భరోసాగా మార్చిన ఏపీ ప్రభుత్వం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025