NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu

    భారతదేశం బిజినెస్ అంతర్జాతీయం క్రీడలు టెక్నాలజీ సినిమా ఆటోమొబైల్స్ లైఫ్-స్టైల్ కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
     
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 
    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 
    భారతదేశం

    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 

    వ్రాసిన వారు Naveen Stalin
    April 18, 2023 | 06:04 pm 0 నిమి చదవండి
    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా 
    స్వలింగ వివాహ పిటిషన్లపై సుదీర్ఘంగా సాగిన విచారణ; రేపటికి వాయిదా

    స్వలింగ సంపర్కులకు పెళ్లి చేసుకునే హక్కు ఉందని సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ స్పష్టం చేశారు. వారిని ఒటరిగా వదిలేస్తే సరిపోదన్నారు. కానీ వారికి అవసరమైన సామాజిక సంస్థల నిర్మాణం చాలా అనివార్యమని నొక్కి చెప్పారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్‌, జస్టిస్‌లు ఎస్‌కే కౌల్‌, రవీంద్ర భట్‌, హిమా కోహ్లీ, పీఎస్‌ నరసింహతో రాజ్యాంగ ధర్మాసనం స్వలింగ వివాహానికి చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది రోహత్గీ కీలక వాదనలను వినిపించారు. స్వలింగ సంపర్కులను ఇంట్లోనే ఉండండి, బయటకు రావద్దు అంటున్నారని, తమ హక్కుల కోసం కోర్టును ఆశ్రయించే నైతికత వారికి ఉందన్నారు.

    చిన్న వర్గమే అనుకోవద్దు: న్యాయవాది రోహత్గీ 

    స్వలింగ సంపర్కుల హక్కులను పార్లమెంట్ మంజూరు చేసే వరకు వేచి ఉండే బదులు, కోర్టును ఆశ్రయించే హక్కు వారికి ఉందని న్యాయవాది రోహత్గీ చెప్పారు. స్వలింగ సంపర్కులు పదివేల మంది మాత్రమే ఉండొచ్చని, వారిని చిన్న వర్గంగా అనుకోవద్దని రోహత్గీ సూచించారు. వారి పట్ల వివక్ష చూపకూడదన్నారు. వివాహం చేసుకోవడానికి స్వలింగ సంపర్కులకు ప్రాథమిక హక్కు ఉందని న్యాయవాది రోహత్గీ చెప్పారు. పెళ్లి తంతును సమానంగా గుర్తించాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన ఎస్‌జీ మెహతా, ఈ అంశాన్ని పార్లమెంటును పరిశీలించనివ్వండని కోర్టును కోరారు. అనంతరం స్పందించిన సీజేఐ చంద్రచూడ్, తాము పార్లమెంటరీ కమిటీలతో విస్తృతంగా చర్చించినట్లు పేర్కొన్నారు.

    గే వివాహాలపై విచారణను వ్యతిరేకించిన కేంద్ర ప్రభుత్వం

    గే వివాహాలకు చట్టపరమైన అనుమతికి వ్యతిరేకంగా కేంద్రం అఫిడవిట్‌ను దాఖలు చేసింది. స్వలింగ వివాహాన్ని కేవలం పట్టణ వర్గాలు అభిప్రాయంగా కేంద్రం పేర్కొంది. కొత్త సామాజిక సంబంధాన్ని ఏర్పరచుకోవడంపై నిర్ణయం తీసుకునే ఏకైక వేదిక పార్లమెంటు అని పిటిషన్ల విచారణపై అభ్యంతరం వ్యక్తం చేసింది. విచారించే ఐదుగురు న్యాయమూర్తులు దేశ ప్రజలు అభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించరనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కేంద్రం తరపున వాదించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా రాజ్యాంగ ధర్మాసనానికి తెలిపారు. కొత్త హక్కులను సృష్టించడం, సంబంధాలను గుర్తించడం, అలాంటి సంబంధాలకు చట్టబద్ధమైన పవిత్రతను కల్పించడం చట్టసభల ద్వారానే సాధ్యమవుతుందని, న్యాయవ్యవస్థ ద్వారా కాదని కేంద్రం ధర్మాసనానికి సూచించింది.

    ఈ టైమ్ లైన్ ని షేర్ చేయండి
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    సుప్రీంకోర్టు
    డివై చంద్రచూడ్
    తాజా వార్తలు
    ఇండియా లేటెస్ట్ న్యూస్
    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    సుప్రీంకోర్టు

    గ్యాంగ్‌స్టర్ అతిక్ సోదరుల హత్యపై ఈనెల 24న సుప్రీంకోర్టులో విచారణ  సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి
    రుతుక్రమ సమస్యలపై పోరాటం: సూల్ విద్యార్థులకు శానిటరీ ప్యాడ్స్ అందించాలన్న సుప్రీంకోర్టు  లైఫ్-స్టైల్
    'నా అధికారాలతో చెలగాటాలొద్దు'; న్యాయవాదిపై సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అసహనం డివై చంద్రచూడ్
    ప్రతిపక్షాలకు ఎదురదెబ్బ; ఈడీ, సీబీఐపై దాఖలు చేసిన పిటిషన్‌ స్వీకరణకు సుప్రీంకోర్టు నిరాకరణ కాంగ్రెస్

    డివై చంద్రచూడ్

    బిల్కిస్ బానో కేసు విచారణకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    ఉరిశిక్ష అమలుపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు; తక్కువ బాధతో మరణశిక్ష అమలు ఎలా? కేంద్రానికి సూచనలు సుప్రీంకోర్టు
    'దేశ ప్రజలకే వదిలేయండి'; స్వలింగ వివాహంపై కిరణ్ రిజిజు ఆసక్తికర కామెంట్స్ కిరెణ్ రిజిజు
    స్వలింగ సంపర్కుల వివాహం: పిటిషన్లను రాజ్యాంగ ధర్మాసనానికి బదిలీ చేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు

    తాజా వార్తలు

    వైఎస్ అవినాష్ రెడ్డికి ఊరట; ఏప్రిల్ 25వరకు అరెస్ట్ చేయొద్దని హైకోర్టు ఆదేశం  ఆంధ్రప్రదేశ్
    'అవి పుకార్లు మాత్రమే, నిజం కాదు'; బీజేపీలో చేరికపై క్లారిటీ ఇచ్చిన ఎన్‌సీపీ నేత అజిత్ పవార్ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ/ఎన్సీపీ
    వివేకా హత్యకు కుట్ర పన్నిన విషయం అవినాష్ రెడ్డికి ముందే తెలుసు: సీబీఐ వైఎస్సార్ కడప
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్

    ఇండియా లేటెస్ట్ న్యూస్

    భారత్‌లో మొట్టమొదటి ఆపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్ కుక్; కస్టమర్లకు స్వాగతం  ముంబై
    భగ్గుమంటున్న భానుడు; మరో మూడు రోజులు వేడిగాలులకు అల్లాడాల్సిందే  ఉష్ణోగ్రతలు
    దిల్లీలో టీఎంసీ నేత ముకుల్ రాయ్ ప్రత్యక్షం; మిస్సింగ్‌పై వీడిన ఉత్కంఠ పశ్చిమ బెంగాల్
    హర్యానా: రైస్‌మిల్లు కుప్పకూలి నలుగురు మృతి; 20మందికి గాయాలు హర్యానా

    సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

    నేడు మళ్లీ ఈడీ విచారణకు హాజరు కానున్న ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    హిండెన్‌బర్గ్ వివాదంపై సుప్రీంకోర్టు ఆదేశాన్ని స్వాగతించిన గౌతమ్ అదానీ అదానీ గ్రూప్
    ఎన్నికల కమిషనర్ల నియామకంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు; ప్యానెల్ ఏర్పాటు సుప్రీంకోర్టు
    'హిందుత్వం అంటే జీవన విధానం'; చారిత్రక స్థలాల పేర్లను మార్చాలని దాఖలైన పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    తదుపరి వార్తా కథనం

    భారతదేశం వార్తలను ఇష్టపడుతున్నారా?

    అప్ డేట్ గా ఉండటానికి సబ్ స్క్రయిబ్ చేయండి.

    India Thumbnail
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2023