
PVN Madhav: ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా పీవీఎన్ మాధవ్ పేరు ఖరారు
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అధ్యక్ష పదవి ఎట్టకేలకు తుది నిర్ణయానికి వచ్చింది. ఈ పదవికి పార్టీ కేంద్ర నాయకత్వం మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ పేరును ఖరారు చేసింది. ప్రస్తుతం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మాధవ్.. గతంలో శాసనమండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్గా పనిచేశారు. అంతేకాకుండా, ఆయనకు ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్) బీజేవైఎం (భారతీయ జనతా యువ మోర్చా)లో అనేక కీలక బాధ్యతలు ఉండేవి. పీవీఎన్ మాధవ్.. బీజేపీకి చెందిన వయోవృద్ధ నేత, స్వర్గీయ చలపతిరావు కుమారుడు. చలపతిరావు రెండు పర్యాయాలు ఎమ్మెల్సీగా సేవలందించారు. ఆయన రాజకీయ వారసత్వాన్ని మాధవ్ కొనసాగిస్తున్నట్టు భావించవచ్చు.
వివరాలు
జయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నిక
మాధవ్ అధ్యక్ష పదవికి తన నామినేషన్ను మధ్యాహ్నం 2 గంటల తర్వాత దాఖలు చేయనున్నారు. ఈ ఎన్నిక మంగళవారం విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరుగనుంది. ఈ ఎన్నికల ప్రక్రియకు కర్ణాటక నుంచి ఎంపీ మోహన్ పరిశీలకుడిగా వ్యవహరించనున్నారు.