మిస్టర్ మోదీ, మణిపూర్లో భారతదేశ ఆలోచనను పునర్నిర్మిస్తాం: రాహుల్ గాంధీ
మణిపూర్ హింసకు సంబంధించి పార్లమెంటులో ప్రధాని నరేంద్ర మోదీ సమాధానం ఇవ్వాలని ప్రతిపక్షాలు కూటమి 'ఇండియా'పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇండియా కూటమిని ఇస్ట్ ఇండియా, ఇండియన్ ముజాహిదీన్తో పోల్చారు. అయితే ప్రధాని మోదీ చేసిన కామంట్స్పై రాహుల్ గాంధీ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'మిస్టర్ మోదీ, మీరు మమ్మల్ని ఎలా కావాలంటే అలా పిలుచుకోండి. మేము భారతీయులం. మేం మణిపూర్ను బాగు చేయడానికి, ప్రతి స్త్రీ, పిల్లల కన్నీళ్లు తుడవడానికి సహాయం చేస్తాం. మేము మణిపూర్ ప్రజలందరికీ ప్రేమ, శాంతిని తిరిగి తీసుకొస్తాము. మణిపూర్లో భారతదేశం ఆలోచనను పునర్నిర్మిస్తాం' అని రాహుల్ గాంధీ ట్విట్టర్లో రాసుకొచ్చారు. అంతేకాకుండా కావాలంటే తాము సాయం చేస్తామని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.
కాంగ్రెస్ ఎప్పుడూ 'మదర్ ఇండియా'తోనే ఉంది: ఖర్గే
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ప్రధాని మోదీ కామెంట్స్కు రిప్లే ఇచ్చారు. తాము మణిపూర్ గురించి మాట్లాడుతున్నామని, సభ బయట ప్రధాని 'ఇండియా' కూటమిని 'ఈస్టిండియా కంపెనీ' అని పిలవడంపై అభ్యంతరం వ్యక్తం చేసారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ 'మదర్ ఇండియా' అంటే 'భారత్ మాత'తోనే ఉందని, బ్రిటీష్ వారి బానిసలు బీజేపీ రాజకీయ వారసులేనని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన వాక్చాతుర్యంతో దేశం దృష్టిని మరల్చడాన్ని ఇకనైనా మానేయాలని అన్నారు. మణిపూర్ అంశంపై పార్లమెంట్ అట్టుడుతున్న నేపథ్యంలో ప్రధాని మోదీ బీజేపీ పార్లమెంటరీ పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేసారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ప్రతిపక్ష కూటమి 'ఇండియా' పేరు పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు.