NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kazipet: కాజీపేటలో రైల్వే ప్లాంట్‌.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగం
    తదుపరి వార్తా కథనం
    Kazipet: కాజీపేటలో రైల్వే ప్లాంట్‌.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగం
    కాజీపేటలో రైల్వే ప్లాంట్‌.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగం

    Kazipet: కాజీపేటలో రైల్వే ప్లాంట్‌.. ఆధునిక సాంకేతికతతో మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 12, 2024
    12:46 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    కాజీపేటలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటు జరుగుతోందని రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు.

    ఒకే విధమైన వస్తువుల తయారీలో నిమగ్నమయ్యే పాత పద్ధతులను విడిచిపెట్టి, అన్ని రకాల ఉత్పత్తులనూ ఒకే యూనిట్‌లో తయారుచేయగల విధానానికి మార్పు చేస్తున్నామన్నారు.

    కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్‌ ఏర్పాటు సాధ్యం కాదని మంత్రి రాజ్యసభలో తెలిపారు.

    అయితే అమృత్‌భారత్‌ స్టేషన్‌ పథకం కింద కాజీపేట రైల్వే స్టేషన్‌ను పునర్నిర్మిస్తున్నామని, దీంతోపాటు తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు.

    రైల్వే బడ్జెట్‌లో తెలంగాణకు రూ.5,336 కోట్లు కేటాయించామన్నారు.

    కాజీపేట, నష్కల్‌, హసన్‌పర్తి ప్రాంతాల్లో ప్రతిపాదిత బైపాస్‌ లైన్లపై ఎంపీ కడియం కావ్య పలు సమస్యలను ఉంచారు.

    Details

    రైల్వే లైన్‌ల కోసం మాస్టర్‌ప్లాన్‌

    బైపాస్‌ లైన్‌ వల్ల విలువైన భూములు, నివాస ప్రాంతాలపై ప్రభావం ఉంటుందన్నారు.

    దీనిపై మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ స్పందించారు. రైల్వే లైన్‌ల కోసం మాస్టర్‌ప్లాన్‌ రూపొందిస్తున్నామని, సభ్యురాలు సూచించిన అంశాలను పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు.

    తెలంగాణలోని ఇనుప ఖనిజాలను రాష్ట్ర ఖనిజ అభివృద్ధి సంస్థకు కేటాయించలేదని కిషన్‌ రెడ్డి తెలిపారు.

    మహబూబాబాద్, వరంగల్, కరీంనగర్, మంచిర్యాల వంటి జిల్లాల్లో ఇనుపఖనిజాలు ఉండే ప్రాంతాల్లో రాష్ట్ర ప్రభుత్వం గనుల అభివృద్ధికి తగిన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు.

    తెలంగాణ రాష్ట్రం బొగ్గు గనుల్లో అత్యధిక ప్రమాదాలు నమోదైన రాష్ట్రంగా కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.

    ఐదేళ్లలో దేశంలోని 11 రాష్ట్రాల్లో 794 ప్రమాదాలు చోటుచేసుకోగా, వాటిలో 65.11% తెలంగాణలోనే జరిగినట్లు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాజీపేట
    కిషన్ రెడ్డి

    తాజా

    SRH vs LSH: సన్ రైజర్స్ చేతిలో ఓటమి.. ఫ్లే ఆఫ్స్ రేసు నుంచి లక్నో నిష్క్రమణ సన్ రైజర్స్ హైదరాబాద్
    Harshal Patel: లెజెండరీ బౌలర్లను వెనక్కి నెట్టిన హర్షల్ పటేల్.. ఐపీఎల్‌లో తొలి బౌలర్‌గా రికార్డు ఐపీఎల్
    Honda Rebel 500: హోండా రెబెల్ 500 బైక్ భారత్‌లో విడుదల.. ప్రారంభ ధర రూ. 5.12 లక్షలు ఆటో మొబైల్
    BCCI: ఆసియా టోర్నీల బహిష్కరణ.. క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ బీసీసీఐ

    కాజీపేట

    Kazipet railway station: కాజీపేట రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం అగ్నిప్రమాదం
    US : అమెరికా జెట్ స్కీ ప్రమాదంలో కాజీపేట విద్యార్థి మృతి  అమెరికా
    KUDA: వరంగల్ అభివృద్ధికి కొత్త దశ.. 'కూడా' ప్రణాళికకు గ్రీన్ సిగ్నల్ జనగామ

    కిషన్ రెడ్డి

    హైదరాబాద్‌కు చేరుకున్న రాష్ట్రపతి ముర్ము; సీఎం కేసీఆర్, గవర్నర్ ఘన స్వాగతం  ద్రౌపది ముర్ము
    తెలుగు రాష్ట్రాలకు కొత్త అధ్యక్షులను నియమించిన బీజేపీ; తెలంగాణకు కిషన్ రెడ్డి, ఏపీకి పురందేశ్వరీ బీజేపీ
    కేంద్రమంత్రి పదవిపై దిల్లీ పెద్దల మాటకు కట్టుబడి ఉంటా : కిషన్ రెడ్డి వరంగల్ తూర్పు
    KISHAN REDDY: బాటసింగారం వెళ్తుండగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు  తెలంగాణ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025