NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Maha Kumbhmela: కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్‌ వందే భారత్‌ రైలు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Maha Kumbhmela: కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్‌ వందే భారత్‌ రైలు
    కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్‌ వందే భారత్‌ రైలు

    Maha Kumbhmela: కుంభమేళాకు నేటి నుంచి అందుబాటులోకి స్పెషల్‌ వందే భారత్‌ రైలు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 15, 2025
    02:40 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు భక్తులకు శుభవార్త.

    ప్రస్తుతం ట్రాఫిక్‌, ఇతర సమస్యల వల్ల ఇబ్బంది పడుతున్న భక్తులను దృష్టిలో ఉంచుకొని, వారి ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు నార్తర్న్ రైల్వేస్‌ ప్రత్యేక వందే భారత్‌ రైలును నడపనుంది.

    ఈ ప్రత్యేక రైలు ఫిబ్రవరి 15, 16, 17 తేదీల్లో ప్రయాణికుల సేవలో ఉండనుంది. ఢిల్లీ నుంచి ప్రయాగ్‌రాజ్‌ మీదుగా వారణాసి వరకు ఈ రైలు ప్రయాణించనుంది.

    వివరాలు 

    వందే భారత్‌ రైలు ప్రయాణ సమయాలు: 

    ప్రత్యేక వందే భారత్‌ రైలు (02252) న్యూ ఢిల్లీ నుండి ఉదయం 5:30 గంటలకు బయల్దేరి, మధ్యాహ్నం 12:00 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది.

    అక్కడి నుంచి మధ్యాహ్నం 2:20 గంటలకు వారణాసి చేరుకుంటుంది.

    తిరుగు ప్రయాణంలో 02251 నంబర్‌ వందే భారత్‌ రైలు వారణాసి నుంచి మధ్యాహ్నం 3:15 గంటలకు బయల్దేరి, సాయంత్రం 5:20 గంటలకు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకుంటుంది.

    రాత్రి 11:50 గంటలకు ఢిల్లీ స్టేషన్‌కు చేరుకుంటుంది.

    ఈ రైలు ప్రారంభానికి సంబంధించి, నార్తర్న్ రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ హిమాన్షు శేఖర్ ఉపాధ్యాయ ఒక ప్రకటనలో తెలిపారు.

    మహా కుంభమేళా కారణంగా వారాంతాల్లో భక్తుల రద్దీ పెరుగుతుందని భావించి ఈ ప్రత్యేక రైలు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు.

    వివరాలు 

    భక్తుల రద్దీ, ట్రాఫిక్ పరిస్థితి

    మహా కుంభమేళాకు దేశం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తున్నారు.

    దీనివల్ల రైల్వే స్టేషన్లు యాత్రికులతో కిక్కిరిసిపోతున్నాయి. రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్న భక్తుల సంఖ్య పెరిగిపోవడంతో ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లే ప్రధాన రహదారులపై భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

    గత వారాంతంలో 300 కిలోమీటర్ల మేర వాహనాల రద్దీ ఏర్పడినట్లు రిపోర్టులు వెల్లడించాయి.

    వివరాలు 

    మహా కుంభమేళా విశేషాలు: 

    మహా కుంభమేళా గత నెల జనవరి 13న ప్రారంభమై, ఫిబ్రవరి 26న మహాశివరాత్రి సందర్భంగా ముగియనుంది.

    45 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక ఉత్సవానికి లక్షలాదిమంది భక్తులు హాజరవుతున్నారు.

    గంగ, యమున, సరస్వతి నదులు కలిసే త్రివేణీ సంగమంలో పుణ్యస్నానం చేసి భక్తులు తమ ఆధ్యాత్మికతను తాకి ఆనందిస్తున్నారు.

    ఫిబ్రవరి 14 వరకు దాదాపు 50 కోట్ల మంది భక్తులు నదీ స్నానం చేసినట్లు ఉత్తరప్రదేశ్ అధికారులు వెల్లడించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రైల్వే బోర్డు

    తాజా

    2025 Suzuki V-Strom 800DE: భారత్ లో విడుదలైన 2025 సుజుకి V-స్ట్రోమ్ 800DE.. రూ.10,30,000 ఎక్స్-షోరూమ్ ధర ఆటో మొబైల్
    Elon Musk: కొత్త పార్టీ పెట్టేందుకు ఎలాన్ మస్క్ సంచలన నిర్ణయం.. మస్క్ పెట్టిన పోల్‌కు భారీ రెస్పాన్స్..  ఎలాన్ మస్క్
    Chenab bridge: ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే బ్రిడ్జ్ చినాబ్ వంతెన ప్రారంభించిన ప్రధాని మోదీ ..  నరేంద్ర మోదీ
    Home loan: గృహ రుణాలదారులకు ఊరట.. వడ్డీ రేట్లు తగ్గించిన ఆర్‌బీఐ  ఆర్ బి ఐ

    రైల్వే బోర్డు

    రైల్వే బోర్డు తొలి మహిళా సీఈఓగా జయవర్మ సిన్హా  జయవర్మ సిన్హా
    రైల్వే ఉద్యోగులకు కేంద్రం గుడ్​ న్యూస్​.. ఎంత శాతం డీఏ పెరిగిందో తెలుసా రైల్వే స్టేషన్
    IRCTC Site-App Down: IRCTC డౌన్.. యాప్, వెబ్‌సైట్‌ను ఉపయోగించడంలో ఇబ్బంది  టెక్నాలజీ
    Special Trians: తెలుగు రాష్ట్రాలకు రైల్వే గుడ్ న్యూస్.. వీకెండ్ లో ఈ నగరాల మధ్య 8 స్పెషల్ ట్రైన్స్  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025