NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక 
    తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక

    Rain Alert: తెలంగాణలో నాలుగు రోజులు వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరిక 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 01, 2025
    10:14 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ ప్రకటించింది.

    మధ్యప్రదేశ్, విదర్భ, మరాఠ్వాడా, అంతర్గత కర్ణాటక,కేరళ ప్రాంతాలపై ద్రోణి ఏర్పడిందని, దీని ప్రభావంతో రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయని పేర్కొంది.

    గాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని కూడా వివరించింది.

    హైదరాబాద్ మహానగరంలో ఈ నాలుగు రోజులు మబ్బులు కమ్మిన వాతావరణం కొనసాగుతుందని, మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది.

    ఉత్తర తెలంగాణ జిల్లాలను తప్పితే మిగతా ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు కొంత మేర తగ్గే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది.

    వివరాలు 

    ఈ జిల్లాలకు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ

    వర్షపాతం,వాతావరణ మార్పుల నేపథ్యంలో రాష్ట్రంలోని అనేక జిల్లాలకు వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరిక జారీ చేసింది.

    ఈ జాబితాలో మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగుళాంబ గద్వాల జిల్లాలు ఉన్నాయి.

    ఈ జిల్లాల్లో వచ్చే నాలుగు రోజులపాటు మోస్తరు వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

    వివరాలు 

    రుద్రంగి ప్రాంతంలో అత్యధిక వర్షపాతం

    బుధవారం రోజున రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగి ప్రాంతంలో నమోదయ్యింది.

    అక్కడ 5.1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు తెలిపింది. మరోవైపు, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తీవ్ర వేడి పరిస్థితులు కొనసాగుతున్నట్టు తెలిపింది.

    బుధవారం రోజున జగిత్యాల, అదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్ జిల్లాల్లోని పలుచోట్ల 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని పేర్కొంది.

    అలాగే వచ్చే నాలుగు రోజులపాటు రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో 44 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్
    Manchu Vishnu: 'కన్నప్ప' విషయంలో చేసిన పెద్ద పోరపాటు అదే : మంచు విష్ణు కన్నప్ప
    Man Arrested For Spying Pak : భారత రహస్య సమాచారం పాక్‌కు లీక్‌.. గుజరాత్‌లో వ్యక్తి అరెస్ట్‌ గుజరాత్

    తెలంగాణ

    Poisoning at school: పాఠశాలలో విషప్రయోగం కలకలం.. తాగు నీటిలో పురుగుల మందు  ఆదిలాబాద్
    Palem: సూర్యగ్రహణాన్ని వీక్షించడానికి 40 దేశాల నుండి శాస్త్రవేత్తలు తెలంగాణలోని ఈ గ్రామానికి ఎందుకు వచ్చారో తెలుసా? టెక్నాలజీ
    Telangana: తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పుప్పాలగూడలో 450 ఎకరాల్లో ఐటీ నాలెడ్జ్ హబ్‌ ఏర్పాటు భారతదేశం
    CM Revanthreddy: హైదరాబాద్‌లో ఏఐ డేటా సెంటర్‌ క్లస్టర్‌.. ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వంతో ఒప్పందాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025