NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. నేను వదిలిపెట్టాలనుకున్నా కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు
    తదుపరి వార్తా కథనం
    సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. నేను వదిలిపెట్టాలనుకున్నా కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు
    సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు

    సీఎం పదవిపై అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు.. నేను వదిలిపెట్టాలనుకున్నా కానీ అది నన్ను విడిచిపెట్టట్లేదు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Oct 19, 2023
    04:41 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ముఖ్యమంత్రి పీఠంపై రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు.సీఎం పోస్టును వదులుకోవాలని అనుకుంటున్నానని, అదే తనను విడిచిపెట్టట్లేదన్నారు.

    ఈ మేరకు పార్టీలోని తన ప్రధాన ప్రత్యర్థి సచిన్ పైలట్‌ని ఉద్దేశించి గెహ్లాట్ ఈ వ్యాఖ్యలు చేశారని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

    ఈసారి కూడా తానే సీఎం కావాలని కోరుకుంటున్నట్లు ఒక మహిళా మద్దతుదారు తనతో చెప్పిన విషయాన్ని గురువారం దిల్లీలో అశోక్ గెహ్లాట్ ప్రస్తావించారు.

    అందుకు తాను సీఎం పదవిని వదిలేయాలని అనుకుంటున్నానని, కానీ అదే తనను వదిలిపెట్టట్లేదని బదులిచ్చినట్లు చెప్పుకొచ్చారు.

    అయితే ఇప్పటికే మూడు సార్లు అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. ఈసారి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక, మరోసారి బాధ్యతలు చేపడితే మొత్తం నాలుగుసార్లు అవుతుంది.

    details

    అందుకే హైకమాండ్ తననే సీఎంగా మూడుసార్లు ఎంపిక చేసింది : అశోక్ గెహ్లాట్

    గతంలో సీఎం గెహ్లాట్, మాజీ డిప్యూటీ సీఎం పైలట్ మధ్య క్యాంపు రాజకీయాల నేపథ్యంలో విభేదాలు తలెత్తాయి.

    2020లో గెహ్లాట్ సర్కారుకు వ్యతిరేకంగా పైలట్ తన వర్గంతో కలిసి తిరుగుబాటు చేసిన క్రమంలో దాదాపుగా ప్రభుత్వం కుప్పకూలింది.

    అయితే గెహ్లాట్ లో ఏదో విశేషం ఉందని, అందుకే హైకమాండ్ తననే సీఎంగా మూడుసార్లు ఎంపిక చేసిందన్నారు. అధిష్టానం తీసుకునే నిర్ణయం ఏదైనా ఆమోదయోగ్యంగానే ఉంటుందన్నారు.

    కాంగ్రెస్ జాబితా విడుదలలో జాప్యం జరిగిందన్న ప్రశ్నపై స్పందించిన గెహ్లాట్, దీనిపై బీజేపీ చింతిస్తోందన్నారు.

    తాము పోట్లాడటం లేదని వాపోతున్నారని పంచులేశారు. పైలట్ వర్గంతో మాట్లాడి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.

    ఈసారి బీజేపీ, కాంగ్రెస్ మధ్య హోరాహోరీతో అధికారంలోకి ఎవరు వస్తారోనన్న ఆసక్తి పెరిగింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    అశోక్ గెహ్లాట్
    రాజస్థాన్

    తాజా

    PSL : ఉద్రిక్తతల ఎఫెక్టు.. పాక్ సూపర్ లీగ్‌ మ్యాచ్‌లు యూఏఈకి షిఫ్ట్ పాకిస్థాన్
    India-Pakistan Tension: భారత్, పాక్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. 24 ఎయిర్‌పోర్టుల క్లోజ్‌ ఆపరేషన్‌ సిందూర్‌
    Stock Market:భారత్-పాక్ ఉద్రిక్తతలు.. కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు స్టాక్ మార్కెట్
    Andhra Pradesh: క్రీడా రంగానికి బూస్ట్.. ఆంధ్రప్రదేశ్‌లో అతి పెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ ఆంధ్రప్రదేశ్

    అశోక్ గెహ్లాట్

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో వర్గపోరు; అధిష్టానం హెచ్చరికను లెక్కచేయకుండా సచిన్ పైలెట్ నిరాహార దీక్ష  కాంగ్రెస్
    సచిన్ పైలెట్ 'జన్ సంఘర్ష్ యాత్ర'; అశోక్ గెహ్లాట్‌పై మరోసారి ఫైర్ రాజస్థాన్
    నీతి ఆయోగ్ సమావేశానికి 8మంది ముఖ్యమంత్రులు గైర్హాజరు; ఎందుకో తెలుసా? దిల్లీ
    రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో స్నేహగీతం; అశోక్ గెహ్లాట్, సచిన్ పైలట్‌ మధ్య శాంతి ఒప్పందం  రాజస్థాన్

    రాజస్థాన్

    ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు  దిల్లీ
    Rajasthan: పోలీసుల కళ్లల్లో కారం చల్లి, గ్యాంగ్‌స్టర్‌ను కాల్చి చంపిన ప్రత్యర్థులు  హత్య
    జోధ్‌పూర్‌లో దారుణం; ప్రియుడి ఎదుటే దళిత బాలికపై సామూహిక అత్యాచారం  జోధ్‌పూర్
    Rajasthan Crime: ప్రియురాలి భర్తను దారుణంగా హత్య చేసి, 6 ముక్కలుగా నరికి పాతిపెట్టేశాడు  హత్య
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025