NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ 
    తదుపరి వార్తా కథనం
    Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ 
    Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. భద్రత కట్టుదిట్టం

    Rajasthan election: రాజస్థాన్‌లో కొనసాగుతున్న పోలింగ్.. కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ 

    వ్రాసిన వారు Stalin
    Nov 25, 2023
    08:56 am

    ఈ వార్తాకథనం ఏంటి

    రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ జరుగుతోంది. శనివారం ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

    రాష్ట్రంలో 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా 199 స్థానాలకు ఈసీ పోలింగ్ నిర్వహిస్తోంది. కరణ్‌పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి గుర్మీత్‌సింగ్‌ కున్నార్‌ మరణంతో ఆ స్థానంలో పోలింగ్‌ను ఈసీ వాయిదా వేసింది.

    రాజస్థాన్‌లో ఓటర్ల సంఖ్య 5,25,38,105 ఓటర్లు ఉండగా.. వివిధ పార్టీల నుంచి 1862 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.

    ప్రస్తుతం రాష్ట్ర అసెంబ్లీలో 107 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, బీజేపీ నుంచి 70 మంది, ఆర్‌ఎల్‌పీ నుంచి ముగ్గురు, సీపీఎం నుంచి ఇద్దరితో మిగతా వారు బీటీపీ, రాష్ట్రీయ లోక్‌దళ్, స్వతంత్రులు ఉన్నారు.

    రాజస్థాన్

    రాష్ట్రంలో 51,507 పోలింగ్‌ కేంద్రాలు

    పోలింగ్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

    రాష్ట్రంలోని 36,101చోట్ల మొత్తం 51,507పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ప్రధాన ఎన్నికల అధికారి ప్రవీణ్‌ గుప్తా తెలిపారు.

    వీటిలో పట్టణ ప్రాంతాల్లో 10,501, గ్రామీణ ప్రాంతాల్లో 41,006పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 26,393పోలింగ్ కేంద్రాల్లో లైవ్ వెబ్‌కాస్టింగ్ చేయనున్నట్లు తెలిపారు.

    ఈ పోలింగ్ కేంద్రాలను జిల్లా స్థాయి కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షిస్తారు.

    ఓటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూసేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేశారు.

    70వేల మందికి పైగా రాజస్థాన్ పోలీసులు, 18వేల మంది హోంగార్డులు, 2వేల మంది రాజస్థాన్ బోర్డర్ హోంగార్డులు, ఇతర రాష్ట్రాల పోలీసులతో సహా 1,70,000మందికి పైగా భద్రతా సిబ్బందిని మోహరించారు.

    ఎన్నికలు

    ఈసారి ఆ సంప్రదాయం కొనసాగుతుందా?

    రాజస్థాన్‌లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే ప్రధాన పోటీ నెలకొంది.

    1993లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇక్కడ ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే ఆనవాయితీ ఉంది.

    2018లో రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ సారి ఆ ఆనవాయితీ ప్రకారం తాము అధికారంలోకి వస్తుందని బీజేపీ భావిస్తోంది.

    అదే సమయంలో దాదాపు మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయం ఈ సారి బ్రేక్ అవుతుందని, తిరిగి తాము అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ చెబుతోంది.

    రాష్ట్రంలోని బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుండగా. కాంగ్రెస్ రాష్ట్రీయ లోక్‌దళ్ (RLD)తో పొత్తు పెట్టుకుంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ఓటేస్తున్న మాజీ సీఎం వసుంధర రాజే

    #WATCH | Rajasthan Elections | Former CM and BJP candidate from Jhalrapatan assembly constituency, Vasundhara Raje cast her vote at a polling booth in Jhalawar. pic.twitter.com/LzapJjKZsq

    — ANI (@ANI) November 25, 2023
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రాజస్థాన్
    పోలింగ్
    అసెంబ్లీ ఎన్నికలు
    తాజా వార్తలు

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    రాజస్థాన్

    రాజస్థాన్​లో విద్యార్థుల వరుస బలవన్మరణాలు.. కోటలో మరో విద్యార్థి ఆత్మహత్య భారతదేశం
    రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజేకు షాక్..బీజేపీ ఎన్నికల కమిటీల్లో దక్కని చోటు బీజేపీ
    చంద్రయాన్-3 వ్యోమగాములకు శుభాకాంక్షలు చెప్పిన రాజస్థాన్ మంత్రి.. ట్రోల్ చేస్తున్న నెటిజన్లు చంద్రయాన్-3
    రాజస్థాన్​లో ఘోరం.. చంద్రయాన్-3 విజయాన్ని ఆస్వాదిస్తున్న స్టూడెంట్స్‌పై కశ్మీరీ విద్యార్థుల దాడి యూనివర్సిటీ

    పోలింగ్

    అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో బీజేపీ ఆధిక్యం; మేఘాలయలో ఎన్‌పీపీ హవా అసెంబ్లీ ఎన్నికలు
    ఎన్నికల ఫలితాలు: నాగాలాండ్, త్రిపురలో కమల వికాసం; మేఘాలయలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన ఎన్‌పీపీ అసెంబ్లీ ఎన్నికలు
    అసెంబ్లీ ఎన్నికలు 2023: కర్ణాటక‌లో రేపే పోలింగ్; ముఖ్యాంశాలు ఇవే కర్ణాటక
    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు: కొనసాగుతున్న పోలింగ్; ఓటేసిన ప్రముఖులు కర్ణాటక

    అసెంబ్లీ ఎన్నికలు

    Telangana Congress:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. అభ్యర్థుల తొలి జాబితాను ప్రకటించిన కాంగ్రెస్  తెలంగాణ
    BRS manifesto: బీఆర్ఎస్ మేనిఫెస్టో ప్రకటన.. ప్రతి ఇంటికీ 'కేసీఆర్ బీమా'.. పెన్షన్, రైతు బంధు పెంపు తెలంగాణ
    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 87చోట్ల టీడీపీ పోటీ: కాసాని జ్ఞానేశ్వర్  తెలంగాణ
    Madhya Pradesh Congress Manifesto: ఉచిత విద్యుత్, రూ.25లక్షల ఆరోగ్య రక్షణ.. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో ఇదే  కాంగ్రెస్

    తాజా వార్తలు

    Virat Kohli Record: ప్రపంచ కప్‌ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా కోహ్లీ రికార్డు  విరాట్ కోహ్లీ
    Free Palestine: 'ఫ్రీ పాలస్తీనా' టీ-షర్ట్‌తో ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో వ్యక్తి హల్‌చల్ ప్రపంచ కప్
    AUS win World Cup: భారతీయుల ఆశలు ఆవిరి.. వరల్డ్ కప్ ఫైనల్‌లో టీమిండియా ఓటమి   టీమిండియా
    Uttarakhand: సొరంగంలో చిక్కుకున్న కార్మికులను రక్షించేందుకు 5 ఏజెన్సీల ఉమ్మడి ఆపరేషన్  ఉత్తరాఖండ్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025