NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajkot gaming zone: రాజ్ కోట్ అగ్ని ప్రమాదం,27 మంది మృత్యువాత
    తదుపరి వార్తా కథనం
    Rajkot gaming zone: రాజ్ కోట్ అగ్ని ప్రమాదం,27 మంది మృత్యువాత
    Rajkot gaming zone: రాజ్ కోట్ అగ్ని ప్రమాదం,27 మంది మృత్యువాత

    Rajkot gaming zone: రాజ్ కోట్ అగ్ని ప్రమాదం,27 మంది మృత్యువాత

    వ్రాసిన వారు Stalin
    May 26, 2024
    02:04 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    గుజరాత్ రాష్ట్రంలోని రాజ్ కోట్ లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. టీఆర్పీ గేమ్ జోన్ లో మంటలు చెలరేగాయి.

    ఈ ప్రమాదంలో 27 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో చిన్నారులు, మహిళలు ఉన్నారు. అగ్ని మాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నాయి.

    వారిని రక్షించేందుకు పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. మృత్యుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని సమాచారం.

    ఈ ఘటనపై గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    కాగా టీఆర్పీ గేమ్ జోన్ కు అగ్నిమాపక విభాగపు అనుమతి లేదు. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ (NOC)లేక పోవడం గమనార్హం.

    Details 

    బాధితులు బైటికి రావడానికి దారేది? 

    గేమ్ జోన్ లో అగ్ని ప్రమాదం జరగగానే బయటికి వద్దామన్నా ఒక్కటే దారి వుంది. అది కూడా ఏడు అడుగుల ఎత్తులో వుండటంతో బయటకు రాలేకపోయారు.

    గేమ్ జోన్ పరిధిలో జనరేటర్ల కోసం 3 వేల లీటర్ల డీజిల్ నిల్వ వుంచారు.రేస్ కార్ల కోసం ముందు జాగ్రత్తగా తెచ్చి వుంచారు.

    చేతులు కాలాక ఆకులు పట్టుకున్నారన్న చందంగా గుజరాత్ సర్కార్ తయారైంది.

    ఈ దుర్ఘటనపై ఐదుగురు సభ్యులతో కూడిన SITను ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.

    కాలి బూడిదైపోయిన శవాల డిఎన్ఎను సేకరించి బాధిత కుటుంబాలకు అందిస్తామన్నారు ఆ రాష్ట్ర హోంమంత్రి హరీష్ సంఘ్వీ .

    ఈ ఘటనతో మేల్కొన్న గుజరాత్ DGP ..టీఆర్పీ గేమ్ జోన్ లన్నింటిపై నిఘా వుంచాలని ఆదేశించారు.

    Details 

    27 మంది మృతి,నలుగురు పిల్లల గల్లంతు! 

    రాజ్‌కోట్ అగ్ని ప్రమాదంపై స్థానిక పోలీస్ కమిషనర్ రాజు భార్గవ మీడియాతో మాట్లాడారు.

    ప్రస్తుతానికి 27 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి పంపామన్నారు.

    ఈ గేమింగ్ జోన్ యువరాజ్ సింగ్ సోలంకి తో సహా మరో ఇద్దరిని అరెస్టు చేశామని వివరించారు.

    సాయంత్రం 4.30 గంటలకు ప్రమాదం గురించి కాల్ వచ్చిందన్నారు రాజ్‌కోట్ కలెక్టర్ ప్రభావ్ జోషి .. కాగా మృతుల కుటుంబాలకు రూ.4 లక్షల పరిహారం గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ ప్రకటించించారు.

    ఈ అగ్ని ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

    Details 

     ఘటనపై రాష్ట్రపతి దిగ్భ్రాంతి 

    ఈ ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.4 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం అందజేస్తామని సీఎం తెలిపారు.

    ఈ రాజ్‌కోట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటన అందరినీ బాధకు గురిచేసిందన్నారు.

    ఈ ప్రమాదానికి సంబంధించి ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్‌తో మాట్లాడి సమాచారం తెలుసుకున్నాను.

    ప్రభుత్వం అన్ని విధాలుగా సహాయం అంందిస్తుంది" అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు.

    ఈ విషాద సమయంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానన్నారు.

    గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని ట్వీట్ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    గుజరాత్

    తాజా

    ISRO: 18న ఇస్రో 101వ రాకెట్‌ ప్రయోగం: చైర్మన్ వి నారాయణన్ ఇస్రో
    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ

    గుజరాత్

    కోర్టు ధిక్కారానికి పాల్పడిన నలుగురు పోలీసులకు గుజరాత్ హైకోర్టు 14 రోజుల జైలు శిక్ష భారతదేశం
    గుజరాత్: గర్బా ఆడుతూ 24గంటల్లో గుండెపోటుతో 10మంది మృతి  గుండెపోటు
    Mass suicide in Gujarat: గుజరాత్‌లో ఘోరం.. ఒకే కుటంబంలో ఏడుగురు ఆత్మహత్య ఆత్మహత్య
    Misappropriation of funds: గుజరాత్ పోలీసులకు సహకరించాలని తీస్తా సెతల్వాద్‌,ఆనంద్ ను ఆదేశించిన సుప్రీంకోర్టు   భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025