NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు! 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు! 
    రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు!

    Adilabad Airport : రాజ్‌నాథ్ సింగ్ కీలక నిర్ణయం.. ఆదిలాబాద్ విమానాశ్రయం పనులు ముందుకు! 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 05, 2025
    02:42 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న ఆదిలాబాద్ విమానాశ్రయ స్థాపనకు గ్రీన్‌సిగ్నల్ లభించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తాజా లేఖలో పౌరవిమానయాన సేవలు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడించారు.

    ప్రస్తుతం రక్షణశాఖ ఆధీనంలో ఉన్న ఆదిలాబాద్ వైమానిక విమానాశ్రయంలో త్వరలో పౌర విమానాలు ల్యాండయ్యే అవకాశం ఉంది.

    అంతేకాకుండా వాయుసేన శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కూడా రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.

    ఈ మేరకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గత జనవరిలో (2025 జనవరి 29న) రక్షణ మంత్రికి లేఖ రాశారు. ప్రజావసరాల కోసం విమానాశ్రయ భూమిని వినియోగించాలని కోరారు.

    ఆ లేఖపై స్పందించిన రాజ్‌నాథ్ సింగ్.. ఏప్రిల్ 4, 2025న సానుకూల లేఖను పంపారు.

    Details

    హర్షం వ్యక్తం చేసిన కిషన్ రెడ్డి

    దీంతో ఒక దీర్ఘకాలిక డిమాండ్‌కు ఊపిరి లభించినట్లైంది. ఈ సానుకూల ప్రకటనపై కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేస్తూ, ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడికి ధన్యవాదాలు తెలిపారు.

    కిషన్ రెడ్డి ప్రకారం, ఆదిలాబాద్ జిల్లాలో పత్తి వ్యాపారం, వ్యవసాయ ఉత్పత్తుల కేంద్రంగా ఉన్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో విమానాశ్రయం ఎంతో అవసరం.

    ఈ నేపధ్యంలో 2022 జూలై 7, 2023 ఫిబ్రవరి 15న అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రికి లేఖలు రాశారు.

    2021 అక్టోబర్ 6న నాటి పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కూడా రాష్ట్రానికి లేఖ రాసినప్పటికీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని కిషన్ రెడ్డి విమర్శించారు.

    Details

    వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు

    ఇదిలా ఉండగా, తాజాగా వరంగల్ విమానాశ్రయానికి అనుమతులు లభించాయి.

    దీనికి అవసరమైన భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం త్వరగా పూర్తిచేస్తే మౌలిక సదుపాయాల నిర్మాణం వేగవంతం చేయవచ్చని కిషన్ రెడ్డి పేర్కొన్నారు.

    దీంతో వరంగల్ ప్రజల కలలు సాకారమవుతున్నాయని సంతోషం వ్యక్తం చేశారు. గత నెలలో ఈ విషయంపై రామ్మోహన్ నాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించినట్లు గుర్తు చేశారు.

    ఈ పరిణామాలతో పౌరవిమానయాన విస్తరణకు తెలంగాణ రాష్ట్రంలోని రెండు ప్రధాన నగరాలకు మేలైన అవకాశం లభించనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆదిలాబాద్

    తాజా

    Pawan Kalyan: గతంలోని చేదు అనుభవాలు మరచిపోతే ఎలా..? సినీ పరిశ్రమపై పవన్ కళ్యాణ్ అసహనం! పవన్ కళ్యాణ్
    #NewsBytesExplainer: కరోనా రీ ఎంట్రీ.. కొత్త వేరియంట్‌తో మళ్లీ ఊహించని పరిస్థితులు వస్తాయా?  కోవిడ్
    Lion Attack: సింహాన్ని తాకాడు.. వెంటనే ఆస్పత్రికి పరుగులు తీశాడు (వీడియో) సోషల్ మీడియా
    Varin Tej 15: 'కొరియన్ కనకరాజు' చిత్రానికి అనంతపురంలో తొలి షెడ్యూల్ పూర్తి! వరుణ్ తేజ్

    ఆదిలాబాద్

    మూడు కొత్త మండలాల ఏర్పాటుకు కేసీఆర్ గ్రీన్ సిగ్నల్  తెలంగాణ
    నేడు తెలంగాణకు అమిత్ షా.. ఆదిలాబాద్‍లో బీజేపీ బహిరంగ సభ   అమిత్ షా
    PM Modi : మార్చి 4, 5 తేదీల్లో తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన  నరేంద్ర మోదీ
    PM Modi : నేడు, రేపు తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన.. షెడ్యూల్ ఇదే  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025