NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Rajouri: చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం
    తదుపరి వార్తా కథనం
    Rajouri: చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం
    చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం

    Rajouri: చిక్కుముడి వీడిన అంతుచిక్కని వ్యాధి.. క్వారంటైన్‌లో గ్రామం

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jan 23, 2025
    12:23 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    అంతుచిక్కని వ్యాధి కారణంగా జమ్ముకశ్మీర్‌లోని రాజౌరి జిల్లాలో ఇప్పటివరకు 17 మంది మృతిచెందారు.

    ఈ నేపథ్యంలో తాజాగా చండీగఢ్ సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (సీఎఫ్‌ఎస్‌ఎల్‌) బృందం రాజౌరి జిల్లాలోని బుధల్ గ్రామాన్ని సందర్శించింది.

    ఈ సందర్భంగా డాక్టర్ అమర్‌జిత్ సింగ్ భాటియా మాట్లాడుతూ, ఈ అంతుచిక్కని వ్యాధి కారణాన్ని కనుగొన్నారు అని చెప్పారు.బాధితులకు మెరుగైన చికిత్స అందించబోతున్నామని, వారు త్వరలోనే కోలుకుంటారని తెలిపారు.

    మరోవైపు, స్థానిక వైద్యాధికారులు గ్రామాన్ని క్వారంటైన్‌ చేశారు.

    రాజౌరి పరిపాలన అధికారులు 150 పడకల తాత్కాలిక వైద్యశిబిరాన్ని ఏర్పాటు చేశారు.

    ఈ కేంద్రంలో బాధితులకు 24 గంటల వైద్య సదుపాయాలు అందించబడుతున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

    వివరాలు 

    వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్థానిక వైద్యాధికారులు చర్యలు

    డాక్టర్ అమర్‌జీత్ సింగ్ భాటియా వివరాల ప్రకారం, ఈ మరణాలకు బాధితుల మెదడుకు జరిగే హాని ప్రధాన కారణం.

    ఈ హానివల్ల వారి నాడీ వ్యవస్థకు ప్రభావం పడింది. తాజా సమాచారం ప్రకారం,ఈ వ్యాధితో ఆస్పత్రిలో చేరిన 15 మందిలో ఐదుగురు కోలుకున్నారు.

    ఈ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు స్థానిక వైద్యాధికారులు చర్యలు తీసుకున్నారు.

    గ్రామ ప్రజలకు ఆహార పదార్థాలు పరస్పరం పంచుకోకుండా ఉండాలని సూచిస్తున్నారు.

    గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరంలో తక్షణ వైద్య సేవలు అందిస్తున్నాయి.

    బాధిత కుటుంబాలకు పోషకాహారం,దుస్తులు,మందులు,పరిశుభ్రతా పరికరాలను అందిస్తున్నారు.

    ఈ కేంద్రంలో వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు.మరోవైపు,గ్రామంలో జరిగిన మరణాలకు సంబంధించి పోలీసులు నేరపూరిత చర్యలేమైనా కారణమై ఉండవచ్చా అని దర్యాప్తు చేస్తున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    జమ్ముకశ్మీర్

    తాజా

    SYG : సంబరాల ఏటిగట్టు నుండి రవికృష్ణ అగ్రెసివ్ లుక్ విడుదల! సాయి ధరమ్ తేజ్
    Tammudu : తమ్ముడు రిలీజ్ డేట్ పై క్లారిటీ.. అనుకున్న తేదీకే విడుదల!  నితిన్
    Stock market: లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్‌ సూచీలు.. నిఫ్టీ @25,100  స్టాక్ మార్కెట్
    Metro project: విశాఖ మెట్రో ప్రాజెక్టులో మరో ముందడుగు.. ADB ప్రతినిధులతో అధికారుల సమీక్ష విశాఖపట్టణం

    జమ్ముకశ్మీర్

    Election Commission Results: హర్యానా, J&K ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారు.. హ్యాట్రిక్ దిశగా బీజేపీ.. ఎన్సీ-కాంగ్రెస్‌ ఖాతాలో జమ్మూకశ్మీర్‌ హర్యానా
    Farooq Abdullah: జమ్మూకశ్మీర్‌ సీఎం పదవి ఒమర్‌దే.. ఫరూక్‌ అబ్దుల్లా కీలక వ్యాఖ్యలు ఇండియా
    Army jawans: జమ్ము కశ్మీర్‌లో ఇద్దరు జవాన్లు కిడ్నాప్.. ఒకరు మృతి  ఇండియా
    President's rule: జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత.. ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వానికి మార్గం సుగమం భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025