NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Telangana: తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి.. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఖిల్లాకు రోప్ వే ఏర్పాటు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Telangana: తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి.. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఖిల్లాకు రోప్ వే ఏర్పాటు
    తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి

    Telangana: తెలంగాణ టూరిజం స్పాట్ గా రామగిరి.. పర్వతమాల ప్రాజెక్ట్ కింద ఖిల్లాకు రోప్ వే ఏర్పాటు

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 09, 2025
    11:18 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పెద్దపల్లి జిల్లా మంథని నియోజకవర్గంలో ఉన్న ప్రసిద్ధ రామగిరి ఖిల్లాకు రోప్‌ వే ఏర్పాటయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    సహజసిద్ధమైన ప్రకృతి సౌందర్యంతో పాటు అపూర్వ శిల్ప కళలకు నిలయమైన ఈ ఖిల్లా, రోప్‌ వే ఏర్పాటు వల్ల ముఖ్యమైన పర్యాటక ప్రదేశంగా ఎదగగలదు.

    గత 11వ తేదీన పార్లమెంట్ సమావేశాల్లో, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి కేంద్ర రోడ్లు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీను కలిశారు.

    ఈ సందర్భంగా పర్వతమాల ప్రాజెక్ట్ కింద రామగిరి ఖిల్లాకు రోప్‌ వే నిర్మాణం చేపట్టాలని కోరారు. ఈ ప్రతిపాదనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.

    వివరాలు 

    పర్యాటక ప్రదేశంగా రామగిరి అభివృద్ధి అవకాశాలు 

    ఇప్పటికే రామగిరి ఖిల్లాను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడానికి సిద్ధంగా ఉంది.

    రాష్ట్ర ప్రభుత్వం రామగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించింది.

    ఈ కార్యక్రమంలో భాగంగా, ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తానే స్వయంగా ముందడుగు వేశారు.

    ఆయన చొరవతో ఖిల్లా పరిసర ప్రాంతాల్లో రోడ్డు నిర్మాణానికి రూ. 5 కోట్ల నిధులు కేటాయించారు.

    రామగిరి సమీపంలో ఇప్పటికే స్టేట్,నేషనల్ హైవేల నిర్మాణం జరుగుతోంది.ముత్తారం మీదుగా వరంగల్‌కు వెళ్లే ఎన్‌హెచ్ 63 నిర్మాణం కొనసాగుతోంది.

    మరోవైపు, పెద్దపల్లి నుంచి కునారం వ్యవసాయ కేంద్రం మీదుగా ముత్తారం నుండి భూపాలపల్లి దిశగా మరో రాష్ట్ర రహదారి నిర్మించబడనుంది.

    వివరాలు 

    ఎంపీ వంశీకృష్ణ చొరవతో అభివృద్ధి పనులకు వేగం 

    పీఎం సడక్ యోజన కింద అమ్రాబాద్ నుంచి ముత్తారం మండలంలోని పారుపల్లి వవర వరకు రోడ్డు నిర్మాణం ప్రారంభమైంది.

    ఇందులో ముత్తారం మండలంలో రూ.2.5 కోట్లు విలువైన రెండు వంతెనలు నిర్మించనున్నారు.

    పార్లమెంటులో ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఈ అభివృద్ధి పనుల గురించి మాట్లాడారు.

    రోడ్లు, వంతెనల నిర్మాణం త్వరగా పూర్తవ్వాలని, ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

    ఈ రహదారులు అన్నీ రామగిరి ఖిల్లా సమీపంలో ఉన్నాయి. అందువల్ల, రోడ్లతో పాటు రోప్‌ వే ఏర్పాటు కూడా పర్వతమాల ప్రాజెక్టు కింద చేపట్టాలని కేంద్ర మంత్రి గడ్కరిని కలిసి ఆయన మరోసారి విజ్ఞప్తి చేశారు.

    అధికారులు ఇప్పటికే ఖిల్లాను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు.

    వివరాలు 

    రవాణా, టూరిజం రంగాల్లో విస్తృతంగా వృద్ధి

    ఖిల్లా చరిత్ర, శిల్పకళ, ప్రకృతి వైభవం వంటి అంశాలపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించారు.

    కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రణాళికలు అమలయ్యే పక్షంలో, రామగిరి మాత్రమే కాకుండా మంథని, ముత్తారం, కాల్వ శ్రీరాంపూర్ మండలాలు కూడా పర్యాటకంగా అభివృద్ధి చెందే అవకాశాలున్నాయి.

    ఇది జిల్లాలో రవాణా, టూరిజం రంగాల్లో విస్తృతంగా వృద్ధికి దారి తీస్తుంది.

    పెద్దపల్లి జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న బేగంపేట, రత్నాపూర్, కల్వచర్ల గ్రామాల మధ్య ఈ ఖిల్లా విస్తరించి ఉంది.

    ప్రతి ఏడాది ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కాలేజీ, యూనివర్సిటీ విద్యార్థులు, ఆయుర్వేద వైద్యులు, బొటనీ శాస్త్రజ్ఞులు ఇక్కడ బొటానికల్ టూర్‌ కోసం వస్తుంటారు.

    వివరాలు 

    రోడ్డు సౌకర్యాల అవసరం 

    ప్రస్తుతం రామగిరి ఖిల్లాకు సరైన రహదారి సౌకర్యం లేదు. ఖిల్లాకు చేరేందుకు దాదాపు 10 కిలోమీటర్ల వరకు రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల పర్యాటకులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బేగంపేట నుంచి ఖిల్లా వరకు రహదారి నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు రూపొందించడానికి అధికారులను ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పెద్దపల్లి

    తాజా

    Vijay Mallya: అరెస్టు అయ్యే పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. భారత్‌ను వీడా: విజయ్‌ మాల్యా విజయ్ మాల్యా
    Covid 19: దేశంలో డేంజర్ బెల్స్ మోగిస్తున్న కరోనా.. 5,364 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులు.. 55 మరణాలు కరోనా కొత్త కేసులు
    USA: హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థుల ప్రవేశం నిలిపివేత.. ట్రంప్ కి షాక్ ఇచ్చిన ఫెడరల్‌ కోర్టు ..  అమెరికా
    Stock Market: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వడ్డీ రేట్లను తగ్గించిన నేపథ్యంలో.. సెన్సెక్స్ 700 పాయింట్లు జంప్‌ స్టాక్ మార్కెట్

    పెద్దపల్లి

    Malla RajiReddy: మవోయిస్టు అగ్రనేత మల్లా రాజిరెడ్డి కన్నూమూత! ఆంధ్రప్రదేశ్
    Telangana: మాజీ ఎమ్యెల్యే బిరుదు రాజమల్లు కన్నుమూత   భారతదేశం
    Peddapalli: పెద్దపల్లిలో ఫుడ్‌ పాయిజన్‌.. ఇద్దరు మృతి, 17 మందికి అస్వస్థత  తాజా వార్తలు
    MANAIR VAGU: మానేరు వాగుపై కూలిన నిర్మాణంలో ఉన్న వంతెన  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025