NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం
    తదుపరి వార్తా కథనం
    బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం
    బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం

    బీజేపీకి ఓటు వేసిన వాళ్లందరూ రాక్షసులే; కాంగ్రెస్ నేత సూర్జేవాలా వ్యాఖ్యలపై దుమారం

    వ్రాసిన వారు Stalin
    Aug 14, 2023
    06:14 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    2024 లోక్‌సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో జాతీయస్థాయిలో రాజకీయ వేడి రాజుకుంది. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాలు ఆరోపణలు, ప్రత్యారోపణలతో హీటెక్కుతున్నాయి.

    తాజాగా కాంగ్రెస్‌ నేత రణ్‌దీప్‌ సూర్జేవాలా వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపాయి.

    హర్యానాలోని కైతాల్‌లో జరిగిన కాంగ్రెస్ 'జన్ ఆక్రోష్ ర్యాలీ'లో ఆయన బీజేపీని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.

    రాష్ట్రంలో బీజేపీ, దాని మిత్రపక్షం జేజేపీలకు ఓటు వేసిన వారందరూ రాక్షస స్వభావం కలవారుగా అభివర్ణించారు.

    సుర్జేవాలా చేసిన ఈ ప్రకటనపై బీజేపీ తీవ్రస్థాయిలో వ్యతిరేకించింది. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, హర్యానా ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా సుర్జేవాలా వ్యాఖ్యలను ఖండించారు.

    బీజేపీ

    కోట్లాది మంది ఓటర్లను అవమానించడమే: బీజేపీ

    సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలు బీజేపీకి, దాని మిత్రపక్షాలకు ఓటు వేసిన కోట్లాది మంది ఓటర్లను అవమానించడమేనని బీజేపీ పేర్కొంది.

    రాక్షస కుటుంబంలో పుట్టిన వ్యక్తికే ఇలాంటి ఆలోచనలు వస్తాయని హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ అన్నారు.

    దేశ, రాష్ట్రాల సంక్షేమం కోసం ప్రభుత్వాలు ఏర్పాటు కోసం ఓట్లు వేస్తున్న వారి పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడమే అన్నారు. సుర్జేవాలా అన్‌పార్లమెంటరీ భాషను ఓటర్లు మర్చిపోరని చెప్పారు.

    దేశంలోని కోట్లాది మంది ఓటర్లను రాక్షసులుగా పిలవడం సూర్జేవాలా మనస్తత్వాన్ని తెలియజేస్తోందని హర్యానా డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా అన్నారు.

    దేశంలోని ఓటర్లను రాక్షసులుగా పేర్కొంటూ రణదీప్ సూర్జేవాలా ఓటర్లందరినీ, ప్రజాస్వామ్యాన్ని అవమానించారని హర్యానా అసెంబ్లీ స్పీకర్ డాక్టర్ జ్ఞాన్‌చంద్ గుప్తా అన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాంగ్రెస్
    బీజేపీ
    తాజా వార్తలు
    హర్యానా

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    కాంగ్రెస్

    అమరావతి రాజధానికి కట్టుబడి ఉన్నాం : ఏపీ నేతలతో రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్
    బెంగుళూరులో జరగాల్సిన ప్రతిపక్షాల రెండో దఫా సమావేశం వాయిదా; కారణం ఇదే బెంగళూరు
    బెంగళూరులో విపక్షాల రెండో భేటీకి సోనియాగాంధీ.. 16న దిల్లిలో విపక్ష నేతలకు ప్రత్యేక విందు సోనియా గాంధీ
    పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టును ఆశ్రయించిన రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ

    బీజేపీ

    వచ్చే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంటుంది : ఆదినారాయణ రెడ్డి జనసేన
    ఏపీ సర్కారుపై BJP చీఫ్ పురందేశ్వరి తీవ్ర ఆరోపణలు ఆంధ్రప్రదేశ్
    Opposition Meeting: నేడు బెంగళూరలో ప్రతిపక్షాల నేతల సమావేశం; 2024 ఎన్నికల రోడ్‌మ్యాప్‌పై ఫోకస్ ప్రతిపక్షాలు
    Lok Janshakti Party: చిరాగ్, పశుపతిని కలిపేందుకు బీజేపీ విశ్వప్రయత్నాలు లోక్ జనశక్తి పార్టీ/ ఎల్‌జేపీ

    తాజా వార్తలు

    రాహుల్ గాంధీ, ఖర్గేకు థ్యాంక్స్ చెప్పిన దిల్లీ సీఎం కేజ్రీవాల్  అరవింద్ కేజ్రీవాల్
    జ్ఞానవాపి సర్వే: మీడియా కవరేజీని నిషేధించాలని కోర్టును ఆశ్రయించిన ముస్లిం పక్షం జ్ఞానవాపి మసీదు
    మణిపూర్ అంశంపై రాజ్యసభ నుంచి కాంగ్రెస్ వాకౌట్  కాంగ్రెస్
    ఇటలీ: మధ్యదరా సముద్రంలో పడవ బోల్తా; 41 మంది వలసదారులు మృతి  ఇటలీ

    హర్యానా

    ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా 56వ సారి బదిలీ భారతదేశం
    డేరా బాబా స్టైలే వేరు! పొడవాటి ఖడ్గంతో కేక్ కటింగ్, వీడియో వైరల్ ఉత్తర్‌ప్రదేశ్
    ఉత్తర్‌ప్రదేశ్, హర్యానాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 3.2తీవ్రత నమోదు ఉత్తర్‌ప్రదేశ్
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం అత్యాచారం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025