NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!
    రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

    AP Cabinet: రాష్ట్రంలో రికార్డు స్థాయిలో పెట్టుబడి.. నిప్పాన్‌ ఉక్కు ప్రాజెక్ట్‌కు శ్రీకారం!

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Apr 04, 2025
    10:02 am

    ఈ వార్తాకథనం ఏంటి

    పారిశ్రామిక అభివృద్ధి, ఉపాధి కల్పనకు దోహదపడేలా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర మంత్రిమండలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో సచివాలయంలో జరిగిన సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.

    విశాఖపట్నం సమీపంలోని డీఎల్‌పురం వద్ద మెస్‌ర్స్ ఆర్సెల్లార్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్‌ రూ.1,35,000కోట్ల పెట్టుబడితో నిర్మించే 17.8 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉక్కు కర్మాగారానికి ఆమోదం తెలిపింది.

    ఈ ప్రాజెక్టును రెండు దశల్లో నిర్మించనున్నారు.

    ఈ ఉక్కు పరిశ్రమ అవసరాల కోసం 2.9 కిలోమీటర్ల వాటర్‌ఫ్రంట్ కలిగిన కేప్టివ్ పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం అనుమతించింది.

    కాకినాడ గేట్‌వే ప్రైవేట్ లిమిటెడ్ పోర్టుతో కుదిరిన ఒప్పందంలోని కొన్ని నిబంధనలను సవరించారు.

    మంత్రివర్గ నిర్ణయాలను సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు.

    Details

    ఉపాధి కల్పనపై దృష్టి 

    నిప్పాన్ ఉక్కు పరిశ్రమ ప్రాజెక్టు మొదటి దశలో రూ.55,964 కోట్ల పెట్టుబడితో 7.3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారాన్ని 2029 జనవరిలో పూర్తి చేస్తారు.

    దీని ద్వారా 20,000 మందికి ఉపాధి లభించనుంది.

    ఇదే సమయంలో రూ.5,816 కోట్ల వ్యయంతో 20.5 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్గో రవాణా సామర్థ్యం కలిగిన కేప్టివ్ పోర్టు తొలి దశ పూర్తవుతుంది. దీని వల్ల 1,000 మందికి ఉపాధి లభిస్తుంది.

    రెండో దశలో రూ.80,000 కోట్ల పెట్టుబడితో 10.5 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం కలిగిన కర్మాగారం 2033 నాటికి పూర్తవుతుంది. దీని ద్వారా 35,000 మందికి ఉపాధి కల్పించనున్నారు.

    Details

     అమరావతి జలహారతి కార్పొరేషన్‌కు ఆమోదం 

    రెండో దశ కేప్టివ్ పోర్టు రూ.5,382 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. ఇది 5,000 మందికి ఉపాధి కల్పిస్తుంది. ఈ పోర్టును నిప్పాన్ సంస్థ స్వయంగా నిర్మించనుంది. అనుమతులన్నీ సకాలంలో వచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.

    పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన 'అమరావతి జలహారతి కార్పొరేషన్‌' అనే ప్రత్యేక వాహన సంస్థ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది.

    ఇది రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు ఉపయోగపడే ప్రాజెక్టుగా భావిస్తున్నారు. ఇది నాలుగేళ్లలో తగిన పురోగతిని సాధించనుంది.

    ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌లు కలిసి దీనిని కార్యరూపం దిద్దుతారు.

    Details

    చింతలపూడి ప్రాజెక్టు.. అదనపు వ్యయానికి దర్యాప్తు 

    నాగార్జునసాగర్ ఎడమ కాలువలో వేంపాడు మేజర్ వద్ద రిటైనింగ్ వాల్ నిర్మాణానికి 2022లో స్టాండింగ్ కమిటీ రూ.44.60 కోట్ల అదనపు ఖర్చులకు ఆమోదం తెలిపిన విషయం గుర్తు చేశారు.

    అయితే ముందస్తు అనుమతులు లేకుండా ఖర్చు చేసినందున దానిపై జలవనరుల శాఖ మంత్రివర్గానికి ప్రతిపాదన సమర్పించింది.

    ఈ ఖర్చు ఎలా జరిగింది? ఎందుకు ముందస్తు అనుమతులు తీసుకోలేదన్న విషయాలపై దర్యాప్తు చేయాలని నిర్ణయం తీసింది.

    Details

    బార్ లైసెన్సు ఫీజులో భారీ తగ్గింపు 

    రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు మంత్రివర్గం మూడు నక్షత్రాల హోటళ్లలో బార్ లైసెన్సు ఫీజును రూ.65 లక్షల నుంచి రూ.25 లక్షలకు తగ్గించింది.

    ప్రస్తుతం అనుమతులు లేకుండానే బార్‌లు నడుస్తుండటంతో ఈ తగ్గింపు వల్ల పెద్దగా ఆర్థిక నష్టం ఏమీ ఉండదని ప్రభుత్వం భావిస్తోంది.

    ఐదేళ్లలో 50,000 అదనపు గదులను అందుబాటులోకి తేనున్నట్లు తెలిపింది.

    ఇతర కీలక నిర్ణయాలు

    ఉగాది పురస్కారాలను మంత్రివర్గం ర్యాటిఫై చేసింది.

    ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్‌కు రూ.710 కోట్ల హడ్కో రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది.

    Details

     సీనియర్ ఐఏఎస్‌లకు పల్లె పయనం

    రాష్ట్రంలోని సీనియర్ ఐఏఎస్‌లు ప్రతి ఒక్కరూ పల్లెల్లో రెండు రాత్రులు, మూడు పగళ్లు గడపాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    మంచినీళ్లు, రవాణా, గ్యాస్, రహదారులపై అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలి.

    దీని ద్వారా గ్రామాభివృద్ధికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించనున్నారు.

    నవయుగ, ఏపీ జెన్‌కోకు నష్టపరిహారం

    పోలవరం జలవిద్యుత్ కేంద్ర కాంట్రాక్టు విషయంలో గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల నవయుగ ఇంజినీరింగ్ కంపెనీ, ఏపీ జెన్‌కో సంస్థలకు నష్టం వాటిల్లిందని గుర్తించి మంత్రివర్గం పరిహారం చెల్లించేందుకు ఆమోదం తెలిపింది.

    డిసెంబర్ 8, 2024న జారీ అయిన ఆర్బిట్రేషన్ అవార్డును అమలు చేస్తారు. దీనివల్ల నవయుగ కంపెనీకి రూ.742 కోట్లు, ఏపీ జెన్‌కోకు రూ.986.17 కోట్ల నష్టం భర్తీ చేయనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    MLC Kavitha: కేసీఆర్‌ చుట్టూ ఉన్న దెయ్యాల ఉన్నాయి.. వాటి వల్లే పార్టీకి నష్టం: ఎమ్మెల్సీ కవిత కల్వకుంట్ల కవిత
    Chandrababu: అమరావతిని రాజధానిగా నోటిఫై చేయాలని కేంద్రాన్ని కోరాం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    IPL 2025: టీ20లో నాలుగు వేల క్ల‌బ్‌లో అభిషేక్..  అభిషేక్ శర్మ
    Donald Trump: 'ఆపిల్‌'కు ట్రంప్‌ వార్నింగ్‌.. అలాచేస్తే 25% సుంకం చెల్లించాల్సిందే! డొనాల్డ్ ట్రంప్

    ఆంధ్రప్రదేశ్

    Kakinada: కాకినాడలో దారుణ ఘటన.. పిల్లలను హత్య చేసి ఉరేసుకున్న తండ్రి కాకినాడ సిటీ
    CM Chandrababu: 47 ఏళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం: సీఎం చంద్రబాబు చంద్రబాబు నాయుడు
    Heat Waves: రాష్ట్రంలో ఎండల తీవ్రత.. నాతవరంలో 42.1 డిగ్రీలకు తాకిన ఉష్ణోగ్రత  భారతదేశం
    Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన! విద్యుత్

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభంలోనే తల్లికి వందనం..విద్యుత్ ఛార్జీలు తగ్గాలి భారతదేశం
    AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు ఆంధ్రప్రదేశ్
    CM Chandrababu: పాలనలో వేగం పెంచడానికే మంత్రులకు ర్యాంకులు : సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్
    Chandrababu: దిల్లీలో బీజేపీ విజయానికి ప్రధాన కారణం మోదీనే : చంద్రబాబు  నరేంద్ర మోదీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025