Page Loader
Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన!
ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన!

Andhra Pradesh: ఐదేళ్లలో తొలిసారి విద్యుత్ ఛార్జీలలో తగ్గింపు.. ట్రూడౌన్‌ ప్రకటన!

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 17, 2025
09:31 am

ఈ వార్తాకథనం ఏంటి

గత ప్రభుత్వం ఐదేళ్ల పాటు విద్యుత్ ఛార్జీలను పెంచేందుకు మార్గాలు అన్వేషించగా, ఏటా కొత్త పేర్లతో వినియోగదారులపై భారాన్ని మోపింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత మొదటిసారి ఛార్జీలను ఎలా తగ్గించాలనే ఆలోచన చేసింది. ఈ నిర్ణయంతో వినియోగదారులకు విద్యుత్ సంస్థలు కొంత ఊరట కల్పించాయి. నాలుగో నియంత్రిత వ్యవధి (2019-24)లో ఏపీ ట్రాన్స్‌కో మొత్తం రూ.1,059.75 కోట్ల ట్రూడౌన్ (విద్యుత్ ఛార్జీల తగ్గింపు)ను ప్రకటించింది. ఐదేళ్ల అనంతరం వినియోగదారులు ట్రూడౌన్ అనే పదాన్ని మళ్లీ వినిపించుకోగా, గత ప్రభుత్వం మాత్రం ట్రూఅప్‌, ఎఫ్‌పీపీసీఏ (ఇంధన సర్దుబాటు ఛార్జీలు) వంటి పేర్లను ప్రవేశపెట్టింది.

Details

 ట్రూడౌన్ మొత్తాన్ని పంపిణీ చేయడం ఎలా? 

కమిషన్ నిర్ణయం ప్రకారం, ట్రూడౌన్ మొత్తాన్ని విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) వినియోగదారులకు అందించాల్సి ఉంది. విద్యుత్ కేటాయింపుల ఆధారంగా ఈ మొత్తాన్ని వివిధ డిస్కంలకు కేటాయించారు: - ఈపీడీసీఎల్ - రూ.383.84 కోట్లు ఎస్‌పీడీసీఎల్ - రూ.428.56 కోట్లు సీపీడీసీఎల్ - రూ.247.35 కోట్లు అయితే, ఈ మొత్తాన్ని వినియోగదారుల బిల్లుల్లో సర్దుబాటు చేస్తారా? లేదా ఇతర మార్గాల్లో సర్దుబాటు చేస్తారా? అనే దానిపై కమిషన్ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.

Details

ట్రూడౌన్ ఎలా ఏర్పడింది? 

నాలుగో నియంత్రిత వ్యవధిలో పెట్టుబడి వ్యయానికి ఏపీఈఆర్‌సీ అనుమతించిన ఖర్చు, వాస్తవ ఖర్చు మధ్య వ్యత్యాసాన్ని ట్రూడౌన్ కింద సర్దుబాటు చేయాలని ట్రాన్స్‌కో ప్రతిపాదించింది. 2020 నుంచి కొవిడ్ ప్రభావంతో రెండు సంవత్సరాల పాటు లాక్‌డౌన్ అమలయ్యింది. దీనివల్ల కూలీలు అందుబాటులో లేకపోవడం, అభివృద్ధి పనులు సాగకపోవడంతో కొన్ని నిధులు ఉపయోగించలేదు. ఖాతాల సర్దుబాటు ప్రక్రియలో మిగిలిన ఈ మొత్తాన్ని డిస్కంలకు బదిలీ చేయాలని ట్రాన్స్‌కో పిటిషన్ దాఖలు చేసింది. డిస్కంల ప్రతిపాదనలపైనా సమీక్షా ఈపీడీసీఎల్ - రూ.240 కోట్ల ట్రూడౌన్ ప్రతిపాదన సిద్ధం చేసింది. సీపీడీసీఎల్ - రూ.400 కోట్ల వరకు ట్రూడౌన్ వచ్చే అవకాశం ఉంది. ఎస్‌పీడీసీఎల్ లెక్కలు ఇంకా తేలాల్సి ఉంది.

Details

ట్రూఅప్‌, ట్రూడౌన్‌ మధ్య తేడా ఇదే

ట్రూఅప్‌ ఏపీఈఆర్‌సీ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు ఎక్కువైతే, విద్యుత్ సంస్థలు అదనంగా వచ్చిన ఖర్చును వినియోగదారుల నుంచి వసూలు చేస్తాయి ట్రూడౌన్‌ కమిషన్ అనుమతించిన మొత్తం కంటే వాస్తవ ఖర్చు తక్కువైతే, మిగిలిన మొత్తాన్ని వినియోగదారులకు తిరిగి అందిస్తారు. దీని వల్ల వినియోగదారుల ఛార్జీలు తగ్గే అవకాశం ఉంటుంది. కొత్త ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల తగ్గింపుపై తీసుకున్న ఈ నిర్ణయం వినియోగదారులకు ఊరట కలిగించనుంది. ఇక కమిషన్‌ తుది నిర్ణయంపై అందరి దృష్టి ఉంది.