NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం
    ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం

    Waqf Act: ఆరు నెలల్లో వక్ఫ్ ఆస్తుల నమోదు పూర్తి చేయాలి: కేంద్ర ప్రభుత్వం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Jun 03, 2025
    09:13 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశవ్యాప్తంగా వక్ఫ్ ఆస్తుల నమోదుకు కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది.

    వక్ఫ్ ఆస్తుల నిర్వహణను మెరుగుపరచడం, పారదర్శకతను పెంచడం లక్ష్యంగా జూన్ 6న 'ఉమీద్' పేరిట ఓ ప్రత్యేక పోర్టల్‌ను ప్రారంభించనున్నారు.

    ఈ పోర్టల్ పూర్తి పేరు 'ఏకీకృత వక్ఫ్ నిర్వహణ, సాధికారత, సామర్థ్యం, అభివృద్ధి'. ఇది దేశవ్యాప్తంగా ఉన్న వక్ఫ్ ఆస్తుల నమోదుకు ఒక కేంద్రీకృత వేదికగా వ్యవహరించనుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి.

    ప్రభుత్వ ప్రణాళిక ప్రకారం, అన్ని వక్ఫ్ ఆస్తుల వివరాలను ఆరు నెలల వ్యవధిలోగా పోర్టల్‌లో నమోదు చేయాల్సి ఉంటుంది.

    దీనిలో ఆస్తుల పొడవు, వెడల్పు వంటి భౌగోళిక సమాచారం, జియో ట్యాగింగ్ చేసిన స్థానాలు తప్పనిసరిగా ఇవ్వాలి.

    Details

    రాష్ట్రపతి సంతకం చేయడంతో చట్టంగా మారింది

    అయితే మహిళల పేర్లపై నమోదైన ఆస్తులు వక్ఫ్‌గా పరిగణించబడే అర్హత కలిగి ఉండవు. వక్ఫ్ ఆస్తుల ప్రాథమిక లబ్ధిదారులుగా మహిళలు, చిన్నారులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలవారిని గుర్తిస్తున్నారు.

    రాష్ట్ర వక్ఫ్ బోర్డులు ఈ నమోదును సులభతరం చేసే విధంగా చర్యలు తీసుకోనున్నాయి.

    నిర్ణీత గడువులోపు నమోదు కాని ఆస్తులను వివాదాస్పదంగా పరిగణించి వాటిని వక్ఫ్ ట్రిబ్యునల్స్‌కి విచారణకు పంపనున్నారు.

    ఈ వ్యవస్థ అమలులోకి రావడం వెనుక ఇటీవల పార్లమెంట్‌లో ఆమోదం పొందిన వక్ఫ్ (సవరణ) బిల్లు, 2025 ఉంది.

    ఏప్రిల్ 5న ఉభయ సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఏప్రిల్‌లో సంతకం చేయగా, చట్టంగా మారింది.

    Details

    ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు

    అయితే, ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలయ్యాయి. ఈ చట్టం రాజ్యాంగ హామీలకు వ్యతిరేకమని వాటిలో పేర్కొన్నారు.

    పిటిషన్లను కొట్టివేయాలంటూ కేంద్ర ప్రభుత్వం కోర్టును కోరింది. ఏప్రిల్ 17న జరిగిన విచారణలో, ప్రభుత్వం తాత్కాలికంగా కొన్ని నిబంధనల అమలును నిలిపివేస్తున్నట్టు తెలిపిన నేపథ్యంలో, సుప్రీంకోర్టు స్టే విధించేందుకు నిరాకరించింది.

    తాజా విచారణ మే 27న జరిగింది. అందులో కేంద్రంతో పాటు ఇతర పక్షాల నుండి స్పందనలు కోరుతూ న్యాయస్థానం ఆదేశించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కేంద్ర ప్రభుత్వం

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    కేంద్ర ప్రభుత్వం

    PM Modi: ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రూ.258 కోట్లు వెల్లడించిన కేంద్ర ప్రభుత్వం భారతదేశం
    MPs Salaries Hike: ఎంపీల వేతనాలు, పెన్షన్, అలవెన్సుల పెంపు.. ఏప్రిల్ 1 నుంచి అమలు భారతదేశం
    Pension For Gig Workers: గిగ్‌ వర్కర్లకు పెన్షన్‌.. కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం! జొమాటో
    Amit Shah: హింస కాదు, శాంతే మార్గం.. మావోయిస్టులకు అమిత్ షా పిలుపు అమిత్ షా
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025