NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన
    మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన

    chilli farmers: మిర్చి రైతులకు ఊరట.. చంద్రబాబు విజ్ఞప్తికి కేంద్రం సానుకూల స్పందన

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 22, 2025
    09:29 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఆంధ్రప్రదేశ్‌లో మిర్చి ధరలు క్షీణించి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

    ఈ నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.

    కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్, వ్యవసాయశాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది శుక్రవారం కృషిభవన్‌లో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఈ సమస్యపై చర్చించారు.

    ఈ సమావేశంలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ప్రత్యక్షంగా పాల్గొనగా, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు.

    Details

    మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి

    ఈ సమావేశంలో ప్రధానంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీం కింద మిర్చిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. మార్కెట్ ధర, సాగు ఖర్చు మధ్య ఉన్న తేడాను భర్తీ చేయాలి.

    ఎంఐఎస్ కింద కొనుగోలు పరిమితిని 25శాతం నుంచి 75శాతానికి పెంచడం, మిర్చి సాగు వ్యయాన్ని ఐకార్ నిర్ణయించిన ప్రకారం కాకుండా, ఏపీ ప్రభుత్వం నిర్ణయించిన రూ.11,600ను పరిగణనలోకి తీసుకోవడం, అలాగే ఎగుమతులపై ఉన్న అడ్డంకులను తొలగించడంపై వంటి అంశాలపై చర్చ జరిగింది.

    ఈ డిమాండ్లపై కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సానుకూలంగా స్పందించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు.

    Details

    భరోసానిచ్చిన కేంద్రం

    సీఎం చంద్రబాబు చేసిన విజ్ఞప్తికి కేంద్రం వెంటనే స్పందించిందని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.

    ఆయన మధ్యప్రదేశ్‌లో ఉన్న కారణంగా, చంద్రబాబును వ్యక్తిగతంగా కలవలేకపోయిన వ్యవసాయ మంత్రి శుక్రవారం దిల్లీకి రాగానే తొలి సమావేశాన్ని మిర్చి రైతుల సమస్యలపైనే ఏర్పాటు చేశారన్నారు.

    పంట ఉత్పత్తి వ్యయానికి, కొనుగోలు ధరకు మధ్య ఉన్న తేడాను వీలైనంత త్వరగా భర్తీ చేస్తామని చెప్పారు.

    మిర్చి సాగుకు ప్రభుత్వం ఖర్చు క్వింటాల్‌కు రూ.10,000 అని ఐకార్ నిర్ణయించినా, ఏపీ ప్రభుత్వం ఖరారు చేసిన రూ.11,600ను పరిగణనలోకి తీసుకోవాలని గట్టిగా డిమాండ్ చేశామన్నారు.

    Details

     మార్కెట్ రేటుకు భరోసా - రైతులకు లబ్ధి 

    ప్రస్తుతం మార్కెట్ ధర, సాగు ఖర్చు మధ్య తేడాను కేంద్రం భర్తీ చేయడానికి సిద్ధంగా ఉందని స్పష్టంగా ప్రకటించారు.

    కేంద్రం అందించే ప్రతి పైసా నేరుగా రైతులకు చేరేలా చర్యలు తీసుకుంటామని, అవసరమైతే ఈ సహాయాన్ని మరింత పెంచాలని కూడా అభ్యర్థించామని తెలిపారు.

    ఈ నిర్ణయాలతో గుంటూరు, పల్నాడు, రాయలసీమ ప్రాంతాల్లో ఉన్న మిర్చి రైతులకు గణనీయమైన ప్రయోజనం కలుగుతుందని కేంద్ర మంత్రి చెప్పారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఆంధ్రప్రదేశ్
    చంద్రబాబు నాయుడు

    తాజా

    Census: 2027 మార్చి 1 నుంచి జనగణన ప్రారంభం..: కేంద్రం వెల్లడి భారతదేశం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా

    ఆంధ్రప్రదేశ్

    AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు.. నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ భారతదేశం
    AP News: ఏపీలో ఫిబ్రవరి నెలలోనే మండుతున్న ఎండలు.. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు.. ఇబ్బందిపడుతున్న ప్రజలు  వాతావరణ మార్పులు
    AP Cabinet: రాష్ట్ర మంత్రిమండలి కీలక నిర్ణయాలు.. రాయితీల పెంపు, పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాకాలు చంద్రబాబు నాయుడు
    AP Inter Hall Ticket: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం.. వాట్సాప్‌ మనమిత్రద్వారా ఇంటర్‌ హాల్‌టికెట్లు  భారతదేశం

    చంద్రబాబు నాయుడు

    Chandrababu: నేడు కుప్పంలో చంద్రబాబు పర్యటన.. రూ. 1500 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన కుప్పం
    Chandrababu: 'స్వర్ణ కుప్పం'.. విజన్‌ డాక్యుమెంట్‌ ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు భారతదేశం
    CM Chandrababu: సౌర విద్యుత్తు ద్వారా విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు చంద్రబాబు ప్రణాళిక కుప్పం
    Chandrababu: చంద్రబాబు భద్రతా వలయంలోకి కొత్తగా కౌంటర్‌ యాక్షన్‌ బృందాలు భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025