NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు? 
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు? 
    మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు?

    Delhi: మరికొన్ని గంటల్లో ఫలితం.. దిల్లీ విజేత ఎవరు? 

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 08, 2025
    08:04 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆసక్తికర సమరానికి తెరలేచింది.

    నాలుగోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) పట్టుదలగా ఉండగా, 26 ఏళ్ల విరామం తర్వాత తిరిగి దిల్లీలో జెండాను ఎగురవేయాలని భారతీయ జనతా పార్టీ కసితో ఉంది.

    ఈ రెండు పార్టీల మధ్య తుది విజయం ఎవరిని వరిస్తుందనేది కొద్ది గంటల్లో తేలనుంది.

    ఉత్సాహభరితంగా ఎదురుచూస్తున్న ఈ ఎన్నికల ఫలితాలు శనివారమే వెలువడనున్నాయి. ఓట్ల లెక్కింపును సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం (ఈసీ) కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది.

    మొత్తం 19 కౌంటింగ్‌ కేంద్రాల్లో 10 వేల మంది పోలీసులను మూడంచెల భద్రతా ఏర్పాట్లతో మోహరించారు.

    Details

    మెజార్టీకి 36 స్థానాలు అవసరం

    ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. తాజా ఎగ్జిట్‌ పోల్స్‌లో బీజేపీ మెరుగైన స్థితిలో ఉందన్న సంకేతాలు కనిపించాయి.

    దిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా, ప్రభుత్వ ఏర్పాటుకు కనీస మెజార్టీగా 36 స్థానాలు కావాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5న జరిగిన ఎన్నికల్లో 60.54% మంది ఓటర్లు తమ హక్కును వినియోగించుకున్నారు.

    దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధానంగా ఆప్, బీజేపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. రెండు పార్టీలు తమ విజయంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తున్నాయి.

    దిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవ శుక్రవారం మాట్లాడుతూ, తమ పార్టీ దాదాపు 50 సీట్లు గెలుచుకోగలదని ధీమా వ్యక్తం చేశారు.

    Details

    మరికొన్ని గంటల్లో ఫలితం

    కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆప్‌ అధిపత్యానికి తెరపడే సమయం ఆసన్నమైందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అదే సమయంలో, ఎగ్జిట్‌ పోల్స్ అంచనాలను కొట్టిపారేస్తూ, తాము అధికారంలో కొనసాగడం ఖాయమని ఆప్‌ స్పష్టం చేసింది.

    శుక్రవారం మాజీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తమ పార్టీ అభ్యర్థులతో భేటీ అయ్యారు. తమ పార్టీ మరోసారి అధికారాన్ని దక్కించుకోవడం లాంఛనమని వ్యాఖ్యానించారు.

    ఇక గత రెండు ఎన్నికల్లో దిల్లీలో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి మెరుగైన ఫలితాలను సాధించాలని ప్రయత్నిస్తోంది.

    ఒకప్పుడు వరుసగా 15 ఏళ్లపాటు దిల్లీని పాలించిన ఈ పార్టీ, మళ్లీ తన పరువు నిలబెట్టుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే దిల్లీ ప్రజలు ఎవరికి పట్టం కడతారనేది కొద్ది గంటల్లో తేలనుంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    బీజేపీ
    అరవింద్ కేజ్రీవాల్
    కాంగ్రెస్

    తాజా

    Harish Rao: వినోదాల కోసం రూ.200 కోట్లు ఖర్చు పెడతారా?: హరీశ్‌రావు విమర్శలు బీఆర్ఎస్
    Nigeria: నైజీరియాలో ఘోర రోడ్డు ప్రమాదం.. 21 మంది క్రీడాకారులు మృతి నైజీరియా
    Paris: పీఎస్‌జీ విజయం తర్వాత పారిస్‌ వీధుల్లో ఘర్షణలు.. ఇద్దరు మృతి, 192 మందికి గాయాలు ఫ్రాన్స్
    Rinku Singh: జూన్ 8న రింకూ సింగ్-ప్రియ నిశ్చితార్థం వేడుక..?  రింకూ సింగ్

    దిల్లీ

    Delhi: 36 ఏళ్ల నిషేధం తర్వాత మార్కెట్లో 'ది సైటానిక్ వెర్సెస్' ఇండియా
    Manmohan Singh: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. దేశానికి చేసిన సేవలకు గుర్తుగా మన్మోహన్ సింగ్ స్మారక చిహ్నం మన్మోహన్ సింగ్
    Delhi: న్యూఇయర్ వేళ హస్తినలో ఘోరం.. భార్య వేధింపులతో కేఫ్ యజమాని ఆత్మహత్య భారతదేశం
    Delhi: దేశ రాజధానిలో దట్టమైన పొగమంచు.. 80కిపైగా విమానాలు ఆలస్యం భారతదేశం

    బీజేపీ

    Atishi: శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపైనే ఉంది: అతిషి మార్లెనా అతిషి మార్లెనా
    Delhi BJP chief : యమునా నదిలో దిల్లీ బీజేపీ అధ్యక్షుడు స్నానం.. శ్వాసకోశ ఇబ్బందులతో ఆస్పత్రిలో చేరిక దిల్లీ
    Kharge-Modi : ఖర్గే-మోదీ మధ్య మాటల యుద్ధం.. బీజేపీ, కాంగ్రెస్‌పై పరస్పర విమర్శలు కాంగ్రెస్
    Sadhvi Pragya: సాధ్వి ప్రగ్యాకి తీవ్ర అస్వస్థత.. 'నేను బతికి ఉంటే కచ్చితంగా కోర్టు వాదనలకు వెళ్తాను'  భారతదేశం

    అరవింద్ కేజ్రీవాల్

    Delhi next CM : ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్ తర్వాత తదుపరి సీఎం ఎవరు?  దిల్లీ
    AAP: దిల్లీ ముందస్తు ఎన్నికలకు ఆప్‌ డిమాండ్‌.. ఎన్నికలపై ఈసీ కీలక నిర్ణయం..! ఎన్నికల సంఘం
    Arvind Kejriwal: రేపు సాయంత్రం సీఎం పదవికి రాజీనామా.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోరిన కేజ్రీవాల్ దిల్లీ
    Delhi New CM: దిల్లీ కొత్త సీఎంగా ఆతిశీ.. కేజ్రీవాల్ ప్రకటన దిల్లీ

    కాంగ్రెస్

    congress: అమెరికాలో అదానీపై కేసు.. సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుచేయాలని కాంగ్రెస్ డిమాండ్ అదానీ గ్రూప్
    Priyanka Gandhi : ప్రియాంక గాంధీ రాజకీయ పయనం.. నానమ్మ ఆశయాలతో పార్లమెంట్‌కి..! ప్రియాంక గాంధీ
    Sridhar Babu : సంక్షోభాన్ని దాటుకుంటూ ముందుకు.. అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రణాళికలు తెలంగాణ
    INDIA Bloc: మమతా బెనర్జీకి పరోక్ష మద్దతు.. విపక్ష పార్టీల్లో కొత్త చర్చలకు ముడిపెడుతున్న లాలూ! ఇండియా కూటమి
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025