Page Loader
India-Sri Lanka: రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?
రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?

India-Sri Lanka: రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 16, 2024
03:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కలసి రామేశ్వరం-తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు. రెండు దేశాల మధ్య బంధాలను మరింత బలపరచడానికి ఇది కీలక అడుగుగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు. శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి పలు కీలక రంగాల్లో విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇరు దేశాల నేతలు వెల్లడించారు. రామేశ్వరం-తలైమన్నార్ ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరణ ద్వారా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని మోదీ పేర్కొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

Details

వాణిజ్య సంబంధాలు, వలస కార్మికుల సమస్యలపై చర్చ

తమిళుల హక్కుల పరిరక్షణకు భారత్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని మరోసారి గుర్తుచేశారు. రక్షణ రంగంలో సహకారానికి సంబంధించిన ఒప్పందానికి తుది రూపం ఇవ్వడం కోసం ఇరు దేశాలు పనిచేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు. శ్రీలంకతో రక్షణ సహకారాన్ని బలపరచడం ద్వారానే ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు. ఈ చర్చలలో ఇంధన భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలు, వలస కార్మికుల సమస్యలపై కూడా చర్చించారు. రామేశ్వరం-తలైమన్నార్ ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరణ ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యానికి కూడా కీలకంగా మారవచ్చని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.