NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / India-Sri Lanka: రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?
    తదుపరి వార్తా కథనం
    India-Sri Lanka: రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?
    రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?

    India-Sri Lanka: రామేశ్వరం-శ్రీలంక ఫెర్రీ సేవల పునరుద్ధరణ: రెండు దేశాల బంధం బలపడతుందా?

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Dec 16, 2024
    03:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో భారత ప్రధాని నరేంద్ర మోదీ కలసి రామేశ్వరం-తలైమన్నార్ మధ్య ఫెర్రీ సర్వీసులను పునరుద్ధరించనున్నట్లు ప్రకటించారు.

    రెండు దేశాల మధ్య బంధాలను మరింత బలపరచడానికి ఇది కీలక అడుగుగా ఉంటుందని మోదీ స్పష్టం చేశారు.

    శ్రీలంక అధ్యక్షుడి భారత పర్యటన సందర్భంగా జరిగిన ద్వైపాక్షిక చర్చల్లో రక్షణ, ఇంధనం, వాణిజ్యం వంటి పలు కీలక రంగాల్లో విస్తరించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు ఇరు దేశాల నేతలు వెల్లడించారు.

    రామేశ్వరం-తలైమన్నార్ ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరణ ద్వారా రెండు దేశాల ప్రజల మధ్య సంబంధాలు మెరుగవుతాయని మోదీ పేర్కొన్నారు.

    ఈ సమావేశంలో ప్రధాని మోదీ శ్రీలంకలో తమిళుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు ఆ దేశ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

    Details

    వాణిజ్య సంబంధాలు, వలస కార్మికుల సమస్యలపై చర్చ

    తమిళుల హక్కుల పరిరక్షణకు భారత్ తరఫున పూర్తి మద్దతు ఉంటుందని మరోసారి గుర్తుచేశారు.

    రక్షణ రంగంలో సహకారానికి సంబంధించిన ఒప్పందానికి తుది రూపం ఇవ్వడం కోసం ఇరు దేశాలు పనిచేస్తున్నట్లు ప్రధాని వెల్లడించారు.

    శ్రీలంకతో రక్షణ సహకారాన్ని బలపరచడం ద్వారానే ప్రాంతీయ భద్రతా పరిస్థితులు మెరుగవుతాయని మోదీ అభిప్రాయపడ్డారు.

    ఈ చర్చలలో ఇంధన భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలు, వలస కార్మికుల సమస్యలపై కూడా చర్చించారు.

    రామేశ్వరం-తలైమన్నార్ ఫెర్రీ సర్వీసులు పునరుద్ధరణ ద్వారా ఇరు దేశాల ప్రజలకు ప్రయాణ సౌలభ్యం కలుగుతుంది. ఇది ద్వైపాక్షిక వాణిజ్యానికి కూడా కీలకంగా మారవచ్చని నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    నరేంద్ర మోదీ
    శ్రీలంక

    తాజా

    Trump: ఖతార్‌ విమాన బహుమతిపై ప్రశ్న.. 'గెట్ అవుట్' అంటూ.. విలేకరిపై మండిపడ్డ ట్రంప్  డొనాల్డ్ ట్రంప్
    IND-USA: జూలై 8లోగా అమెరికా,భారత్ వాణిజ్య ఒప్పందం వాణిజ్యం
    cholera vaccine HillChol: భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన 'హిల్‌కాల్' కలరా టీకా.. క్లినికల్‌ పరీక్షల్లో విజయవంతం టీకా
    Vishaka Metro: అక్టోబర్‌లో విశాఖ మెట్రో పనుల ప్రారంభానికి సిద్ధం: మంత్రి నారాయణ  విశాఖపట్టణం

    నరేంద్ర మోదీ

    BRICS Conference: ప్రధాని నరేంద్ర మోదీ, జీ జిన్‌పింగ్‌ల మధ్య ద్వైపాక్షిక సమావేశం ఎందుకు ముఖ్యమైనది? జిన్‌పింగ్
    BRICS: "మా మద్దతు ఎప్పుడూ దౌత్యానికే".. బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ భారతదేశం
    Modi-Xi Jinping: బ్రిక్స్‌ వేదికగా.. మోదీ-జిన్‌పింగ్‌ ద్వైపాక్షిక చర్చలు  జిన్‌పింగ్
    India-Germany: నైపుణ్యం కలిగిన భారతీయ ఉద్యోగుల కోసం జర్మనీ వీసాలు.. 20వేలు  నుండి 90వేలుకు పెంపు.. ప్రధాని మోదీ   జర్మనీ

    శ్రీలంక

    China-Srilanka-Ariport: చైనాకు షాకిచ్చిన శ్రీలంక...భారత్​, రష్యాలకు డ్రాగన్ నిర్మించిన ఎయిర్ పోర్టు నిర్వహణ బాధ్యతలు  చైనా
    Srilanka: శ్రీలంకలో తీవ్రమవుతున్నఆరోగ్య సంక్షోభం.. ఆసుపత్రులకు తాళం   అంతర్జాతీయం
    Tamilnadu: తమిళనాడుకు చెందిన 22 మంది మత్స్యకారులను అరెస్ట్ చేసిన శ్రీలంక నావికాదళం  తమిళనాడు
    Oman coast : ఒమన్ తీరంలో చమురు నౌక బోల్తా..మృతుల్లో 13 మంది భారతీయులు, ముగ్గురు శ్రీలంక సిబ్బంది ఒమన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025