LOADING...
Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ.6,540 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ.6,540 కోట్లు మంజూరు

Andhra pradesh: ఆంధ్రప్రదేశ్‌కు వ్యవసాయ మౌలిక వసతుల కోసం రూ.6,540 కోట్లు మంజూరు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 06, 2025
10:37 am

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యవసాయ మౌలిక వసతుల నిధి పథకం కింద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ.6,540 కోట్లు కేటాయించబడినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ వెల్లడించారు. ఈ అంశంపై జనసేన పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అడిగిన ప్రశ్నకు మంగళవారం పార్లమెంటులో ఆయన స్పందించారు. దేశవ్యాప్తంగా ఈ పథకానికి మొత్తం రూ.లక్ష కోట్లు కేటాయించామని, ఈ నిధులను అన్ని రాష్ట్రాలు 2025-26 వరకు ఉపయోగించుకోవచ్చని తెలిపారు. రాష్ట్రాల అవసరాలను బట్టి ఈ నిధుల వినియోగం సాగుతుందని చెప్పారు.

వివరాలు 

విశాఖపట్టణం ఐఐపీ విస్తరణ ప్రతిపాదన లేదు 

ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రైతు కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై మాట్లాడుతూ, ప్రతి వ్యవసాయ కుటుంబానికి తలసరి సగటు అప్పు రూ.2.45 లక్షలు ఉన్నట్లు వెల్లడించారు. దేశ స్థాయిలో సగటు అప్పు రూ.74,121 మాత్రమేనని, ఆంధ్రప్రదేశ్‌కి ఇది సుమారు 2.31 రెట్లు అధికంగా ఉందని వివరించారు. ఇది రాష్ట్రంలోని వ్యవసాయ కుటుంబాల మీద పెరుగుతున్న ఆర్థిక భారం స్పష్టంగా చూపిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణం ఐఐపీ విస్తరణపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదన లేదు విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురం ప్రత్యేక ఆర్థిక మండలంలో (SEZ) ఉన్న ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (IIP) కేంద్రాన్ని విస్తరించే ప్రణాళిక ప్రస్తుతానికి లేదని కేంద్ర వాణిజ్య శాఖ సహాయ మంత్రి జితిన్ ప్రసాద్ స్పష్టం చేశారు.

వివరాలు 

 ఐఐపీ కేంద్రం ప్రస్తుతం APIIC లీజుకు ఇచ్చిన స్థలంలో.. 

విశాఖ లోక్‌సభ సభ్యుడు ఎం. శ్రీభరత్ అడిగిన ప్రశ్నకు లోక్‌సభలో సమాధానం ఇస్తూ మంత్రి వివరించారు. ఈ ఐఐపీ కేంద్రం ప్రస్తుతం APIIC లీజుకు ఇచ్చిన స్థలంలో నడుస్తోందని, దీని ప్రాంతీయ ప్రధాన కార్యాలయం హైదరాబాద్‌లో ఉందని తెలిపారు. ప్రస్తుతం విశాఖ కేంద్రంలో స్వల్పకాలిక శిక్షణా కోర్సులు మాత్రమే అందుబాటులో ఉన్నాయని, ఈ కేంద్రం కార్యకలాపాలను విస్తరించే యోజన ఏదీ ప్రస్తుతం లేదని స్పష్టం చేశారు.