NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు
    తదుపరి వార్తా కథనం
    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు
    పోడు రైతులకూ రైతుబంధు వర్తింపు

    అన్నదాతలకు గుడ్ న్యూస్.. నేటి నుంచి రైతుబంధు నిధులు విడుదల,పోడు రైతులకూ వర్తింపు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 26, 2023
    11:38 am

    ఈ వార్తాకథనం ఏంటి

    నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులను తెలంగాణ ప్రభుత్వం జమ చేయనుంది. ఈ మేరకు అర్హులైన రైతుల ఖాతాల్లోకి నగదు బదిలీ ప్రక్రియను చేపట్టింది.

    వర్షాకాలం ఖరీఫ్ సీజన్ కు సంబంధించి రైతన్నలకు పెట్టుబడి సాయంగా ఎకరానికి రూ.10 వేలను బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి వెల్లడించారు.

    అన్నదాతలను ఆర్థికంగా ఆదుకునేందుకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చిందన్నారు. ఈ మేరకు 2 విడతల్లో రైతులకు పంట సాయాన్ని అందిస్తామన్నారు.

    పథకం పదకొండో విడత నిధులు జమచేయనున్న నేపథ్యంలో ఈసారి దాదాపు 70 లక్షల మందికి రైతుబంధు అందనున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.

    DETAILS

    రూ.4 లక్షల మంది పోడు రైతులకూ రైతు బంధు పథకం వర్తింపు 

    ఈసారి అందించబోయే రైతుబంధులో భాగంగా పోడు రైతులకూ ఈ పథకం వర్తింపజేస్తామని ఇటీవలే సీఎం కేసీఆర్ వెల్లడించారు. ఈ మేరకు సుమారు 4 లక్షల మంది పోడు రైతులను లబ్ధిదారులుగా గుర్తించనున్నారు.

    తెలంగాణలోని 1.54 కోట్ల ఎకరాల సాగు భూమికి సంబంధించి మొత్తం రూ.7720.29 కోట్ల నిధులు రైతుల అకౌంట్లో జమ కానున్నాయి. అయితే కొత్తగా 5 లక్షల లబ్దిదారులు ఈ ఏడాది పెట్టుబడి సాయం అందుకోనున్నారు.

    ఈ పథకం పేరిట ఇప్పటివరకు జరిగిన 10 విడతల కేటాయింపుల్లో భాగంగా రూ.65, 190 కోట్లను రైతులకు బదిలీ చేశారు. ఎప్పటి మాదిరే తొలుత ఎకరం లోపు ఉన్న వారికి నిధులు జమచేసి, తర్వాత విస్తీర్ణం మేరకు మిగతా వారికీ అందించనున్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ
    ప్రభుత్వం

    తాజా

    Sreeleela : 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం.. శ్రీలీల ఆళలపై నీళ్లు..! శ్రీలీల
    Srikanth: శ్రీకాంత్ కుటుంబానికి ప్రైవేట్ పూజలు.. వేద పండితుడిపై చర్యలు! శ్రీకాళహస్తి
    Russia-Ukraine: ఉక్రెయిన్‌పై రష్యా భారీ డ్రోన్ దాడి.. ప్రతీకారంగా కీవ్‌ ఎదురుదాడులు ఉక్రెయిన్-రష్యా యుద్ధం
    Bharat Bandh: మావోయిస్టు అగ్రనేత మృతి.. భారత్ బంద్‌కు మావోయిస్టుల పిలుపు కేంద్ర ప్రభుత్వం

    తెలంగాణ

    ఈటలకు అధిష్ఠానం పిలుపు.. కీలక పదవి అప్పగించే అవకాశం భారతీయ జనతా పార్టీ/బీజేపీ
    టీఎస్పీఎస్సీ లీకేజీలో నాంపల్లి కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసిన సిట్.. రూ.1.63 కోట్ల లావాదేవీలు సీజ్  విద్యా శాఖ మంత్రి
    రేపే గ్రూప్ 1 పరీక్ష.. ఏర్పాట్లు పూర్తి చేసిన టీఎస్‌పీఎస్సీ ప్రభుత్వం
    తెలంగాణలో పునఃప్రారంభమైన పాఠశాలలు.. 41 వేల స్కూళ్లు, గురుకులాల రీ ఓపెన్ ప్రభుత్వం

    ప్రభుత్వం

    ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించినా, రాజకీయ భవిష్యత్‌పై నీలినీడలు  పాకిస్థాన్
    తెలంగాణ: ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అల్పాహారంలో రాగి జావ, మిల్లెట్స్‌తో లంచ్ తెలంగాణ
    ఖరీఫ్ సీజన్‌లో రైతుల కోసం కేంద్రం కేబినెట్ కీలక నిర్ణయం; రూ.1.08 లక్షల కోట్ల ఎరువుల సబ్సిడీ మన్‌సుఖ్ మాండవీయ
    పాకిస్థాన్: ఇమ్రాన్ ఖాన్ ఇంటిపై ఏ క్షణమైనా పంజాబ్ పోలీసుల దాడి; ఉగ్రవాదులే టార్గెట్ పాకిస్థాన్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025