NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మరణం.. ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు 
    తదుపరి వార్తా కథనం
    ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మరణం.. ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు 
    ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు

    ఉద్యమ గాయకుడు సాయిచంద్ ఆకస్మిక మరణం.. ఫామ్ హౌస్ లో గుండెపోటుతో కుప్పకూలిన కళాకారుడు 

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Jun 29, 2023
    09:53 am

    ఈ వార్తాకథనం ఏంటి

    తెలంగాణ కళాకారుడు, బీఆర్ఎస్ నేత, గిడ్డంగుల కార్పొరేషన్ ఛైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో ఆకస్మికంగా మరణించారు.

    బుధవారం సాయంత్రం కుటుంబీకులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలం కారుకొండ గ్రామంలోని తన ఫామ్ హౌస్‌కి వెళ్లారు.

    అర్ధరాత్రి సాయిచంద్ తీవ్ర అస్వస్థతకు గురికావడంతో నాగర్ కర్నూల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుగా తేల్చారు.

    ఈ క్రమంలో పరిస్థితి సీరియస్ గా మారడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌కు తరలించారు.

    గచ్చిబౌలి కేర్‌ ఆస్పత్రిలో సాయిచంద్‌ చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సమాచారం అందుకున్న వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు,ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆస్పత్రికి చేరుకున్నారు. సాయిచంద్ ఆకస్మిక మరణంపై సంతాపాన్ని తెలియజేశారు.

    DETAILS

    2021 డిసెంబర్‌లో గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియామకం

    మరోవైపు సాయిచంద్‌ మరణంపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్నవయస్సులోనే హఠాత్తుగా మరణించడం తనను కలచివేసిందన్నారు. ఆయన మరణంతో రాష్ట్రం, గొప్ప గాయకుడిని, కళాకారుడిని కోల్పోయిందన్నారు.

    తెలంగాణ రాష్ట్ర సాధనలో సాయిచంద్ ఎన్నో పాటలు పాడి జనాల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారన్నారు. ఆయన మరణంపై సంతాపం ప్రకటించిన సీఎం, బాధిత కుటుంబీకులకు అండగా ఉంటామని తెలిపారు.

    1984 సెప్టెంబర్‌ 20న వనపర్తి జిల్లా అమరచింత గ్రామంలో సాయిచంద్ జన్మించారు. పీజీ చేసిన సాయి, విద్యార్థి దశ నుంచి గాయకుడిగా, కళాకారుడిగా గుర్తింపు పొందారు.

    రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ ప్రగతిని, సంక్షేమ పథకాలను పాటల ద్వారా వివరించారు. 2021 డిసెంబర్‌లో సీఎం కేసీఆర్‌ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్‌ చైర్మన్‌గా నియమించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    తెలంగాణ

    తాజా

     Madhavi Latha: చరిత్ర సృష్టించిన మాధవి లత.. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ ప్రాజెక్టు కోసం 17 ఏళ్ల కృషి జమ్ముకశ్మీర్
    Knife Attack: డ్రైవర్ జీతం అడిగితే.. కత్తితో దాడి చేసిన బాలీవుడ్ నిర్మాత! బాలీవుడ్
    Encounter : బీజాపూర్ నేషనల్ పార్కులో భారీ ఎన్‌కౌంటర్.. ఐదుగురు మావోయిస్టులు హతం! ఎన్‌కౌంటర్
    Donald Trump-Elon Musk: ట్రంప్‌పై సంచలన వ్యాఖ్యలు.. ఎలాన్ మస్క్ పోస్ట్ తొలగింపు డొనాల్డ్ ట్రంప్

    తెలంగాణ

    నైరుతి మరింత ఆలస్యం.. వచ్చే 4 వారాల పాటు రుతుపవనాలు లేవు, వర్షాల్లేవ్ నైరుతి రుతుపవనాలు
    కొత్తగా పెళ్లయిన జంట ఆత్మహత్య; కారణం ఇదే  మేడ్చల్
    ప్రజల్ని మోసగించలేకే బీఆర్ఎస్ ను వదిలేస్తున్నా: కేసీఆర్ సన్నిహితుడు కుచాడి శ్రీహరిరావు తెలంగాణ రాష్ట్ర సమితి/ టీఆర్ఎస్
    తెలంగాణలో ఐటీ దాడుల కలకలం: బీఆర్ఎస్ ఎంపీ, ఎమ్మెల్యేల ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు  ఆదాయపు పన్నుశాఖ/ఐటీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025