సనాతన ధర్మంపై డిఎంకె మంత్రి రాజా వివాస్పద వ్యాఖ్యలు
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై వివాదం కొనసాగుతున్నవేళ,డీఎంకే మంత్రి,ఎంపి ఎ రాజా గురువారం సనాతన ధర్మాన్ని పై వివాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మాన్నిఎయిడ్స్,లెప్రసీతో పోల్చాలని అన్నారు.ఓ బహిరంగ కార్యక్రమంలో ఏ రాజా మాట్లాడుతూ.. 'సనాతన ధర్మం,విశ్వకర్మ యోజన వేర్వేరు కాదని, అన్ని ఒకటే అన్నారు. మలేరియా, డెంగ్యూ వంటి వాటిని తరిమికొట్టాలని, పోల్చి చెప్పడంలో ఉదయనిధి స్టాలిన్ మృదువుగా వ్యవహరించారని అన్నారు. ఎవరినైనా తీసుకురండి, సనాతన ధర్మంపై చర్చకు నేను సిద్ధంగా ఉన్నాను,అది 10 లక్షలైనా, 1 కోటి అయినా నాకు అభ్యంతరం లేదు అని ఎ రాజా అన్నారు. వారు ఎలాంటి ఆయుధాలైనా తీసుకురానివ్వండి, నేను ఢిల్లీ వచ్చి పెరియార్,అంబేద్కర్ పుస్తకాలతో చర్చిస్తాను అన్నారు.