NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / బీహార్‌లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు
    తదుపరి వార్తా కథనం
    బీహార్‌లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు
    వడ్డీ కోసం మహిళ వివస్త్ర, ఆపై మూత్రం తాగించిన దుండగులు

    బీహార్‌లో ఘోరం.. వడ్డీ కోసం మహిళను వివస్త్రను చేసి మూత్రం తాగించిన దుండగులు

    వ్రాసిన వారు TEJAVYAS BESTHA
    Sep 25, 2023
    06:50 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బీహార్‌లో ఘోర అమానుష ఘటన చోటు చేసుకుంది. పాట్నా జిల్లా మొశింపుర్ గ్రామంలో ఖుర్సుపూర్ ఠాణా పరిధిలో ఓ మహిళకు మూత్రం తాగించారు.

    రూ.1500 అదనపు వడ్డీ చెల్లించాలంటూ తండ్రీ కొడుకులు ఓ దళిత మహిళపై దారుణానికి పాల్పడ్డారు.

    ఈ మేరకు బాధితురాలిని వివస్త్రను చేసి కర్రలతో చితకబాదారు. అంతటితో ఆపకుండా బలవంతంగా ఆమెతో మూత్రం తాగించారు.

    బాధితురాలి భర్త, ప్రమోద్ సింగ్ అనే వ్యక్తి వద్ద రూ.9000 అప్పుగా తీసుకున్నారు. ఆ నగదు మొత్తాన్ని వడ్డీతో సహా తిరిగి చెల్లించారు కూడా.

    ఈ క్రమంలోనే రూ.1500 అదనంగా వడ్డీ చెల్లించాలని ప్రమోద్ సింగ్ పలుమార్లు బాధిత కుటుంబాన్ని భయబ్రాంతులకు గురిచేశాడు.

    details

    పరారీలో ప్రధాన నిందితుడు, అతని కుమారుడు సహా 4 నిందితులు

    అప్పటికే భార్యభర్తలు అప్పు తిరిగి ఇచ్చేశామని చెప్పినా, అదననపు వడ్డీ కోరుతూ శనివారం ప్రమోద్ సింగ్ తన కుమారుడు అన్షు సహా మరో నలుగురు బాధిత ఇంటికి వెళ్లారు.

    అనంతరం ఆమెను బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. ఈ సందర్భంగా అందరూ చూస్తుండగానే ఆమెను వివస్త్రను చేశారు.

    ఆపై కర్రలతో చితకబాదారు.తండ్రి ప్రమోద్ ఆదేశానుసారం కుమారుడు అన్షు బలవంతంగా ఆమెతో మూత్రాన్ని తాగించి తీవ్ర కలకలం రేపాడు.

    తప్పించుకున్న బాధితురాలు, పరిగెత్తుకుంటూ ఠాణాకు వెళ్లి ఫిర్యాదు చేశారు. బాధితురాలి తలకు తీవ్ర గాయాలు కావడంతో పోలీసులు తక్షణమే ఆమెను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

    ప్రధాన నిందితుడు ప్రమోద్ సింగ్, అతని కుమారుడు అన్షుతో పాటు మిగిలిన నలుగురు నిందితులు పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    బిహార్
    అత్యాచారం

    తాజా

    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్
    Deepfake: డీప్‌ఫేక్,రివెంజ్ పోర్న్‌లపై ట్రంప్ కఠిన నిర్ణయం.. 'టేక్ ఇట్ డౌన్' చట్టానికి ఆమోదం  అమెరికా
    NTR: బ్రహ్మర్షి నుంచి భీమ్‌దాకా... ఎన్టీఆర్‌ స్టార్ హీరోగా ఎదిగిన ప్రయాణమిదీ! జూనియర్ ఎన్టీఆర్

    బిహార్

    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు సీబీఐ సమన్లు తేజస్వీ యాదవ్
    తేజస్వికి సీబీఐ సమన్లు జారీ చేయడంపై సీఎం నితీశ్ కుమార్ ఫైర్ నితీష్ కుమార్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్: లాలూ, రబ్రీ దేవి, మిసా భారతికి రూ.50వేల పూచీకత్తుపై బెయిల్ లాలూ ప్రసాద్ యాదవ్
    ల్యాండ్ ఫర్ జామ్ స్కామ్ కేసు: తేజస్వి యాదవ్‌కు మరోసారి సమన్లు జారీ చేసిన సీబీఐ సీబీఐ

    అత్యాచారం

    రాఖీ సావంత్ భర్తపై మరో కేసు- ఇరాన్ విద్యార్థినిపై అత్యాచార ఆరోపణలు కర్ణాటక
    ఇంటర్వ్యూ సాకుతో పిలిచి, మత్తుమందు ఇచ్చి, కారులో మహిళా టెక్కిపై అత్యాచారం మహిళ
    విశాఖపట్నంలో దారుణం; మైనర్ కుమార్తెపై తండ్రి అత్యాచారం; గర్భం దాల్చిన బాలిక విశాఖపట్టణం
    డీఏవీ స్కూల్‌లో మైనర్ రేప్ కేసు: డ్రైవర్‌కు 20 ఏళ్ల జైలు శిక్ష బంజారాహిల్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025