NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..
    మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..

    Kakani Govardhan Reddy: మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ ..

    వ్రాసిన వారు Sirish Praharaju
    Apr 03, 2025
    05:43 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.

    కాకాణిపై ఏ విధమైన తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని హైకోర్టు స్పష్టం చేసింది.

    కాకాణి ముందస్తు బెయిల్, క్వాష్ పిటిషన్లను విచారించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, తెల్లారాయి అక్రమ రవాణాకు సహకరించడంతో పాటు ఎస్సీ/ఎస్టీ కేసును కూడా కాకాణిపై నమోదు చేశారని పొదలకూరు పోలీసులు తెలిపారు.

    అయితే, కాకాణి వేసిన పిటిషన్‌కు విచారణ అర్హత లేదని అడ్వొకేట్ జనరల్ వాదించారు.

    వివరాలు 

    కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడం సముచితం కాదు 

    ఎస్సీ/ఎస్టీ కేసులో మొదట స్పెషల్ కోర్టును ఆశ్రయించాల్సిందే అని ఏజీ అభిప్రాయపడ్డారు.

    కాకాణి నేరుగా హైకోర్టులో పిటిషన్ వేయడం సముచితం కాదని,మొదట స్పెషల్ కోర్టు పిటిషన్‌ను రిజెక్ట్ చేస్తే లేదా రిటర్న్ చేస్తే మాత్రమే హైకోర్టును ఆశ్రయించాలన్న నిబంధన ఉందని ప్రభుత్వం వాదించింది.

    ఈ విషయమై గతంలో పలు కోర్టుల తీర్పులను ఏజీ ఉదాహరించారు.అయితే,స్పెషల్ కోర్టును ఆశ్రయించకుండా నేరుగా హైకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉందని కాకాణి తరఫు లాయర్ వాదించారు.

    సెక్షన్ 18 కింద కేసు నమోదు చేశారని, అలా అయితే సెక్షన్ 14 వర్తించదని కోర్టుకు వివరించారు.

    ఈ కేసులో హైకోర్టుకు స్పెషల్ కోర్టుతో పోల్చితే పెద్ద పరిధి, అధిక అధికారాలు ఉన్నాయని కాకాణి తరఫు లాయర్ వాదన వినిపించారు.

    వివరాలు 

    2016లో లీజు గడువు ముగిసింది 

    ఇక, కొన్ని కేసుల్లో సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినట్లు కోర్టుకు తెలియజేశారు.

    పిటిషన్‌కు విచారణ అర్హత ఉందా? అనే అంశంపై నిర్ణయం తర్వాతే మెరిట్స్‌పై విచారణ జరుగుతుందని హైకోర్టు పేర్కొంది.

    కాగా, తెల్లారాయి అక్రమ మైనింగ్ ప్రభుత్వానికి చెందిన 32 ఎకరాల్లో వేరే వ్యక్తులు నిర్వహిస్తున్నారని, దానికి కాకాణికి సంబంధం లేదని లాయర్ వాదించారు.

    2016లో లీజు గడువు ముగిసిందని,అప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతోందని కోర్టుకు తెలియజేశారు.

    వివరాలు 

    కులం పేరుతో తిట్టారన్నది కేవలం ఆరోపణ మాత్రమే

    దీనిపై అప్పటి నుంచి మైనింగ్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదా? అని హైకోర్టు ప్రశ్నించింది.

    స్థానికంగా నివసించే వారిని కులం పేరుతో తిట్టారన్నది కేవలం ఆరోపణ మాత్రమే అని కాకాణి తరఫు లాయర్ పేర్కొన్నారు.

    తదుపరి విచారణ రేపటికి వాయిదా వేస్తూ, ఈలోపు తొందరపాటు చర్యలు తీసుకోకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలన్న కాకాణి లాయర్ విజ్ఞప్తిని హైకోర్టు తిరస్కరించింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కాకాణి గోవర్ధన్ రెడ్డి

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    కాకాణి గోవర్ధన్ రెడ్డి

    ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2023: వ్యవసాయ రంగానికి రూ.41,436 కోట్ల కేటాయింపులు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు
    Kakani Govardhan Reddy: కాకాణి గోవర్ధన్ రెడ్డి పిటిషన్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం.. భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025