NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం
    కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం

    Road Accident: కుంభమేళా నుంచి తిరుగొస్తుండగా ఘోర ప్రమాదం.. హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు దుర్మరణం

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Feb 11, 2025
    12:38 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ఉత్తర్‌ప్రదేశ్ లోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా ముగించుకుని తిరిగి వస్తున్న కొందరు తెలుగు యాత్రికులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు.

    వారు ప్రయాణిస్తున్న మినీ బస్సును లారీ ఢీకొట్టడంతో, ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

    మధ్యప్రదేశ్‌లోని జబల్‌పుర్ సమీపంలో మంగళవారం ఉదయం 8:30 గంటల ప్రాంతంలో జరిగిన ఈ ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు.

    మృతులు హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందినవారని పోలీసులు నిర్ధారించారు.

    Details

    ప్రమాదానికి కారణం ఏమిటి?

    జబల్‌పుర్‌లోని సిహోరా సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. సిమెంట్‌ లోడుతో వెళ్తున్న లారీ హైవేపై రాంగ్‌ రూట్‌లోకి రావడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

    ఘటనా స్థలంలోనే ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు మినీ బస్సులో చిక్కుకుపోయారు.

    స్థానికులు అప్రమత్తంగా వ్యవహరించి, చిక్కుకుపోయిన వారిని బయటకు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

    గాయపడిన వారిని సిహోరా ఆసుపత్రికి తరలించారు.

    Details

    మృతుల పేర్లు తెలియాల్సి ఉంది

    ప్రమాదానికి గురైన వాహనం నంబర్ AP29 W 1525గా గుర్తించారు. తొలుత మినీ బస్సు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రేషన్ కావడంతో, పోలీసులు మృతులను ఏపీ వాసులని భావించారు.

    అయితే మృతదేహాల వద్ద లభ్యమైన ఆధారాల ద్వారా వారు హైదరాబాద్‌లోని నాచారం ప్రాంతానికి చెందినవారని నిర్ధారించారు.

    మృతుల పేర్లు, ఇతర వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    రోడ్డు ప్రమాదం
    ఉత్తర్‌ప్రదేశ్

    తాజా

    Trade deal: భారత్‌తో త్వరలో వాణిజ్య ఒప్పందం: అమెరికా వాణిజ్య కార్యదర్శి అమెరికా
    World Bicycle Day: రోజూ సైకిల్ తొక్కడం వల్ల ఏం జరుగుతుంది..? నేడు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా తెలుసుకోండి! జీవనశైలి
    Brahmaputra water: బ్రహ్మపుత్రపై పాక్ ప్రచారాన్ని ఖండించిన అస్సాం సీఎం   హిమంత బిస్వా శర్మ
    North East: ఎడతెరిపి లేని వర్షాలతో వణికుతున్న ఈశాన్య భారతం  భారీ వర్షాలు

    రోడ్డు ప్రమాదం

    Accident In Kannur: కన్నూర్‌లో కారు, లారీ ఢీకొని.. చిన్నారి సహా ఐదుగురు మృతి  కేరళ
    Road accident-Truck- Cash Ceased Andhra Pradesh: ఏపీలో వాహనం బోల్తా...అందులోంచి రూ.7కోట్లు స్వాధీనం డబ్బు
    Road Accident: హాపూర్‌లో ఘోర ప్రమాదం.. అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టిన కారు.. ఆరుగురు మృతి  ఉత్తర్‌ప్రదేశ్
    Indore Road Accident: ఇండోర్-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఎనిమిది మంది మృతి  మధ్యప్రదేశ్

    ఉత్తర్‌ప్రదేశ్

    Sambhal violence: బయటపడిన ఆడియో క్లిప్.. ఆయుధాలు తీసుకురావాలని కోరిన వ్యక్తి.. భారతదేశం
    Massive Fire: వారణాసి రైల్వే స్టేషన్‌లో భారీ అగ్నిప్రమాదం ఇండియా
    UP: విద్యార్థి ఫిర్యాదు.. పోయిన షార్ప్‌నర్‌ను వెతికి అందజేసిన పోలీసులు పోలీస్
    Uttar Pradesh: పిలిభిత్‌లో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు ఖలిస్తాన్ ఉగ్రవాదులు హతం!  భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025