NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Firecracker Explosion: పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు 
    తదుపరి వార్తా కథనం
    Firecracker Explosion: పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు 
    పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు

    Firecracker Explosion: పూరీ జగన్నాథుని చందన్ యాత్రలో బాణాసంచా పేలుడు.. 15 మందికి తీవ్ర గాయాలు 

    వ్రాసిన వారు Sirish Praharaju
    May 30, 2024
    08:43 am

    ఈ వార్తాకథనం ఏంటి

    ఒడిశాలోని పూరీలో బుధవారం రాత్రి జగన్నాథుని చందన్ యాత్ర ఉత్సవాల సందర్భంగా బాణాసంచా పేలడంతో 15 మందికి కాలిన గాయాలయ్యాయి.

    ప్రమాదం జరిగిన సమయంలో నరేంద్ర పుష్కరిణి సరోవర్ ఒడ్డున వందలాది మంది ప్రజలు పూజలు చూసేందుకు గుమిగూడారని పోలీసులు తెలిపారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొందరు భక్తులు బాణాసంచా పేలుస్తుండగా నిప్పురవ్వ పడి పేలుడు సంభవించింది.

    మంటలు చెలరేగుతున్న బాణాసంచా ఘటనా స్థలంలో గుమికూడి ఉన్న వారిపై పడిందని, కొందరు తమను తాము రక్షించుకునేందుకు రిజర్వాయర్‌లోకి దూకారని పోలీసులు తెలిపారు.

    క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించామని, వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యుడు తెలిపారు.

    Details 

    ఘటనపై నవీన్ పట్నాయక్ విచారం

    ఈ ఘటనపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

    చికిత్సకు అయ్యే ఖర్చును ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి భరిస్తానని చెప్పారు.

    పూరీ నరేంద్ర పూల్ దగ్గర జరిగిన ప్రమాదం గురించి వినడం బాధాకరమని సీఎం నవీన్ పట్నాయక్ ట్వీట్ చేశారు.

    క్షతగాత్రులకు సరైన చికిత్స అందేలా చూడాలని, ఏర్పాట్లను పర్యవేక్షించాలని చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ, జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    నవీన్ పట్నాయక్ చేసిన ట్వీట్ 

    Odisha CM Naveen Patnaik tweets, "Sorry to hear about the accident near Puri Narendra pool. The chief administrative secretary and the district administration have been directed to ensure proper treatment of the injured and monitor the system. All the medical expenses of the… pic.twitter.com/5bXwQMT4oP

    — ANI (@ANI) May 29, 2024

    Details 

    కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్

    కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్ చేస్తూ, 'పూరీ చందన్ యాత్రలో నరేంద్ర పుష్కరిణి దేవిఘాట్ వద్ద జరిగిన దురదృష్టకర ప్రమాదంలో చాలా మంది గాయపడ్డారనే వార్త విని బాధపడ్డాను.

    భగవంతుని ఆశీస్సులతో గాయపడిన వారు త్వరగా చికిత్స పొంది ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటున్నాను.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    ధర్మేంద్ర ప్రధాన్ ట్వీట్

    Union Minister Dharmendra Pradhan tweets, "I am saddened to hear the news of many injured in the unfortunate accident that took place at Narendra Pushkarini Devighat during the Puri Chandan Yatra. With the blessings of the Lord, it is my wish that those who are under treatment… pic.twitter.com/vxlN3dTAZ0

    — ANI (@ANI) May 29, 2024
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    ఒడిశా
    నవీన్ పట్నాయక్

    తాజా

    Covid 19 : హాంకాంగ్, సింగపూర్ లో మళ్ళీ పెరుగుతున్న కోవిడ్ కేసులు కోవిడ్
    India Womens Squad : హర్మన్ ప్రీత్ సారథ్యంలో ఇంగ్లండ్ టూర్ కు వెళ్తున్న వుమెన్స్ జట్టు ఇదే.. బీసీసీఐ
    Turkey: టర్కీపై దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం.. ఒప్పందాలు రద్దు చేసుకుంటున్న భారత యూనివర్సిటీలు.. బాయ్‌కాట్‌ టర్కీ
    India Turkey: టర్కీకి బిగ్ షాక్ ఇచ్చిన భారత్.. విమానయాన సంస్థతో ఒప్పందం రద్దు.. కేంద్ర ప్రభుత్వం

    ఒడిశా

    ఒడిశా రైలు ప్రమాదంపై సీబీఐ విచారణ ఎందకంటే?  రైలు ప్రమాదం
    రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన ప్రమాదం; రైల్వే గేటును ఢీకొట్టిన ట్రాక్టర్  రైలు ప్రమాదం
    ఒడిషా ఘటనలో 51 గంటల ఆపరేషన్.. స్వయంగా నడిపించిన రైల్వే మంత్రి రైల్వే శాఖ మంత్రి
    అగ్ని ప్రైమ్ గ్రాండ్ సక్సెస్.. ఒడిశా తీరం నుంచి పరీక్షించిన భారత్ అంతరిక్షం

    నవీన్ పట్నాయక్

    కొత్త పార్లమెంటు ప్రారంభోత్సవానికి వెళ్లేందుకు ఆ రెండు పార్టీలు రెడీ  నరేంద్ర మోదీ
    ఒడిశాలో పెండ్లి బస్సు- ఆర్టీసీ బస్సు ఢీ; 12మంది దుర్మరణం  ఒడిశా
    Naveen Patnaik: నవీన్ పట్నాయక్ రికార్డు; దేశంలో ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా ఘతన  పశ్చిమ బెంగాల్
    దిల్లీ సర్వీస్ బిల్లులో మీకు ఏం మెరిట్స్ కనిపించాయి? వైసీపీ, బీజేడీకి చిదంబరం ప్రశ్నలు దిల్లీ ఆర్డినెన్స్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025